ఆ ఇంట్లో 480 పిల్లులు.. 12 కుక్కలు..!
మూగజీవాలపై మానవులకు రోజురోజుకూ ప్రేమ పెరుగుతోంది. కాపలా, కాలక్షేపం, ఆత్మీయత, అనురాగం, ఒంటరితనం నుంచి వెసులుబాటు.. కారణం ఏదైనా మనిషికి జీవన గమనంలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: మూగజీవాలతో మానవులకు ఉన్న అనుబంధం తెలిసిందే. కాపలా, కాలక్షేపం, ఆత్మీయత, అనురాగం, ఒంటరితనం నుంచి వెసులుబాటు.. కారణం ఏదైనా మనిషికి జీవన గమనంలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారిపోయాయి. అయితే ఎక్కువ మంది తమ ఇళ్లలో కుక్కలను, పక్షులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఒమన్ దేశానికి చెందిన 51 ఏళ్ల జంతు ప్రేమికురాలు మర్యం-అల్-బలూషీ తన ఇంట్లో ఏకంగా 480 పిల్లులు, 12 కుక్కలను పెంచి పోషిస్తున్నారు. వాటి ఆహారం, బాగోగులు తీర్చేందుకు ఏకంగా నెలకు 8000 అమెరికా డాలర్లు (దాదాపు 6 లక్షలు) ఖర్చు చేస్తున్నారు.
జంతుప్రేమికురాలిగా మారారిలా..
2008లో ఆమె కుమారుడు ఒక చిన్న పర్షియన్ పిల్లిని తీసుకొచ్చాడు. అప్పుడు దాన్ని పెంచుకోవడానికి బలూషీ ఒప్పుకోలేదు. క్రమంగా ఆమె కుమారుడు ఆ పిల్లిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో రోజులు గడిచేకొద్దీ ఆమె దానికి ఆహారం తినిపించడం, స్నానం చేయించడంతోపాటు ఎక్కువ సమయం దానితోనే గడిపింది. 2011లో అల్-బలూషీ డిప్రెషన్కు గురయ్యారు. ఆ సమయంలో తాను పెంచిన పిల్లి తోడుగా ఉండటంతో ఆమె జంతువులపై ప్రేమను పెంచుకున్నారు. అప్పటి నుంచి వందల సంఖ్యలో పిల్లులను, కుక్కలను తీసుకొచ్చి తన ఇంట్లోనే పెంచడం అలవాటుగా మార్చుకున్నారు.
దేశవిదేశాల నుంచి ఆర్థిక సాయం
అయితే మొదట్లో ఆమెకు ఎవరూ ఆర్థిక సాయం చేయలేదు. పైగా ఎక్కువ సంఖ్యలో పెంపుడు జంతువులు ఉన్నందున అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇరుగుపొరుగు వారు సైతం ఆమెపై తరచూ అధికారులకు ఫిర్యాదు చేసేవారు. అయినా అమె బెదరలేదు. పైగా మరింత సమయం వాటికోసం కేటాయించేవారు. ఈ క్రమంలోనే ఆమె సామాజిక మాధ్యమాల్లో వాటి ఫొటోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశవిదేశాల్లో ఉన్న జంతు ప్రేమికులు ఆమెకు విరాళాలు పంపడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ విరాళాలతోనే వాటి బాగోగులు చూస్తున్నారు.
" ప్రతి ఒక్కరు మూగజీవాలను కరుణతో చూడాలి. దేవుడు మనకు తెలివి, ప్రేమించే హృదయం ఇచ్చాడు. దీంతో ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే తోటివారితో పంచుకుంటాం. కానీ మూగజీవాలు అలా కాదు. ఆకలైనా, అనారోగ్యంగా ఉన్నా మనతో చెప్పుకోలేవు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జంతువులను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలంటూ లేవు. అందుకే సాధ్యమైనంత మేరకు మూగజీవాలకు ఆశ్రయం కల్పిస్తున్నా’నని ఆమె వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
-
Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?