Raccoon dog : వుహాన్ మార్కెట్లో రాకూన్ జాతి కుక్కలు.. ఎలా ఉంటాయో తెలుసా!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఎక్కడ పుట్టింది అనే ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం దొరకలేదు. వుహాన్ ల్యాబ్, చేపలు, గబ్బిలాలు, అలుగు.. ఈ జాబితాలోకి తాజాగా రాకూన్ జాతి కుక్కలు చేరిపోయాయి.
ఇటీవల చైనా(China)లోని వుహాన్(wuhan)లో హువానాన్ టోకు చేపల మార్కెట్ నుంచి సేకరించిన డేటాను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. మార్కెట్లో విక్రయించే రాకూన్ జాతి కుక్కల(Raccoon dog) జన్యుపదార్థంలో కొవిడ్(Covid) కారక సార్స్కోవ్-2 వైరస్ ఆనవాళ్లు కనిపించాయని తేలింది. దీన్నిబట్టి కొవిడ్ కారక కరోనా వైరస్ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించినది కాదనీ, అది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకూన్ జాతి కుక్కలు(Raccoon dog) ఎలా ఉంటాయి? ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఏంటీ రాకూన్ జాతి కుక్కలు?
రాకూన్ జాతి కుక్కలు క్యానిడ్ ఫ్యామిలీకి చెందినవి. ఇవి ఇంచు మించు నక్క జాతితో సంబంధం కలిగి ఉంటాయి. చలికాలంలో నిద్రాణ స్థితిలోకి వెళతాయి. వీటిలో రెండు రకాలున్నాయి 1.నిక్టెయూట్స్ ప్రాసీ అనాయిడీస్(ది కామన్ రాకూన్ డాగ్) 2.నిక్టెయూట్స్ పి. వివర్రినస్(ది జపనీస్ రాకూన్ డాగ్). వుహాన్ మార్కెట్లో దొరికే కుక్కలు ఒక్కొక్కటి దాదాపు 7 కేజీలకు పైగా బరువుంటాయి. ఈ జంతువులు సర్వభక్షకాలు.. అన్ని రకాల ఆహార పదార్థాలు తింటాయి. ఎలుకలు మొదలుకొని బెర్రీల వరకు ఏవైనా సరే ఆరగిస్తాయి. వేసవిలో చురుగ్గా తిరుగుతూ ఆహారం సేకరిస్తాయి. చలికాలంలో స్థిరంగా ఒక చోట ఉండిపోతాయి. వీటి జుట్టు కూడా మందంగా ఉంటుంది. జతలు జతలుగా కలిసి ఉండే ఈ కుక్కలు ఒక దాంతో మరొకటి మాత్రమే సహజీవనం చేయడానికి ఇష్టపడతాయని సమాచారం.
ఎక్కడున్నాయి?
రాకూన్ జాతి కుక్కలు తూర్పు ఆసియాకు చెందినవి. చైనా(China), కొరియా, జపాన్(Japan)లో ఎక్కువగా కన్పిస్తాయి. వాటిని ‘తనుకి’ అని కూడా పిలుస్తారు. ఐరోపాలోనూ వీటి సంచారం ఉంది. 1920 నుంచే రాకూన్ కుక్కల వెంట్రుకలతో వ్యాపారం చేశారు. ప్రస్తుతం ఐరోపా పర్యావరణ వ్యవస్థకు రాకూన్ కుక్కలు హాని చేస్తున్నాయని భావిస్తున్నారు. జపాన్లో మాత్రం రాకూన్ కుక్కలను గౌరవంగా చూస్తున్నారు.
వుహాన్లో అత్యధిక విక్రయాలు
రాకూన్ కుక్కల వెంట్రుకల కోసం కొన్ని దశాబ్దాలుగా చైనాలో వీటిని పెంచుతున్నారు. అలా కొన్ని వేల జంతువులను ఇప్పటి వరకు వధించారు. వాటి మాంసాన్ని కూడా విక్రయించారు. వీటి నుంచి తీసిన వెంట్రుకలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. డిమాండ్ బాగా ఉండటంతో ఈ కుక్కలను చిన్నపాటి బోనుల్లో ఉంచి పెంచుతున్నారు. కొన్నిసార్లు ఇతర జంతువులను కూడా వీటితో కలిపి ఉంచుతారు. ఈ కారణం చేతనే వివిధ రకాల కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
వ్యాధులకు కారణం!
చైనాలో 2003లో సార్స్ కరోనా వైరస్ ప్రబలిన సమయంలోనే ఆ ఆనవాళ్లు ఈ రాకూన్ జాతి కుక్కల్లో కూడా కన్పించినట్లు ఎన్పీఆర్ నివేదికలో వెల్లడైంది. 2022లో చైనాలోని 18 రకాల జాతులకు చెందిన 2వేల జంతువుల నుంచి శాంపిళ్లు తీశారు. అందులో రాకూన్ జాతి కుక్కలు కూడా ఉన్నాయి. మొత్తంగా 13 వైరల్ ఫ్యామిలీకి చెందిన 102 రకాల వైరస్లు వాటిలో ఉన్నట్లు తేలింది. అందులో 21 రకాలు మానవులకు అత్యంత ప్రమాదకరం అని వెల్లడైంది. రాకూన్లలో.. కుక్క జాతులకు సంబంధించిన నాలుగు రకాల కరోనా వైరస్ల ఆనవాళ్లున్నాయని ఆ నివేదిక తెలిపింది. మానవుల్లో బయటపడిన కరోనాకు దీనికి కొంచెం సంబంధం ఉన్నట్లు అందులో ప్రస్తావించారు.
కరోనాపై స్పష్టత కరవు
వుహాన్లో సేకరించిన జన్యు నమూనాలో రాకూన్ కుక్క న్యూక్లిక్ ఆమ్లం, వైరస్ న్యూక్లిక్ ఆమ్లం కలిసి ఉన్నాయని కనిపెట్టారు. ఒకవేళ రాకూన్ కుక్కకు కొవిడ్ వైరస్ సోకినా దాని నుంచి అది నేరుగా మానవులకు వ్యాపించి ఉండకపోవచ్చనీ, అసలు మానవుల ద్వారానే కుక్కకు వైరస్ సోకి ఉండవచ్చనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరేదైనా జంతువు నుంచి కూడా రాకూన్ కుక్కకు కొవిడ్ వైరస్ సోకి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతానికి జంతువుల నుంచే మానవులకు వైరస్ సోకిందన్న వాదనకే మొగ్గు చూపుతున్నారు. ఈ డేటా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అథనోమ్ మాట్లాడుతూ ‘మహమ్మారి ఎలా ప్రబలింది అనే ప్రశ్నకు ఈ డేటాలో సమాధానం దొరకట్లేదు. కానీ ప్రతి చిన్న సమాచారం కూడా సమాధానం కనుక్కునేందుకు దోహదపడుతుందని’ ఆయన అభిప్రాయపడ్డారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో