‘రీ-ఇన్ఫెక్షన్’ గా ఎప్పుడు పరిగణిస్తారంటే..?
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 102 రోజుల్లో మళ్లీ పాజిటివ్ రావడంతో పాటు మధ్యలో ఒకసారి నెగటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్ఫెక్షన్గా పరిగణించాలని ఐసీఎంఆర్ వెల్లడించింది.
నిర్వచించిన ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ఇదివరకే కొవిడ్ సోకిన వారికి మళ్లీ పాజిటివ్(రీ-ఇన్ఫెక్షన్) వస్తుందనే పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీ-ఇన్ఫెక్షన్కు సాంకేతికపరంగా స్పష్టమైన నిర్వచనాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల్లోపు మళ్లీ పాజిటివ్ రావడంతో పాటు మధ్యలో ఒకసారి నెగటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్ఫెక్షన్గా పరిగణించాలని స్పష్టం చేశారు.
భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో రీ-ఇన్ఫెక్షన్ కేసులు బయటపడుతుండడంతో శాస్త్రవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు భారత్లోనూ కొవిడ్-19 రీ-ఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ రీ-ఇన్ఫెక్షన్కు ఇప్పటి వరకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వీటిపై అధ్యయనం చేపట్టింది. 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్ రావడంతో పాటు మధ్యలో ఓసారి నెగటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్ఫెక్షన్గా పరిగణించాలని పేర్కొంది. అంతేకాకుండా కరోనా రీ-ఇన్ఫెక్షన్ను నిర్ధారించాలంటే జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడం అవసరమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను కేంబ్రిడ్జ్కు చెందిన ఎపిడమాలజీ అండ్ ఇన్ఫెక్షన్ జర్నల్లో ప్రచురితమయ్యింది.
ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు చేపట్టిన రీ-ఇన్ఫెక్షన్ అధ్యయనంలో భాగంగా 58మంది కొవిడ్ రోగులపై పరిశోధన చేపట్టారు. వీరిలో 12మంది ఆరోగ్య కార్యకర్తలున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారికి తొలుత పాజిటివ్ వచ్చిన సమయంలో వైరల్ లోడ్ తీవ్రంగా ఉండి, లక్షణాలు కనిపించని వారే అధిక సంఖ్యలో ఉన్నారు. రెండోసారి వైరస్ సోకినపుడు మాత్రం కొందరిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇప్పటి వరకు కరోనా రీ-ఇన్ఫెక్షన్పై ప్రపంచ వ్యాప్తంగా ఏకాభిప్రాయం లేదని అధ్యయన బృందం పేర్కొంది. అమెరికా వ్యాధుల నియంత్రణ నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకారం, ఓ వ్యక్తికి 90 రోజుల అనంతరం మళ్లీ పాజిటివ్ వస్తే, జీనోమ్ సీక్వెన్స్ ద్వారా రీ-ఇన్ఫెక్షన్ను నిర్దారించాలని సూచిస్తోంది. తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఐసీఎంఆర్ ఆ వ్యవధి కనీసం 102రోజులుగా ఉండాలని పేర్కొంది. ఇలా వీటిని నిర్ధారించుకునేందుకు పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను లక్షల సంఖ్యలో సేకరించి నిల్వ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదని అధ్యయనం బృందం అభిప్రాయపడింది. అయితే, వైరస్ ప్రమాదం పొంచివున్న పాజిటివ్ వచ్చిన వైద్య ఆరోగ్య సిబ్బంది నమూనాలను తదుపరి పరీక్షల కోసం(రీ-ఇన్ఫెక్షన్) భద్రపరచుకోవచ్చని ఐసీఎంఆర్ నివేదిక సూచించింది.
కొవిడ్ రీ-ఇన్ఫెక్షన్ అరుదుగా సంభవిస్తుందని.. వృద్ధులు మాత్రం రీ-ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘ది లాన్సెట్’ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సార్స్-కోవ్-2 రీ-ఇన్ఫెక్షన్ అత్యంత అరుదైన విషయం అయినప్పటికీ, వైరస్ పర్యవేక్షణ వ్యవస్థలను రూపొందించుకోవడంలో రీ-ఇన్ఫెక్షన్ నిర్వచనం ఎంతో అవసరమని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అందుకే కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా మరోసారి వైరస్ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్నవారు వ్యక్తిగత శుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం మరిచిపోవద్దని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్