School in Desert : ఎడారిలో చదువుల కోవెల.. ఏసీ లేకున్నా చల్లగా ఉంటుందట!
ఎడారి మధ్యలో కట్టిన ఓ బడి మండు వేసవిలోనూ చల్లగా ఉంటోంది. దాని నిర్మాణం వెనకున్న విశేషాలేంటో చదివేయండి.
(Image : Facebook)
రాజస్థాన్(Rajasthan)లోని థార్ ఎడారి(Thar desert) గురించి చాలా మంది పాఠ్య పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. వేసవి(Summer)లో అక్కడ ఉష్ణోగ్రత(Temperature) దాదాపుగా 50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రోజంతా వేడి గాలులు వీస్తూ.. ఇసుక ఎగసి మీద పడుతుండటంతో 10 నిమిషాలు కుదురుగా నిల్చోవటానికి కూడా వీలుకాదు. అలాంటి ప్రతికూల వాతావరణంలో ఓ సుందరమైన విద్యాలయం వెలిసింది. దాని ఆకారం, నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తల కారణంగా ఏసీ లేకుండానే గదులు చల్లగా(Cooling) ఉంటున్నాయి. దాంతో విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఆ చదువుల కోవెల(School) విశేషాలేంటో తెలుసుకోండి.
కోడిగుడ్డులా నిర్మాణ శైలి!
రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్కు సమీపంలోని కనోయ్ గ్రామంలో ‘రాజ్కుమారి రత్నావతి బాలికల పాఠశాల’ను సిట్టా ఫౌండేషన్ నిర్మించింది. ఈ పాఠశాల అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం నిర్మాణ శైలి. పై నుంచి చూస్తే ఓ కోడి గుడ్డు ఆకారంలో పచ్చని రాళ్లతో ముచ్చటగా కన్పిస్తుంది. ఇందులో కిండర్గార్డెన్ మొదలు 10వ తరగతి వరకు 400 మంది బాలికలకు విద్యాబోధన జరుగుతోంది. బాలికలు విద్యనభ్యసించే విభాగాన్ని జ్ఞాన కేంద్రంగా పిలుస్తున్నారు. ఈ ప్రాంగణంలోనే మహిళా ఆర్థికాభివృద్ధి కేంద్రాన్ని నడిపిస్తున్నారు. కుట్లు, అల్లికలు, తదితర హస్తకళల్లో స్థానిక మహిళలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు.
రాజస్థాన్ కట్టడాలే స్ఫూర్తి
‘సిట్టా’ వ్యవస్థాపకుడు మైఖేల్ డూబే ఈ నిర్మాణం చేపట్టడానికి 10 ఏళ్లు తర్జనభర్జన పడ్డారు. న్యూయార్క్కు చెందిన ఆర్కిటెక్ట్ డయానా కెల్లోగ్ సహకారంతో ఎట్టకేలకు అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. 2014లో భారత్లో అడుగుపెట్టిన ఆమె తొలుత ఎడారిలో నిర్మాణం అనగానే ఆందోళన చెందారు. తరువాత రాజస్థాన్లోని అనేక ప్రాంతాలు తిరుగుతూ వివిధ నిర్మాణాలను అధ్యయనం చేశారు. స్థానిక కోటలు, ఇళ్లు, బావులు, మెట్ల నిర్మాణ శైలిని నిశితంగా గమనిస్తూ ప్రణాళిక రూపొందించారు. అమెరికా తరహా నిర్మాణాలు ఎడారిలో చేపడితే కుదరదని గ్రహించిన ఆమె కట్టడంలో స్థానిక సంప్రదాయ పద్ధతులను అవలంబించారు.
(Image : Facebook)
డయానా ప్రణాళిక ప్రకారం పాఠశాల నిర్మాణం దీర్ఘవృత్తాకారంలోకి వచ్చింది. ఈ ఆకారం మూలంగా నిర్మాణం దృఢత్వం పెరిగింది. ఇసుకరాయి, సున్నం వినియోగించి గదులను నిర్మించారు. పైన పందిరి వంటి కట్టడం, గోడలకు వేసిన జాలీలు ఇసుకను లోనికి రాకుండా కట్టడి చేశాయి. సూర్యుడి కిరణాలు కొంచెం సేపు మాత్రమే గోడలపై పడటంతో వేడి పెరగలేదు. చల్లగాలి మాత్రమే గదుల్లోకి ప్రవేశించడంతో ఏసీలు లేకుండానే విద్యార్థులు చక్కటి అనుభూతి పొందుతున్నారు. వృత్తాకారం వల్ల ఒక గది నుంచి మరో గదికి వెళ్లేందుకు దూరం తగ్గింది. చిన్నారులు ఆడుకోవడానికి కోర్టుయార్డు స్థలం ఉపయోగపడింది. నిర్మాణం పై భాగంలో సౌరఫలకాలు ఏర్పాటు చేయడంతో విద్యుత్తు అవసరాలు కూడా తీరుతున్నాయి.
స్థానిక కాంట్రాక్టర్ చొరవతో..
ఎడారిలో కట్టడం అని తెలిసి కాంట్రాక్టర్లు పాఠశాల నిర్మాణానికి ముందుకురాలేదు. ఓ స్నేహితుడి ద్వారా ఈ కాంట్రాక్టు గురించి తెలుసుకొన్న స్థానిక కాంట్రాక్టర్ కరీంఖాన్ డయానాను సంప్రదించారు. ఇతర బిల్డర్లు తటపటాయిస్తున్న నేపథ్యంలో కరీంఖాన్ ధైర్యంగా ఆ ప్రాజెక్టులో భాగం కావడానికి ముందుకొచ్చారు. మొదట్లో డయానా గీసిన ప్లాన్ కరీంకు అర్థం కాలేదు. తరువాత 3D మోడల్ ద్వారా ఆమె ప్రజెంటేషన్ చేయడంతో ఆ ప్లాన్ను అవగతం చేసుకున్నారు. నిర్మాణ రంగంలో తనకున్న అనుభవంతో కొన్ని మార్పులు సూచించారు. అలా 2018 అక్టోబరులో ప్రారంభమైన ఈ పాఠశాల నిర్మాణం ఏడాదికి పూర్తయింది. అప్పటి నుంచి ఈ వైవిధ్యమైన పాఠశాలను చూడటానికి అనేక మంది పర్యాటకులు వస్తున్నారు.
జైసల్మేర్లోనే ఎందుకు?
వైశాల్యపరంగా రాజస్థాన్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. 8 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 80% శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కానీ అక్షరాస్యతలో స్త్రీ, పురుష వ్యత్యాసం చాలా ఉంది. మహిళల్లో అక్షరాస్యత 60% లోపే కన్పిస్తుంది. జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత కేవలం 32%శాతంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఎన్జీవో సంస్థ సిట్టా ఫౌండేషన్ దృష్టికి వచ్చింది. బాల్య వివాహాలు కూడా అధికంగా జరుగుతున్నట్లు తెలుసుకొన్న ఆ సంస్థ వారికి తోడ్పాటునందించేందుకు ముందుకొచ్చింది. బాలికలకు విద్య, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను నిర్మించింది. ఈ ప్రయత్నానికి కొందరు రాజవంశస్థులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సహకరించారని ‘సిట్టా’ వ్యవస్థాపకుడు మైఖేల్ డూబే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Stock Market: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,000
-
Proddatur: టోకెన్లు అందుకో... చీరలు పుచ్చుకో
-
building collapse: కోల్కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
-
టాప్ 10 న్యూస్ @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP News: కాటన్ ఏ పార్టీ.. విగ్రహానికి ముసుగు వేయడంపై పలువురి విస్మయం
-
Crime News: అంబానీ ఇంటి వివాహ వేడుకలో చోరీకి యత్నం