Constitution of india : భారత రాజ్యాంగ అక్షరశిల్పి ఎవరో తెలుసా!
భారత రాజ్యాంగం అసలు ఆంగ్ల ప్రతి అందమైన చేతిరాతతో ఉంటుంది. దిల్లీకి చెందిన కాలిగ్రాఫర్ ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజద తన దస్తూరితో రాజ్యాంగం మొత్తాన్ని రాశారు. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.
(Image : twitter)
జనవరి 26న యావత్ భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని(republic day) ఘనంగా నిర్వహించుకొంటోంది. స్వరాజ్యం సిద్ధించిన తరువాత మనకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆ నాటి నేతలు భావించారు. ఆ దిశగా అడుగులు వేసి మనది సర్వసత్తాక, సామ్యవాద, గణతంత్ర దేశంగా ప్రకటిస్తూ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ప్రక్రియలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి రాజ్యాంగం మొత్తం ఒకరే లిఖించడం. ఆ కథేంటో తెలుసుకోండి.
నాడు స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించిన నాయకులు భారత(India) రాజ్యాంగాన్ని రచించేందుకు అనేక మల్లగుల్లాలు పడ్డారు. కొంత మంది సభ్యులతో కలిసి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి.. రాజ్యాంగ రచన చేయాలని నిర్ణయించారు. వారంతా పలుదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. వాటిల్లోని ముఖ్యాంశాలను భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. మార్పులు, చేర్పులు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ముసాయిదా ప్రతులను ప్రింట్ తీయించేవారు. చివరికి భారత రాజ్యాంగం ఓ కొలిక్కి వచ్చింది. ఇక దానిని సరిగ్గా కూర్పు చేసి ప్రింట్ చేయడమే తరువాయి.
అప్పుడే నెహ్రూ(Jawaharlal Nehru)కి ఓ ఆలోచన వచ్చింది. భారత రాజ్యాంగానికి ఏదైనా ప్రత్యేకత ఉండాలని భావించారు. చేతిరాతతో రాజ్యాంగాన్ని లిఖించాలని నిశ్చయించుకున్నారు. అందమైన ఇటాలిక్ చేతిరాతలో నిపుణులు తమను సంప్రదించాలంటూ రేడియోలో ప్రకటన జారీ చేశారు. అప్పుడు తెరపైకి వచ్చారు కాలిగ్రఫీలో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజద(Prem Behari Narain Raizada).
ఎవరీ ప్రేమ్ బెహరీ?
ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజద 1901 డిసెంబరు 16న జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో తాత రామ్ ప్రసాద్ సక్సేనా వద్ద పెరిగారు. ఆయన పర్షియన్, ఇంగ్లిషు భాషల స్కాలర్. కాలిగ్రఫీ(calligraphy) టీచర్గానూ పనిచేశారు. వీరి కుటుంబమంతా కాలిగ్రఫీ రంగంలో స్థిరపడింది. ప్రేమ్కు చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉండేది. దానిని గమనించిన రామ్ ప్రసాద్.. అతడికి కాలిగ్రఫీలో శిక్షణ ఇచ్చారు. అనంతరం దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ప్రేమ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత నుంచి పూర్తి స్థాయి కాలిగ్రఫీ సాధకుడిగా మారిపోయారు. అక్షరాలను అందంగా మలిచి ఆ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
పైసా వద్దు.. పేరు కావాలి..
రేడియోలో ప్రకటన వెలువడిన సమయంలో గోవన్ బ్రదర్స్ లిమిటెడ్ అనే సంస్థలో ప్రేమ్ బెహరీ నారాయణ్ పనిచేస్తున్నారు. అతడి గురించి తెలుసుకున్న నెహ్రూ ఆయనను పిలిపించి మాట్లాడారు. రాజ్యాంగం మొత్తం రాయడానికి ఎంత సొమ్ము తీసుకుంటారని నెహ్రూ అడగ్గా.. ‘ఒక్క పైసా కూడా అవసరం లేదు. దేవుని దయ వల్ల నా వద్ద అన్నీ ఉన్నాయి. నా జీవితం పట్ల నేను సంతృప్తిగా ఉన్నానని’ ప్రేమ్ బదులిచ్చారు. అయితే, తన మనసులో ఉన్న ఒక్క కోరికను మాత్రం నెహ్రూకు చెప్పారు. అదేంటంటే.. ప్రతి పేజీలో చివరన తన పేరు, రాజ్యాంగం చివరలో తన తాత రామ్ ప్రసాద్ సక్సేనా పేరు ఉండాలని కోరారు. అందుకు అంగీకరించిన నెహ్రూ.. రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను అప్పగించారు.
ఆరు నెలల పాటు సాగిన అక్షర యజ్ఞం
తన సొంత దస్తూరితో రాజ్యాంగాన్ని రచించడానికి సిద్ధమైన ప్రేమ్ రాజ్యాంగ సభ తనకు కేటాయించిన గదిలో కూర్చున్నారు. అప్పటికే రచనకు కావాల్సిన పార్చ్మెంట్ షీట్లు, పాళీలను బర్మింగ్హామ్, చెకొస్లొవేకియా నుంచి తెప్పించి ఉంచారు. వెయ్యేళ్లు మన్నికగా ఉండే ఆ పార్చ్మెంట్ షీట్లపై రాజ్యాంగాన్ని ప్రేమ్ రాస్తూ ఉంటే.. మరో వైపు శాంతినికేతన్కు చెందిన నందలాల్ బోస్ తన శిష్యులతో కలిసి ఆ పేజీలను వివిధ చిత్రాలతో అందంగా తీర్చిదిద్దేవారు. వాటిలో మొహంజోదారో, రామాయణం, మహాభారతం, గౌతమ బుద్ధుడు, అశోకుడు, అక్బర్, తదితరుల కాలం నాటి దృశ్యాలను చిత్రీకరించారు. అలా రాజ్యంగ రచన మొత్తాన్ని దాదాపు 6 నెలల్లో పూర్తి చేశారు. ఇందు కోసం మొత్తం 432 పాళీలను ప్రేమ్ బెహరీ వాడారు. ఈయన రచించిన రాజ్యాంగం అసలు కాపీని ప్రస్తుతం పార్లమెంటులో భద్రపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ