Golden bats statue : బంగారం ధర పెరిగింది.. ఆ విగ్రహం దశ తిరిగింది!
దక్షిణ కొరియాలో (South korea) ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న మూరుమూల కౌంటీలో గతంలో ఓ బంగారు గబ్బిలాల విగ్రహం (Golden Bats statue) నెలకొల్పారు. ఆ చర్యను చాలా మంది విమర్శించారు. ఇప్పుడు బంగారం ధరకు (Gold price) రెక్కలు రావడంతో దాని ధర సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఆ కథేంటో తెలుసుకోండి.
(Image : Hampyeong.go.kr)
దక్షిణ కొరియాలో (South korea) ఒకప్పుడు ఎరుపు-పసుపు పచ్చ రంగులో ఉండే ‘హాడ్సన్స్’జాతి గబ్బిలాలు (Bats) అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. 1999లో అవి హంపియోంగ్ కౌంటీలో వాడుకలో లేని బంగారు గనిలో (Gold mine)కన్పించాయి. ఆ కౌంటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్కు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో అక్కడ జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అప్పుడే స్థానిక ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే స్వచ్ఛమైన బంగారంతో గబ్బిలాల విగ్రహం ఏర్పాటు చేయడం. తద్వారా పర్యాటకులను ఆ ప్రాంతానికి రప్పించి ఆదాయాన్ని సంపాదించడం.
162 కేజీల బంగారం.. 281 కేజీల వెండి
2005లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో ఈ గబ్బిలాల విగ్రహ నిర్మాణం కోసం అధికారులు 21 లక్షల డాలర్లు కేటాయించారు. ఆ డబ్బుతో సుమారు ఏడు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసేందుకు 162 కేజీల బంగారం, 281 కేజీల వెండిని కొనుగోలు చేశారు. ప్రఖ్యాత దక్షిణకొరియా శిల్పి బైన్-కున్-హో ఆ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నాడు. ఒక వెండి రింగు చుట్టూ ఐదు బంగారు గబ్బిలాలు ఎగురుతున్న రీతిలో విగ్రహాన్ని తయారు చేశాడు. అందుకు సుమారు మూడు సంవత్సరాలు శ్రమించాల్సి వచ్చింది. ఈ శిల్పం ‘విశ్వ సామరస్యం, అమరత్వాన్ని సూచిస్తుంది’ అని దాని గొప్పతనాన్ని బైన్ వివరించారు. నిర్మాణం పూర్తయిన తరువాత ఆ శిల్పాన్ని ఒక గుహలాంటి ప్రదర్శనశాలలో ఉంచారు. మిగిలిన బంగారం, వెండితో ఒక కాఫీ టేబుల్ పరిమాణంలో బంగారు గుడ్లను తయారు చేయించారు. కొరియా పౌరాణిక హీరోలను గౌరవిస్తూ ఆ నిర్మాణాన్ని చేపట్టారు.
బంగారం పెట్టుబడిపై విముఖత
విగ్రహాల ఏర్పాటుతో ఆ ప్రాంతానికి పర్యావరణ పరంగా మేలు జరుగుతుందని స్థానిక ప్రభుత్వం విశ్వసించింది. అంతేకాకుండా ఈ నిర్మాణాన్ని చూడటానికి పర్యాటకులు భారీగా వస్తారని భావించింది. అయితే, ఈ కళాత్మక నిర్మాణంపై పెట్టుబడిని చాలా మంది విమర్శించారు. బంగారంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వృథా అన్నారు. అప్పటికే ఆ కౌంటీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. దాంతో స్థానిక వార్తా పత్రికలు కూడా వ్యతిరేక కథనాలు ప్రచురించాయి.
అనూహ్యంగా పెరిగిన ధర
కొద్ది రోజుల తరువాత క్రమంగా బంగారం ధర పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక అనిశ్చితి, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలతో పుత్తడి ధర ఆకాశాన్నంటింది. దాంతో విగ్రహం విలువ అమాంతం పెరిగిపోయింది. ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగి 1.1 కోట్ల డాలర్లకు చేరింది. బంగారు విగ్రహం కౌంటీలోని ఓ మారుమూల ప్రదేశంలో ఉన్నప్పటికీ గత కొద్ది వారాల్లోనే సుమారు 15వేల మంది కొరియన్ పర్యాటకులు దాన్ని సందర్శించారు. పసిడి ధర పెరిగే కొద్ది విగ్రహాన్ని చూడాలనే ఆసక్తి కూడా చాలా మందిలో పెరుగుతోంది. అందుకే అధిక సంఖ్యలో పర్యాటకులు పోటెత్తుతున్నారని కౌంటీ ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రవేశ టికెట్ ధర 1.5 డాలర్లుగా నిర్ణయించారు. దాంతో కౌంటీలో జరగుతున్న ‘బటర్ ఫ్లై ఫెస్టివల్’ను చూసేందుకు వచ్చేవారంతా విగ్రహాన్ని సందర్శించేందుకు ఉత్సాహం కనబరిచారు.
దోపిడీకి దొంగల యత్నం
అత్యంత విలువైన విగ్రహం ఇక్కడుందనే విషయం అందరికీ తెలియడంతో దానిపై దొంగల కన్నుపడింది. 2019లో దాన్ని దొంగిలించేందుకు శతవిధాల ప్రయత్నించి ముగ్గురు దొరికిపోయారు. అలారం మోగడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ ఘటన తరువాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు మోషన్ సెన్సార్లను, హై రిజల్యూషన్ సెక్యురిటీ కెమెరాలను అమర్చారు. బుల్లెట్ ప్రూఫ్ గాజు, స్టీల్ షెట్టర్తో విగ్రహానికి రక్షణ ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ విగ్రహాన్ని ఎకోలాజికల్ ఎగ్జిబిషన్ హాల్ నుంచి కౌంటీలోని హంపియోంగ్ ఎగ్జిబిషన్ పార్క్కు మారుస్తున్నట్లు కౌంటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బంగారం ధర గరిష్ఠంగా పెరిగింది. అయినప్పటికీ విగ్రహాన్ని విక్రయించే ఆలోచన తమకు లేదని చెప్పారు. తాము లాభం కోసం ఈ విగ్రహాన్ని నెలకొల్పలేదని స్పష్టం చేశారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.