Tallest Woman: ప్రపంచంలోనే పొడవైన మహిళ.. తగ్గేదేలే అంటోంది!
టర్కీకి చెందిన రుమేసా గెల్గీ (Rumeysa Gelgi) ప్రపంచంలోనే అతి పొడవైన మహిళగా (Tallest Woman in the World) గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో (Guinness World Record) చోటు సంపాదించింది. అరుదైన వ్యాధి బారిన పడిన ఆమె.. నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటూ జీవన పోరాటం సాగిస్తోంది.
(Image : Rumeysa Gelgi insta)
రుమేసా గెల్గీ (Rumeysa Gelgi) తుర్కియేలోని (Turkey) సఫ్రన్బోలు జిల్లాలో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 26 సంవత్సరాలు. ఎత్తు ఏడు అడుగుల 0.7 అంగుళాలు. దాంతో ఆమె ప్రపంచంలోనే ఎత్తయిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో (Tallest Woman in the World) చోటు సంపాదించింది. కేవలం ఎత్తయిన మహిళగానే కాకుండా పెద్ద చేతులు, పొడవైన వేళ్లు, వెన్నెముక కలిగిన మహిళగా ఆమె పేరిట మొత్తం ఐదు ప్రపంచ రికార్డులున్నాయి (World records). అయితే.. ఓ వైపు కష్టాలను ఎదుర్కొంటూనే.. చదువులో రాణించి మంచి ఉద్యోగంలో స్థిరపడి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
అంతెత్తు ఎలా..!
రుమేసా నాలుగు నెలల చిన్నారిగా ఉండగానే ఆమె వీవర్స్ సిండ్రోమ్ బారిన పడింది. ఇది జన్యుపరమైన సమస్య. అంటే ఎముకల్లో విపరీతమైన పెరుగుదల కన్పిస్తుంది. ముఖం, పాదాలు ఎక్కువగా సాగిపోతాయి. గొంతు కూడా సాగడం వల్ల బొంగురుగా వినిపిస్తుంది. ఆ వ్యాధి మెదడు పైనా ప్రభావం చూపిస్తుంది. కండరాలు వదులుగా ఉంటాయి. వీవర్స్ సిండ్రోమ్ కారణంగా రుమేసాకు 6 ఏళ్లు వచ్చేసరికే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు పెరిగింది. దాంతో పెద్దల శరీరంలో ఓ చిన్నారిని అమర్చినట్లుగా ఆమె రూపం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడిన వారు 50 మంది మాత్రమే ఉన్నారట.
నిత్యం బతుకు పోరాటం
అరుదైన వ్యాధి కారణంగా రుమేసా నిత్యం బతుకు పోరాటం చేయాల్సి వస్తోంది. గుండె పనితీరులో లోపం బయటపడింది. ఎత్తు కారణంగా ఆమె వెన్నెముక ఒక వైపు వంగిపోయింది. దాంతో నడక కూడా కష్టంగా మారిందామెకు. అవసరం మేరకు వైద్యులు కొన్ని చోట్ల రాడ్లు, స్క్రూలు అమర్చారు. ఫలితంగా రుమేసా విద్యాభ్యాసమంతా ఇంటి వద్దే సాగింది. అందువల్ల ఆమె బాల్యం అందరిలా లేదు. కనీసం స్నేహితులతో ఆడుకోవడం కూడా కుదర్లేదు. అయినప్పటికీ రుమేసా కుంగిపోలేదు. తియ్యని మాటలతో ఎంతో మందిని తనకు దగ్గరయ్యేలా చేసుకుంది. వారితో కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తోంది.
విమానంలో మార్పులు చేశారు!
రుమేసా బాగా పొడుగ్గా ఉండటంతో కారులో ప్రయాణించలేదు. అందుకే ప్రత్యేకంగా వ్యాన్ను సిద్ధం చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఎక్కువ సేపు కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందులోనే పడుకొని వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇక విమానంలో ప్రయాణించడం కూడా కష్టమే. 6 సీట్లను ఓ స్ట్రెచర్లా మార్చి రుమేసా ప్రయాణాన్ని సులభతరం చేసింది టర్కిష్ ఎయిర్ అనే విమానయాన సంస్థ.
వెబ్ డెవెలపర్గా రాణిస్తోంది
తన జీవితాంతం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ రుమేసా చదువును నిర్లక్ష్యం చేయలేదు. దాంతో ఆమెకు కాలిఫోర్నియాలో వెబ్ డెవెలపర్గా ఉద్యోగం వచ్చింది. తన దిన చర్య, పర్యటనల వివరాలను రుమేసా ఇన్స్టా ఖాతాలో పోస్టు చేస్తుంటుంది. ఆకారాన్ని బట్టి మనుషులను అంచనా వేసే మనస్తత్వం మార్చుకోవాలని ఆమె పిలుపునిస్తోంది. అనేక షోలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె