Paytm CEO: నా సంపాదన చూసి పిల్లను కూడా ఇవ్వలేదు..!
బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో లిస్టింగ్ సందర్భంగా మాట్లాడిన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ (43).. సంస్థ ఎదిగిన క్రమాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
రూ.10వేల సంపాదన నుంచి బిలియనీర్ స్థాయికి ఎదిగిన వైనం..
ఐపీఓ సందర్భంగా భావోద్వేగానికి గురైన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ
దిల్లీ: అనతికాలంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోకి విస్తరించడంతోపాటు డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న పేటీఎం.. తాజాగా భారత్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో (స్టాక్ మార్కెట్లో నమోదు కావడం) స్థాయికి ఎదిగి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం కొంతకాలంలోనే కోటీశ్వరుడిగా మారడమే కాకుండా వేల మందికి ఉపాధి కల్పిస్తోన్న తీరు కూడా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తాజాగా బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో లిస్టింగ్ సందర్భంగా మాట్లాడిన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ (43).. సంస్థ ఎదిగిన క్రమాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
పిల్లనిచ్చేందుకు వెనుకడుగు..
అంతకుముందు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేటీఎం సీఈఓ విజయ్శేఖర్ శర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత 27ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఓ సంస్థను స్థాపించి మొబైల్ కంటెంట్ను విక్రయించడం మొదలుపెట్టాను. ఆ సమయంలో సంస్థ నుంచి వచ్చే ఆదాయం నెలకు కేవలం రూ.10వేలు మాత్రమే. ఈ విషయం తెలుసుకొని నాకు పిల్లను ఇచ్చేందుకు (వధువు కుటుంబాలు) కూడా ఎవరూ ముందుకు రాలేదు. అలా నా కుటుంబానికి అర్హతలేని బ్యాచిలర్గా మారాను. దీంతో (2004-05 సంవత్సరంలో) కంపెనీ మూసేసి.. కనీసం రూ.30వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని చూసుకొమ్మని నాన్న చెప్పారు’’ అని సంస్థ సీఈఓ విజయ్శేఖర్ శర్మ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి రూ.18వేల కోట్ల ఐపీవోతో భారత స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు విజయ్ శేఖర్.
వారికి నా సంపాదనే తెలియదు..
పేటీఎం తర్వాత నేను ఏం చేస్తున్నాననే విషయం చాలాకాలం పాటు నా తల్లిదండ్రులకే తెలియదు. ముఖ్యంగా నా సంపాదన ఎంతనే విషయంపైనా వారికి అవగాహన లేదు. నా సంపాదనపై ఓసారి వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి అమ్మ నన్ను అడిగింది. ‘విజయ్.. వాళ్లు చెబుతున్నంత డబ్బు నిజంగా నీ దగ్గరుందా..? అని తన తల్లి అడిగినట్లు విజయ్ శేఖర్శర్మ చెప్పుకొచ్చారు.
రోడ్డుపక్కన ‘టీ’ అంటేనే ఇష్టం..
ఉత్తర్ప్రదేశ్కి చెందిన విజయ్శేఖర్ శర్మ తండ్రి ఉపాధ్యాయుడు కాగా తల్లి ఓ సాధారణ గృహిణి. 2005లో వివాహం చేసుకున్న శేఖర్కు ఒక కుమారుడు ఉన్నాడు. అత్యంత సాదాసీదాగా ఉండే విజయ్శేఖర్.. రోడ్డుపక్కన ఉన్న బండిమీద ‘టీ’ తాగేందుకే ఇష్టపడుతారు. అంతేకాకుండా పాలు, బ్రెడ్ తీసుకునేందుకు ఉదయం పూట తానే స్వయంగా బయటకు వెళ్తానని విజయ్శేఖర్ పేర్కొనడం విశేషం.
స్వల్పకాలంలోనే రికార్డు స్థాయికి..
ఇక One97 కమ్యూనికేషన్ (పేటీఎం మాతృసంస్థ) పేరుతో 2000 సంవత్సరంలో ఓ కంపెనీని స్థాపించారు విజయ్శేఖర్ శర్మ. తొలుత టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ను అందించే సంస్థగా ఉన్న వన్97.. 2010లో పేటీఎంగా మారింది. అనంతరం ఆన్లైన్ పేమెంట్స్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. 2014లో వాలెట్ పేమెంట్స్ లైసెన్స్ పొందింది. ఇదే సమయంలో 2015లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్ పేటీఎంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం సంస్థ గతిని మార్చేసింది. అనంతరం భారీ స్థాయిలో సేవలను ప్రారంభించిన పేటీఏం.. అనతికాలంలోనే దేశం నలుమూలలా విస్తరించింది. వీటికితోడు 2016లో కేంద్రప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేయడం.. డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరగడం సంస్థకు కలిసొచ్చింది. ఇలా అనతికాలంలోనే (2017 ఏడాదిలో) యువ బిలియనీర్స్ జాబితాలో విజయ్శేఖర్ స్థానం సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.18వేల కోట్లు (2.4 బిలియన్ డాలర్లు). వ్యాపారంలో ఎటువంటి కుటుంబ నేపథ్యం, భారీ నగదు, ఆంగ్లభాషపై పట్టు లేనప్పటికీ ఓ బిలియనీర్ స్థాయికి ఎదిగిన విజయ్శేఖర్ ప్రస్థానాన్ని ఎంతో మంది ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.