Earthquakes : ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరని భవనం!
అమెరికాలో (America) ఓ 10 అంతస్తుల భవనం 100 కృత్రిమ భూకంపాలను (Earthquakes) తట్టుకొని నిలబడింది. భవిష్యత్తులో ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని దాని నిర్మాణదారులు చెబుతున్నారు.
Image : Englekirk Structural Engineering Center (ESEC)
అమెరికాలోని (America) శాన్ డియాగో పట్టణ శివారులో గత నెలలో ఓ భారీ భూకంపం (Earthquake) సంభవించింది. కొన్ని నిమిషాల తరువాత మరో భూకంపం వచ్చింది. ఈ రెండు విపత్తుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. విచిత్రంగా ఉంది కదూ! నిజానికి అవి కృత్రిమ భూకంపాలు. కలపతో రూపొందించిన ఓ 10 అంతస్తుల భవన (Wooden Building) సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆ ప్రయోగం చేపట్టారు. ఆ విశేషాలేంటో తెలుసుకోండి.
ఎందుకీ ప్రయోగం?
సిమెంటు, ఇసుక, కంకర వినియోగించి నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు భూకంపాలను తట్టుకోలేవు. అమెరికాలో టోర్నడోల విజృంభణ కూడా ఎక్కువే. కాబట్టి అలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఆ ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ 10 అంతస్తుల కలప భవనాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు సుమారు 100 కృత్రిమ భూకంపాలు సృష్టించి దీనిపై ప్రయోగాలు చేశారు. వాటన్నింటినీ ఈ భవనం తట్టుకుంది. ఆగస్టులోగా మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నారు. అలా చేయడం వల్ల ఈ కలప భవనం నాణ్యత ఏంటో బయటి ప్రపంచానికి తెలుస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం సుమారు 3.7 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 10 అంతస్తుల భవనం గట్టిదని తేలితే దాని ఎత్తు 18 అంతస్తుల వరకు పెంచే యోచనలో ఉన్నారు.
రెండు భయంకర భూకంపాలతో ప్రారంభం
కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్ (సీఎస్ఎం) ఆధ్వర్యంలో యూసీఎస్డీ షేక్ టేబుల్ను వినియోగించి కృత్రిమ భూకంప ప్రయోగాలు చేపట్టారు. వెయ్యి చదరపు అడుగుల్లోని షేక్ టేబుల్కు అమర్చిన హైడ్రాలిక్ యాక్యుయేటర్లు ఆరు డిగ్రీల కోణంలో కదులుతూ భూకంపం తరహా తీవ్రతను కృత్రిమంగా సృష్టిస్తాయి. అందులో భాగంగా తొలుత 6.7 తీవ్రతతో ‘నార్త్ రిడ్జ్’ భూకంపాన్ని సిములేటర్ల సాయంతో సృష్టించారు. 1994 ప్రాంతంలో లాస్ ఏంజెలెస్లో 20 నిమిషాలపాటు వచ్చిన భూకంపం ధాటికి సుమారు 60 మంది మరణించారు. అప్పట్లోనే 40 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. కానీ, ఇటీవల ఇంజినీర్లు రూపొందించిన ఈ 10 అంతస్తుల భవనానికి ఏమీ కాలేదు. అటూఇటూ ఊగిపోయి అది మళ్లీ యథాస్థానంలోకి వచ్చింది. కాసేపటి తరువాత 1999లో తైవాన్లో సంభవించిన ‘ఛి ఛి’ భూకంపం తరహాలో ప్రకంపనలు సృష్టించారు. రిక్టార్ స్కేల్పై దాని తీవ్రత 7.7. తాజాగా అటువంటి భారీ ప్రకంపనలు సృష్టించి చూసినా ఈ కలప భవనం చెక్కు చెదర్లేదు.
ప్రయోగం కెమెరాల్లో నిక్షిప్తం
ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు వాస్తుశిల్పులు, ఇంజినీర్లు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక భవనం చుట్టూ కెమెరాలు అమర్చి ఆ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయించారు. డ్రోన్ కెమెరాలను వినియోగించి భవనం కదులుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. తొలి మూడు అంతస్తుల చుట్టూ కిటికీలు అమర్చారు. మిగిలిన అంతస్తులను బహిరంగంగానే ఉంచారు. అయితే ప్రతి అంతస్తులో నాలుగు ‘రాకింగ్ వాల్స్’ను ఏర్పాటు చేశారు. భూకంపం వల్ల అధిక నష్టం జరగకుండా ఇంజినీర్లు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవే కాకుండా లోపల గోడలు, మెట్లను కూడా ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేశారు. భవనం మొత్తం సెన్సార్లను అమర్చారు. ప్రయోగం మధ్యలో భవనం అమరికలు చెదిరి నేలపై పడిపోకుండా వాటిని తీగలతో బిగించారు.
కృత్రిమ భూకంపం సృష్టించి తాము చేసిన ఈ ప్రయోగాల్లో ఆశించిన ఫలితమే వచ్చిందని సీఎస్ఎం మైన్స్ ఇంజినీర్, ప్రాజెక్ట్స్ కో డైరెక్టర్ షైలింగ్ పై తెలిపారు. భవనం యథాస్థానంలో వచ్చి నిలబడిందని చెప్పారు. దాని నిర్మాణం స్ప్రింగ్ లేదా రబ్బర్ బ్యాండ్లా సాగేలా డిజైన్ చేశామని ఆయన వెల్లడించారు. భవనం బాగా ఊగుతున్న సమయంలో పై భాగం అటూఇటూ ఒకటి నుంచి రెండు అడుగుల దూరం కదిలిందని ఇంజినీర్లు తెలిపారు. ఈ ప్రయోగ భవనం తయారీలో క్రాస్ ల్యామినేటెడ్ కలపతోపాటు స్టీల్ వినియోగించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.