Twitter: ట్విటర్ అకౌంట్ ఎందుకు సస్పెండ్ అవుతుంది?
ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సోషల్మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ట్విటర్ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ట్విటర్ అకౌంట్లు సస్పెండ్కు గురవుతున్నాయి. ఎందుకలా? దీనికి దారితీస్తున్న కారణాలేంటి?
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..
నెటిజన్లు వర్తమాన వ్యవహారాలపై ట్విటర్ వేదికగా చర్చిస్తుంటారు. కానీ, ఈ మధ్య అదే ట్విటర్ వార్తల్లోకి ఎక్కి చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తానని ప్రతిపాదించిన దగ్గర నుంచి దాన్ని సొంతం చేసుకొని తీసుకుంటున్న నిర్ణయాల వరకు అన్నీ వివాదాస్పదమై.. వార్తల్లో నిలిచాయి. మరోవైపు ట్విటర్ అకౌంట్ల సస్పెన్షన్పై కొంతకాలంగా పెద్ద రగడే కొనసాగుతోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీనికి గల కారణం ఏంటీ..?
ఒకప్పుడు ప్రముఖులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించే ట్విటర్.. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను, భావాలను ట్విటర్ వేదికగా వ్యక్తపరుస్తున్నారు. చాలా మందికి ఈ సోషల్మీడియా వేదికలో ఖాతా ఉంటుంది. కానీ, ఒక్కోసారి కొందరి అకౌంట్లు సస్పెండ్ అవుతుంటాయి. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కొందరు భాజపా నేతలు, తాజాగా ‘కాంతార’ నటుడు కిశోర్ ట్విటర్ ఖాతాలను నిలిపివేశారు.
ఎవరిదైనా అకౌంట్ సస్పెండ్ అయిందంటే.. వారు ట్విటర్ పాలసీని ఉల్లంఘించారని, లేదా యూజర్ అకౌంట్కు సంబంధించి భద్రతా లోపాలు బయటపడ్డాయని అర్థం. అసలు ఖాతా సస్పెండ్కు దారితీసే కారణాలేవో ఓసారి చూద్దాం..
►⇒ చాలా వరకు సస్పెండ్కు గురయ్యే అకౌంట్లు ఫేక్ లేదా స్పామ్ అయి ఉంటాయి. అలాంటి అకౌంట్లు ట్విటర్ యూజర్ల భద్రతను ప్రమాదంలోకి నెట్టే అవకాశముంది. అందుకే అలాంటి అకౌంట్లను సంస్థ సస్పెండ్ చేస్తుంటుంది.
⇒ ఖాతా హ్యాక్కి గురైనా లేదా వ్యక్తిగత వివరాలు లీక్ అయినా యూజర్ భద్రతా కారణాల దృష్ట్యా అకౌంట్ సస్పెండ్ అవుతుంది. ముప్పు తొలగిన తర్వాత మళ్లీ అకౌంట్ను పునరుద్ధరిస్తారు.
►⇒ ఇతరులను జాతి, జాతీయత, ప్రాంతీయత, కులం, లింగ బేధం, వయసు, వైకల్యం, తీవ్ర వ్యాధుల గురించి ప్రస్తావిస్తూ కించపరచడం/బెదిరింపు/వేధించే విధంగా ట్వీట్లు చేసినా.. వారి అకౌంట్ను సస్పెండ్ చేస్తారు. అలాగే, కావాలని వేరొకరి పేరుతో ఖాతా తెరిచి.. వారిలా అనుకరించినా, వారి వ్యక్తిగత సమాచారం బయటపెట్టినా అకౌంట్ను నిలిపివేస్తారు.
►⇒ ట్విటర్లో హింసాత్మక, అభ్యంతరకర వీడియోలు షేర్ చేసినా అకౌంట్ సస్పెండ్ అవుతుంది.
►⇒ ఆత్మహత్యకు ప్రేరేపించే కంటెంట్, తమకు తాము గాయపర్చుకునే వీడియోలను ట్విటర్లో పంచుకున్నా.. ఆయా ఖాతాలను ట్విటర్ నిలిపివేస్తుంది.
►⇒ ట్విటర్ను అక్రమ వస్తువుల్ని అమ్మడానికి లేదా కొనడానికి.. చట్టవిరుద్ధ పనులకు ఉపయోగిస్తే అకౌంట్ను ఆపేస్తారు.
►⇒ ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ట్విటర్ వేదికగా ఏ రకంగా ప్రోత్సహించినా వారి ఖాతాను సస్పెండ్ చేస్తారు.
►⇒ చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి ఎలాంటి కంటెంట్నైనా ట్విటర్ ఉపేక్షించదు. అలాంటి వాటిని పోస్ట్ చేసినా, షేర్ చేసినా వారి అకౌంట్లు సస్పెండ్ అవుతాయి.
యూజర్ల యాక్టివిటిని ఎప్పటికప్పుడు గమనించే ట్విటర్.. తమ పాలసీని ఉల్లంఘించిన వారి అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. అలాగే, యూజర్లు ఇలాంటి ఖాతాను రిపోర్టు చేస్తే.. పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. అందుకే ట్విటర్ను వినియోగించేటప్పుడు పై విషయాలను గుర్తుంచుకోవడం మంచిది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ