Earthquakes : ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరని భవనం!
అమెరికాలో (America) ఓ 10 అంతస్తుల భవనం 100 కృత్రిమ భూకంపాలను (Earthquakes) తట్టుకొని నిలబడింది. భవిష్యత్తులో ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని దాని నిర్మాణదారులు చెబుతున్నారు.
Image : Englekirk Structural Engineering Center (ESEC)
అమెరికాలోని (America) శాన్ డియాగో పట్టణ శివారులో గత నెలలో ఓ భారీ భూకంపం (Earthquake) సంభవించింది. కొన్ని నిమిషాల తరువాత మరో భూకంపం వచ్చింది. ఈ రెండు విపత్తుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. విచిత్రంగా ఉంది కదూ! నిజానికి అవి కృత్రిమ భూకంపాలు. కలపతో రూపొందించిన ఓ 10 అంతస్తుల భవన (Wooden Building) సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆ ప్రయోగం చేపట్టారు. ఆ విశేషాలేంటో తెలుసుకోండి.
ఎందుకీ ప్రయోగం?
సిమెంటు, ఇసుక, కంకర వినియోగించి నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు భూకంపాలను తట్టుకోలేవు. అమెరికాలో టోర్నడోల విజృంభణ కూడా ఎక్కువే. కాబట్టి అలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఆ ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ 10 అంతస్తుల కలప భవనాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు సుమారు 100 కృత్రిమ భూకంపాలు సృష్టించి దీనిపై ప్రయోగాలు చేశారు. వాటన్నింటినీ ఈ భవనం తట్టుకుంది. ఆగస్టులోగా మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నారు. అలా చేయడం వల్ల ఈ కలప భవనం నాణ్యత ఏంటో బయటి ప్రపంచానికి తెలుస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం సుమారు 3.7 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 10 అంతస్తుల భవనం గట్టిదని తేలితే దాని ఎత్తు 18 అంతస్తుల వరకు పెంచే యోచనలో ఉన్నారు.
రెండు భయంకర భూకంపాలతో ప్రారంభం
కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్ (సీఎస్ఎం) ఆధ్వర్యంలో యూసీఎస్డీ షేక్ టేబుల్ను వినియోగించి కృత్రిమ భూకంప ప్రయోగాలు చేపట్టారు. వెయ్యి చదరపు అడుగుల్లోని షేక్ టేబుల్కు అమర్చిన హైడ్రాలిక్ యాక్యుయేటర్లు ఆరు డిగ్రీల కోణంలో కదులుతూ భూకంపం తరహా తీవ్రతను కృత్రిమంగా సృష్టిస్తాయి. అందులో భాగంగా తొలుత 6.7 తీవ్రతతో ‘నార్త్ రిడ్జ్’ భూకంపాన్ని సిములేటర్ల సాయంతో సృష్టించారు. 1994 ప్రాంతంలో లాస్ ఏంజెలెస్లో 20 నిమిషాలపాటు వచ్చిన భూకంపం ధాటికి సుమారు 60 మంది మరణించారు. అప్పట్లోనే 40 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. కానీ, ఇటీవల ఇంజినీర్లు రూపొందించిన ఈ 10 అంతస్తుల భవనానికి ఏమీ కాలేదు. అటూఇటూ ఊగిపోయి అది మళ్లీ యథాస్థానంలోకి వచ్చింది. కాసేపటి తరువాత 1999లో తైవాన్లో సంభవించిన ‘ఛి ఛి’ భూకంపం తరహాలో ప్రకంపనలు సృష్టించారు. రిక్టార్ స్కేల్పై దాని తీవ్రత 7.7. తాజాగా అటువంటి భారీ ప్రకంపనలు సృష్టించి చూసినా ఈ కలప భవనం చెక్కు చెదర్లేదు.
ప్రయోగం కెమెరాల్లో నిక్షిప్తం
ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు వాస్తుశిల్పులు, ఇంజినీర్లు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక భవనం చుట్టూ కెమెరాలు అమర్చి ఆ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయించారు. డ్రోన్ కెమెరాలను వినియోగించి భవనం కదులుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. తొలి మూడు అంతస్తుల చుట్టూ కిటికీలు అమర్చారు. మిగిలిన అంతస్తులను బహిరంగంగానే ఉంచారు. అయితే ప్రతి అంతస్తులో నాలుగు ‘రాకింగ్ వాల్స్’ను ఏర్పాటు చేశారు. భూకంపం వల్ల అధిక నష్టం జరగకుండా ఇంజినీర్లు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవే కాకుండా లోపల గోడలు, మెట్లను కూడా ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేశారు. భవనం మొత్తం సెన్సార్లను అమర్చారు. ప్రయోగం మధ్యలో భవనం అమరికలు చెదిరి నేలపై పడిపోకుండా వాటిని తీగలతో బిగించారు.
కృత్రిమ భూకంపం సృష్టించి తాము చేసిన ఈ ప్రయోగాల్లో ఆశించిన ఫలితమే వచ్చిందని సీఎస్ఎం మైన్స్ ఇంజినీర్, ప్రాజెక్ట్స్ కో డైరెక్టర్ షైలింగ్ పై తెలిపారు. భవనం యథాస్థానంలో వచ్చి నిలబడిందని చెప్పారు. దాని నిర్మాణం స్ప్రింగ్ లేదా రబ్బర్ బ్యాండ్లా సాగేలా డిజైన్ చేశామని ఆయన వెల్లడించారు. భవనం బాగా ఊగుతున్న సమయంలో పై భాగం అటూఇటూ ఒకటి నుంచి రెండు అడుగుల దూరం కదిలిందని ఇంజినీర్లు తెలిపారు. ఈ ప్రయోగ భవనం తయారీలో క్రాస్ ల్యామినేటెడ్ కలపతోపాటు స్టీల్ వినియోగించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట