Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే..
ఇంటర్నెట్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశాల్లో (World Happiness Report) ఫిన్లాండ్ మరోసారి అగ్ర స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జీవనశైలిలో వస్తోన్న మార్పులతో జీవితాలను ఒత్తిడి, అసంతృప్తి వంటి ప్రతికూలతలు మానవ సమాజాన్ని కమ్మేస్తున్న తరుణంలో వరుసగా ఏడోసారి కూడా ఆ దేశం (Finland).. ‘హ్యాపీలాండ్’గా ఘనతను దక్కించుకోవడం విశేషం. మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ సందర్భంగా యూఎన్ ఆధారిత సంస్థ విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో మళ్లీ ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచి అద్భుతమైన విజయం దక్కించుకోవడం వెనుక ఉన్న కొన్ని కారణాలివే..
- ఉద్యోగులకు తక్కువ పని గంటలు అమలు చేయడం. కుటుంబాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడంతో పాటు వారికి ఉదారంగా సెలవులు ఇవ్వడం ద్వారా పని-జీవితాన్ని సమతుల్యం చేసుకొనే అవకాశం కల్పించే విధానాలు అనుసరిస్తున్నారు. తద్వారా అక్కడి ప్రజలకు తగిన విశ్రాంతితో పాటు కుటుంబం, వ్యక్తిగత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల్లో సంతృప్తి స్థాయిలు మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు.
- ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావ్యవస్థ అమలు చేస్తున్నారు. ప్రీ స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఉచిత విద్యను అందించడంతో పాటు ప్రామాణిక పరీక్షల కన్నా సమగ్ర అభివృద్ధిపై దృష్టిసారిస్తారు. పటిష్టమైన విద్యా వ్యవస్థతో నాణ్యమైన విద్యనందించడం ద్వారా పిల్లల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో వారు అన్నివిధాలా వికాసం చెందేలా చూస్తారు.
- ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ద్వారా అధిక నాణ్యతతో కూడిన వైద్య సేవలందించడం ఇక్కడి మరో ప్రత్యేకత. అందరికీ సమానమైన వైద్య సేవలు అందించడంతో అక్కడి ప్రజలు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ కాలం పాటు జీవిస్తారు.
- ప్రపంచ దేశాల్లో ఇక్కడ అవినీతి అత్యల్ప స్థాయిలో ఉంది. ఇది అక్కడి ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై నమ్మకం పెంచడంతో పాటు నిజాయతీ, న్యాయబద్ధమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో దోహదపడుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక పాలన వంటి అంశాలతో విశ్వసనీయమైన సమాజంగా ఫిన్లాండ్ కీర్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
- మహిళా సాధికారికతను ప్రోత్సహించడం, సమాజంలోని వివిధ రంగాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు తగ్గించడమే లక్ష్యంగా అమలుచేస్తోన్న విధానాలు లింగ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వివిధ హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశాలు కల్పించడం వంటివి సమాన, సమ్మిళిత సమాజం దిశగా దేశాన్ని నడిపించడంలో దోహదపడుతున్నాయి.
- ఫిన్లాండ్ సంస్కృతిలో ఆవిరి స్నానాలు (సౌనాస్)కు ప్రత్యేక స్థానం ఉంది. శరీరానికి విశ్రాంతినివ్వడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సామాజిక సంబంధాలను పెంచుకొనేందుకు వీలుగా ఈ ఆవిరి స్నానాలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలో దాదాపు 30లక్షల ఆవిరి స్నానాల గదులు ఉన్నాయి.
- సామూహిక శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రజలు పరస్పరం సన్నిహిత సంబంధాలు కొనసాగించడం ఆ దేశాన్ని ఆనందమయ దేశంగా మార్చడంలో మరో ప్రధాన ప్రామాణికత. ఒక సంఘంగా ఉండటం, ఆనందాన్ని పెంపొందించే వ్యక్తిత్వం, పరస్పర అనుసంధానభావంతో ఉండటం ఇక్కడి ప్రజల్లో ఉన్న మరో ప్రత్యేకత.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?