Nuclear policy : భారత్ అణ్వాయుధాలు ప్రయోగించాల్సి వస్తే..!
అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా తాత్కాలికంగా వైదొలిగింది. మరి భారత్ అణ్వాయుధాల వాడకంపై ఎలాంటి కట్టుబాట్లు పాటిస్తోందో చదివేయండి.
ప్రపంచంపై ఆధిపత్యం నిలబెట్టుకొనేందుకు అమెరికా (america) తొలిసారి అణ్వాయుధాలను అభివృద్ధి చేసింది. అది రెండో ప్రపంచ యుద్ధం వేగంగా ముగించేందుకు జపాన్(Japan)లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు ప్రయోగించింది. తదనంతర పరిణామాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ‘తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు’ అనేది సామెత. ఆ తర్వాత రష్యా కొన్నేళ్లలోనే అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో అగ్ర రాజ్యాల మధ్య అణుపోటీ మొదలైంది. అనంతరం రష్యా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ‘జార్ బంబా’ను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో అణుయుద్ధ భయం ప్రపంచాన్ని పీడించింది. దీంతో పలు అణు ఒప్పందాలు తెరపైకి వచ్చాయి. 2010లో అమెరికాతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్’ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా వైదొలిగింది. దీంతో ఆయా దేశాల అణ్వాయుధ విధానాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్ అనుసరిస్తున్న ‘అణు సిద్ధాంతం’(nuclear doctrine) ఎలా ఉందో పరిశీలించండి..
మొదటి దెబ్బ మనది కాదు..!
భారత్ తొలిసారి 1974లో.. ఆ తర్వాత 1998లో చేపట్టిన పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతమయ్యాయి. అప్పటి నుంచి ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని అనుసరిస్తోంది. మన దగ్గర ఉన్న అణ్వాయుధాలను.. శత్రు నిరోధకాలుగా మాత్రమే వినియోగిస్తామని నాటి ప్రధాని వాజ్పేయీ(Vajpayee) నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం అణ్వాయుధ రహితంగా ఉండాలని భారత్ కోరుకుంటోంది. ఏదైనా శత్రుదేశం అణు దాడికి పాల్పడిన సందర్భంలో మాత్రమే ప్రతిదాడికి అణ్వాయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ విధానంలో ఇప్పటివరకూ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. భారత్ అణ్వాయుధాల వాడకం ఎలా ఉంటుందో తెలిపేలా 2003లో తన అణు సిద్ధాంతాన్ని(nuclear doctrine) ప్రకటించింది. అందులోనూ ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని నొక్కి చెప్పారు. అయితే, భారత్పై కొన్ని రకాల ఆయుధాలతో దాడి జరిగితే మాత్రం ప్రతి దాడి తీవ్రత అధికంగా ఉంటుందని, శత్రుదేశానికి జరిగే నష్టం ఊహించని విధంగా ఉంటుందని వెల్లడించారు. జీవ, రసాయన ఆయుధాలతో దాడి జరిగిన సందర్భంలోనూ అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించవచ్చని భారత్ అణు సిద్ధాంతం చెబుతోంది.
‘నో ఫస్ట్ యూజ్’ ఎందుకు?
ప్రపంచంలో కొన్ని దేశాల వద్దే అణ్వాయుధాలున్నాయి. ఈ క్రమంలో వీటికి అణ్వాయుధాలు లేని దేశాలతో యుద్ధం తలెత్తితే ఏకపక్షంగా విజయం లభిస్తుంది. ఫలితంగా చిన్న దేశాల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే అణ్వాయుధాల వినియోగంలో కొన్ని నిర్దిష్ట విధానాలను అనుసరిస్తున్నాయి. అందులో ఒకటి ‘నో ఫస్ట్ యూజ్’. కానీ, ఈ విధానాన్ని పాటించే దేశాలు అతి స్వల్పం. 1964లో చైనా అణు పరీక్షలు చేపట్టింది. కానీ, తాము ఏ యుద్ధంలోనూ తొలుత అణ్వాయుధాలు ఉపయోగించమని వాగ్దానం చేసింది. అది నోటి మాట మాత్రమే. కానీ, ఇది లిఖిత పూర్వకంగా లేదు. దాంతో ఏదైనా ఆపద లేదా సంఘర్షణ జరిగితే చైనా మాట తప్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చైనా(china), భారత్ మాత్రమే షరతులు లేని ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని అనుసరిస్తున్న దేశాలుగా ఉన్నాయి.
ఒక్కో దేశానిది.. ఒక్కో తీరు..
అమెరికా వంటి దేశాలు ఎన్పీటీ(నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ)లో భాగస్వాములుగా ఉన్నాయి. అణ్వాయుధ రహిత దేశాలపై దాడి చేయబోమని అవి ప్రమాణం చేశాయి. ఒక వేళ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంపై వాటిని ప్రయోగించాల్సి వస్తే అమెరికా, దాని మిత్ర దేశాలను కాపాడుకునే క్రమంలో ‘ఆత్మరక్షణ కోసం మాత్రమే’ వినియోగిస్తామని వాషింగ్టన్ పేర్కొంది. 1982లో నాటి సోవియట్ యూనియన్ నేత లియోనిడ్ బ్రెజ్నెవ్ కూడా మాస్కో ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీని పాటిస్తుందని చెప్పారు. 1993లో దీనికి భిన్నంగా అణ్వాయుధాలు లేని దేశాలపై మాత్రమే వాడమని రష్యా చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అవసరమైతే తామే ముందు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. యూకే మాత్రం అస్పష్టమైన విధానంతో ముందుకెళ్తోంది.
పాక్ వైఖరి ఏంటి?
భారత్ దాయాది దేశం పాక్(pak) కూడా అణుశక్తే. ఆ ఆయుధాల వాడకంపై అణు సిద్ధాంతాలేమీ ఆ దేశం ప్రతిపాదించలేదు. పరిస్థితులను బట్టి వాడతామని ఇస్లామాబాద్ తరచూ చెబుతూ వస్తోంది. 2002లో అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒక అడుగు ముందుకేసి పాక్ ఉనికిని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వాడాల్సి వస్తే అది ఇండియాపైనేనని వ్యాఖ్యానించాడు. నాటి నుంచి నేటి వరకు ఆ దేశ నాయకులు, సైన్యాధ్యక్షులు బీరాలు పోతూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
భారత్ ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, గత రక్షణ మంత్రి మనోహర్ పారికర్లు ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీలో మార్పులు తీసుకొస్తామనే సంకేతాలు ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?