Mosquirix: ప్రపంచంలోనే తొలి మలేరియా టీకా.. వినియోగానికి WHO సిఫార్సు!
మలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తోన్న Mosquirix టీకాను ఇక నుంచి విస్తృత స్థాయిలో వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ వెల్లడించారు.
ప్రజారోగ్య చరిత్ర గతినే మారుస్తుంది - డబ్ల్యూహెచ్ఓ
వాషింగ్టన్: ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న మలేరియాను ఎదుర్కొనే ఆయుధం అందుబాటులోకి వచ్చింది. ఈ భయంకరమైన వ్యాధిని తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలు సుదీర్ఘకాలంగా వేచిచూస్తోన్న నేపథ్యంలో మలేరియా టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఆమోదం తెలిపింది. మలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా పంపిణీ చేస్తోన్న Mosquirix టీకాను ఇక నుంచి విస్తృత స్థాయిలో వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ వెల్లడించారు. ప్రజారోగ్య చరిత్ర గతిని మార్చే ఈ టీకా ప్రపంచానికి ఓ బహుమతి అని పేర్కొన్నారు.
‘మలేరియా పరిశోధకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన నేను.. భయంకరమైన, ప్రాచీనమైన ఈ వ్యాధిని ఎదుర్కొనే సమర్థవంతమైన టీకా వస్తుందని ఎంతో కాలంగా ఆశగా ఎదిరిచూశాను. ఆ రోజు వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రకటించారు. ముఖ్యంగా మలేరియా ప్రాబల్యం అధికంగా ఉన్న ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల్లో చిన్నారులకు విస్తృత స్థాయిలో వీటిని పంపిణీ చేసేందుకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు.
ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు..
దోమకాటు వల్ల సంభవించే ఈ భయంకరమైన మలేరియా వ్యాధి కేసులు అభివృద్ధి చెందుతోన్న, వెనుకబడిన దేశాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటి నిర్మూలన కోసం ఎంతోకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా రూపొందించిన ఈ మలేరియా టీకా తయారీ, ప్రయోగాలపై దాదాపు ముప్పై ఏళ్ల నుంచి కృషి జరుగుతుంది. మలేరియా కేసుల్లో అత్యంత ప్రమాద తీవ్రతకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ రకాన్ని ఎదుర్కొనే ఈ వ్యాక్సిన్ (RTS,S/AS01)ను గ్లాక్సోస్మిత్క్లైన్ (GSK) రూపొందించింది. వీటి తుది దశ ప్రయోగాలు 2009 నుంచి 2014 కొనసాగాయి. క్లినికల్ ట్రయల్స్లో ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలడంతో పైలట్ ప్రాజెక్టు కింద మూడు ఆఫ్రికన్ దేశాల్లో వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో అనుమతి ఇచ్చింది. దీంతో మలేరియా తీవ్రత అధికంగా ఉన్న కెన్యా, మలావీ, ఘానా దేశాల్లో దాదాపు 8 లక్షల మంది చిన్నారులకు నాలుగు డోసుల్లో ఈ వ్యాక్సిన్ను అందించారు. వీటి ఫలితాలను విశ్లేషించగా దాదాపు 40శాతం వరకు కేసులు తగ్గినట్లు గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 22కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. వారిలో 4లక్షల మంది మృత్యువాతపడగా..2లక్షల 74 వేల (67శాతం) మంది చిన్నారుల్లోనే ఉండడం ఆందోళనకర విషయం. ఆ ఏడాది కేవలం ఒక్క భారత్లోనే 56లక్షల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మలేరియా వ్యాక్సిన్కు ఆమోదం లభించడం ప్రజారోగ్యంలో గొప్ప విషయమని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వీటి పంపిణీ ఒక సవాలేనని పేర్కొంటున్నారు. వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్నచోట వీటిని పంపిణీని ప్రారంభించినా.. 2030 నాటికి ప్రతిఏటా 5 నుంచి 11కోట్ల డోసులు అవసరమవుతాయని డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలోని ఓ నివేదిక అంచనా వేసింది. కానీ, 2028 నాటికి ప్రతిఏటా కోటిన్నర డోసుల Mosquirix మాత్రమే ఉత్పత్తి చేయగలమని జీఎస్కే ఇదివరకే స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్