Pure honey : ప్రపంచంలోనే స్వచ్ఛమైన తేనె.. ఇక్కడ దొరుకుతుందట!
చిలీకి (Chile) సమీపంలోని ఒక ద్వీపంలో (Island) స్వచ్ఛమైన తేనె దొరుకుతుందట. ఇక్కడి తేనెటీగలపై (Honey bees) కొన్ని రకాల పరిశోధనలు కూడా చేశారు.
ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రం (Pacific ocean) మధ్యలో ఒక ద్వీపం (Island) ప్రపంచానికి ఒక మూలకు విసిరేసినట్టుగా ఉంటుంది. చిలీకి (Chile) సమీపంలోని ఆ ప్రాంతాన్ని ఈస్టర్ ఐలాండ్ (Easter island) అని పిలుస్తుంటారు. ఆ ద్వీపంలో పెరిగే మొక్కలు, చెట్లపై ఎలాంటి పురుగు మందులు చల్లరు. దాంతో అక్కడ తేనెటీగలు (Honey bees) ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యకర జీవనం సాగిస్తున్నాయి. ఫలితంగా అవి ఈ భూ ప్రపంచంలోనే స్వచ్ఛమైన తేనెను (Honey) ఉత్పత్తి చేయగలుగుతున్నాయి.
ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచ నలుమూలల్లో పెరిగే అన్ని రకాల తేనెటీగలు విషపూరిత రసాయనాలు చల్లిన మొక్కలపై వాలుతున్నాయి. దాంతో వాటికి కొత్త కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాతావరణ మార్పులు కూడా తేనెటీగల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కానీ.. ఇలాంటి ప్రమాదాలేవీ ఈస్టర్ ఐలాండ్ తేనెటీగలకు లేవు. వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పెంపకందారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి తేనెటీగలను దిగుమతి చేసుకోకుండా స్థానిక ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. కొత్త రకాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే స్థానిక తేనెటీగల ప్రత్యేక గుణం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు.. ప్రకృతి సహకారం
ఈ ప్రాంత తేనెటీగలు సురక్షితంగా పెరగడానికి కారణం రైతులు. వారు ఎలాంటి పురుగుమందులు చల్లకుండానే వ్యవసాయం చేస్తున్నారు. అందుకోసం కొన్ని రకాల పురాతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇక ఇక్కడ పారే నీరు కూడా చాలా సహజంగా.. స్వచ్ఛంగా ఉంటుంది. నీటి అవసరాలు ఎక్కువగా ఉంటే వర్షపునీటిని పోగు చేసి దాచుకుంటారు. దాంతో ఈ ద్వీపం అంతటా స్వచ్ఛమైన నీరు మాత్రమే ప్రవహిస్తోంది. అందువల్లే తేనెటీగలకు ఎలాంటి జబ్బులు సోకడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వ్యాధులు లేకపోవడంతో తేనె తయారీదారులు కూడా యాంటీ బయోటిక్స్ వాడటం లేదు. ద్వీపంలోని మరో ప్రత్యేకత ఏంటంటే అధిక తేమతో కూడిన వాతావరణం. అది తేనెలో అధిక ద్రవ స్థిరత్వాన్ని పోగు చేస్తోంది. ఆ చర్య స్ఫటికీకరణను నిరోధిస్తోంది.
పరిశోధనలు ఏం తేల్చాయంటే..!
ఈస్టర్ ద్వీపంలోని తేనెటీగలు నిజంగా అంత ప్రత్యేకమైనవా? అని తేల్చేందుకు కొన్ని రకాల పరిశోధనలు చేశారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచంలోని మిగతా ఏ తేనెటీగల జాతితోనూ వీటికి సంబంధం లేదని తేలింది. ఇక్కడ పరాగ సంపర్కాలు జరిగే తీరు కూడా భిన్నంగా ఉన్నట్లు కనుగొన్నారు. అందుకే ఈ అరుదైన జాతి తేనెటీగలను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈస్టర్ ద్వీపంలో పెరిగే తేనెటీగలు అత్యంత ఆరోగ్యవంతమైనవి మాత్రమే కాదు. వీటిలో ఉత్పాదక సామర్థ్యం కూడా ఎక్కువేనని వెల్లడైంది. ఈ ద్వీపంలోని ఆహ్లాదకరమైన వాతావరణం వాటికి చాలా అనువుగా ఉన్నట్లు తెలిసింది. ఏడాది పొడవునా వసంతకాలంలా ఉంటుంది. అందువల్ల తేనెటీగలు నిత్యం చురుగ్గా కదులుతుంటాయి. పుష్పించే మొక్కలపై వాలుతూ మకరందాన్ని జుర్రుతుంటాయి. సంవత్సర కాలంలో ఒక తేనెటీగల సమూహం 90 నుంచి 120 కిలోల తేనెను ఉత్పత్తి చేయగలుగుతాయట. ఇదే పరిమాణంలోని మిగతా తేనెటీగలకు 20 కిలోల ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం