Twitter: ట్విటర్ అకౌంట్ ఎందుకు సస్పెండ్ అవుతుంది?
ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సోషల్మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ట్విటర్ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ట్విటర్ అకౌంట్లు సస్పెండ్కు గురవుతున్నాయి. ఎందుకలా? దీనికి దారితీస్తున్న కారణాలేంటి?
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..
నెటిజన్లు వర్తమాన వ్యవహారాలపై ట్విటర్ వేదికగా చర్చిస్తుంటారు. కానీ, ఈ మధ్య అదే ట్విటర్ వార్తల్లోకి ఎక్కి చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తానని ప్రతిపాదించిన దగ్గర నుంచి దాన్ని సొంతం చేసుకొని తీసుకుంటున్న నిర్ణయాల వరకు అన్నీ వివాదాస్పదమై.. వార్తల్లో నిలిచాయి. మరోవైపు ట్విటర్ అకౌంట్ల సస్పెన్షన్పై కొంతకాలంగా పెద్ద రగడే కొనసాగుతోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీనికి గల కారణం ఏంటీ..?
ఒకప్పుడు ప్రముఖులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించే ట్విటర్.. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను, భావాలను ట్విటర్ వేదికగా వ్యక్తపరుస్తున్నారు. చాలా మందికి ఈ సోషల్మీడియా వేదికలో ఖాతా ఉంటుంది. కానీ, ఒక్కోసారి కొందరి అకౌంట్లు సస్పెండ్ అవుతుంటాయి. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కొందరు భాజపా నేతలు, తాజాగా ‘కాంతార’ నటుడు కిశోర్ ట్విటర్ ఖాతాలను నిలిపివేశారు.
ఎవరిదైనా అకౌంట్ సస్పెండ్ అయిందంటే.. వారు ట్విటర్ పాలసీని ఉల్లంఘించారని, లేదా యూజర్ అకౌంట్కు సంబంధించి భద్రతా లోపాలు బయటపడ్డాయని అర్థం. అసలు ఖాతా సస్పెండ్కు దారితీసే కారణాలేవో ఓసారి చూద్దాం..
►⇒ చాలా వరకు సస్పెండ్కు గురయ్యే అకౌంట్లు ఫేక్ లేదా స్పామ్ అయి ఉంటాయి. అలాంటి అకౌంట్లు ట్విటర్ యూజర్ల భద్రతను ప్రమాదంలోకి నెట్టే అవకాశముంది. అందుకే అలాంటి అకౌంట్లను సంస్థ సస్పెండ్ చేస్తుంటుంది.
⇒ ఖాతా హ్యాక్కి గురైనా లేదా వ్యక్తిగత వివరాలు లీక్ అయినా యూజర్ భద్రతా కారణాల దృష్ట్యా అకౌంట్ సస్పెండ్ అవుతుంది. ముప్పు తొలగిన తర్వాత మళ్లీ అకౌంట్ను పునరుద్ధరిస్తారు.
►⇒ ఇతరులను జాతి, జాతీయత, ప్రాంతీయత, కులం, లింగ బేధం, వయసు, వైకల్యం, తీవ్ర వ్యాధుల గురించి ప్రస్తావిస్తూ కించపరచడం/బెదిరింపు/వేధించే విధంగా ట్వీట్లు చేసినా.. వారి అకౌంట్ను సస్పెండ్ చేస్తారు. అలాగే, కావాలని వేరొకరి పేరుతో ఖాతా తెరిచి.. వారిలా అనుకరించినా, వారి వ్యక్తిగత సమాచారం బయటపెట్టినా అకౌంట్ను నిలిపివేస్తారు.
►⇒ ట్విటర్లో హింసాత్మక, అభ్యంతరకర వీడియోలు షేర్ చేసినా అకౌంట్ సస్పెండ్ అవుతుంది.
►⇒ ఆత్మహత్యకు ప్రేరేపించే కంటెంట్, తమకు తాము గాయపర్చుకునే వీడియోలను ట్విటర్లో పంచుకున్నా.. ఆయా ఖాతాలను ట్విటర్ నిలిపివేస్తుంది.
►⇒ ట్విటర్ను అక్రమ వస్తువుల్ని అమ్మడానికి లేదా కొనడానికి.. చట్టవిరుద్ధ పనులకు ఉపయోగిస్తే అకౌంట్ను ఆపేస్తారు.
►⇒ ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ట్విటర్ వేదికగా ఏ రకంగా ప్రోత్సహించినా వారి ఖాతాను సస్పెండ్ చేస్తారు.
►⇒ చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి ఎలాంటి కంటెంట్నైనా ట్విటర్ ఉపేక్షించదు. అలాంటి వాటిని పోస్ట్ చేసినా, షేర్ చేసినా వారి అకౌంట్లు సస్పెండ్ అవుతాయి.
యూజర్ల యాక్టివిటిని ఎప్పటికప్పుడు గమనించే ట్విటర్.. తమ పాలసీని ఉల్లంఘించిన వారి అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. అలాగే, యూజర్లు ఇలాంటి ఖాతాను రిపోర్టు చేస్తే.. పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. అందుకే ట్విటర్ను వినియోగించేటప్పుడు పై విషయాలను గుర్తుంచుకోవడం మంచిది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.