Nuclear policy : భారత్ అణ్వాయుధాలు ప్రయోగించాల్సి వస్తే..!
అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా తాత్కాలికంగా వైదొలిగింది. మరి భారత్ అణ్వాయుధాల వాడకంపై ఎలాంటి కట్టుబాట్లు పాటిస్తోందో చదివేయండి.
ప్రపంచంపై ఆధిపత్యం నిలబెట్టుకొనేందుకు అమెరికా (america) తొలిసారి అణ్వాయుధాలను అభివృద్ధి చేసింది. అది రెండో ప్రపంచ యుద్ధం వేగంగా ముగించేందుకు జపాన్(Japan)లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు ప్రయోగించింది. తదనంతర పరిణామాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ‘తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు’ అనేది సామెత. ఆ తర్వాత రష్యా కొన్నేళ్లలోనే అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో అగ్ర రాజ్యాల మధ్య అణుపోటీ మొదలైంది. అనంతరం రష్యా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ‘జార్ బంబా’ను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో అణుయుద్ధ భయం ప్రపంచాన్ని పీడించింది. దీంతో పలు అణు ఒప్పందాలు తెరపైకి వచ్చాయి. 2010లో అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా వైదొలిగింది. దీంతో ఆయా దేశాల అణ్వాయుధ విధానాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్ అనుసరిస్తున్న ‘అణు సిద్ధాంతం’(nuclear doctrine) ఎలా ఉందో పరిశీలించండి..
మొదటి దెబ్బ మనది కాదు..!
భారత్ తొలిసారి 1974లో.. ఆ తర్వాత 1998లో చేపట్టిన పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతమయ్యాయి. అప్పటి నుంచి ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని అనుసరిస్తోంది. మన దగ్గర ఉన్న అణ్వాయుధాలను.. శత్రు నిరోధకాలుగా మాత్రమే వినియోగిస్తామని నాటి ప్రధాని వాజ్పేయీ(Vajpayee) నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం అణ్వాయుధ రహితంగా ఉండాలని భారత్ కోరుకుంటోంది. ఏదైనా శత్రుదేశం అణు దాడికి పాల్పడిన సందర్భంలో మాత్రమే ప్రతిదాడికి అణ్వాయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ విధానంలో ఇప్పటివరకూ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. భారత్ అణ్వాయుధాల వాడకం ఎలా ఉంటుందో తెలిపేలా 2003లో తన అణు సిద్ధాంతాన్ని(nuclear doctrine) ప్రకటించింది. అందులోనూ ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని నొక్కి చెప్పారు. అయితే, భారత్పై కొన్ని రకాల ఆయుధాలతో దాడి జరిగితే మాత్రం ప్రతి దాడి తీవ్రత అధికంగా ఉంటుందని, శత్రుదేశానికి జరిగే నష్టం ఊహించని విధంగా ఉంటుందని వెల్లడించారు. జీవ, రసాయన ఆయుధాలతో దాడి జరిగిన సందర్భంలోనూ అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించవచ్చని భారత్ అణు సిద్ధాంతం చెబుతోంది.
‘నో ఫస్ట్ యూజ్’ ఎందుకు?
ప్రపంచంలో కొన్ని దేశాల వద్దే అణ్వాయుధాలున్నాయి. ఈ క్రమంలో వీటికి అణ్వాయుధాలు లేని దేశాలతో యుద్ధం తలెత్తితే ఏకపక్షంగా విజయం లభిస్తుంది. ఫలితంగా చిన్న దేశాల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే అణ్వాయుధాల వినియోగంలో కొన్ని నిర్దిష్ట విధానాలను అనుసరిస్తున్నాయి. అందులో ఒకటి ‘నో ఫస్ట్ యూజ్’. కానీ, ఈ విధానాన్ని పాటించే దేశాలు అతి స్వల్పం. 1964లో చైనా అణు పరీక్షలు చేపట్టింది. కానీ, తాము ఏ యుద్ధంలోనూ తొలుత అణ్వాయుధాలు ఉపయోగించమని వాగ్దానం చేసింది. అది నోటి మాట మాత్రమే. కానీ, ఇది లిఖిత పూర్వకంగా లేదు. దాంతో ఏదైనా ఆపద లేదా సంఘర్షణ జరిగితే చైనా మాట తప్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చైనా(china), భారత్ మాత్రమే షరతులు లేని ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని అనుసరిస్తున్న దేశాలుగా ఉన్నాయి.
ఒక్కో దేశానిది.. ఒక్కో తీరు..
అమెరికా వంటి దేశాలు ఎన్పీటీ(నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ)లో భాగస్వాములుగా ఉన్నాయి. అణ్వాయుధ రహిత దేశాలపై దాడి చేయబోమని అవి ప్రమాణం చేశాయి. ఒక వేళ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంపై వాటిని ప్రయోగించాల్సి వస్తే అమెరికా, దాని మిత్ర దేశాలను కాపాడుకునే క్రమంలో ‘ఆత్మరక్షణ కోసం మాత్రమే’ వినియోగిస్తామని వాషింగ్టన్ పేర్కొంది. 1982లో నాటి సోవియట్ యూనియన్ నేత లియోనిడ్ బ్రెజ్నెవ్ కూడా మాస్కో ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీని పాటిస్తుందని చెప్పారు. 1993లో దీనికి భిన్నంగా అణ్వాయుధాలు లేని దేశాలపై మాత్రమే వాడమని రష్యా చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అవసరమైతే తామే ముందు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. యూకే మాత్రం అస్పష్టమైన విధానంతో ముందుకెళ్తోంది.
పాక్ వైఖరి ఏంటి?
భారత్ దాయాది దేశం పాక్(pak) కూడా అణుశక్తే. ఆ ఆయుధాల వాడకంపై అణు సిద్ధాంతాలేమీ ఆ దేశం ప్రతిపాదించలేదు. పరిస్థితులను బట్టి వాడతామని ఇస్లామాబాద్ తరచూ చెబుతూ వస్తోంది. 2002లో అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒక అడుగు ముందుకేసి పాక్ ఉనికిని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వాడాల్సి వస్తే అది ఇండియాపైనేనని వ్యాఖ్యానించాడు. నాటి నుంచి నేటి వరకు ఆ దేశ నాయకులు, సైన్యాధ్యక్షులు బీరాలు పోతూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
భారత్ ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, గత రక్షణ మంత్రి మనోహర్ పారికర్లు ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీలో మార్పులు తీసుకొస్తామనే సంకేతాలు ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి