Flashback : బాబ్బాబు.. ఈ రైలును కాస్త తొయ్యండయ్యా!
ఒకప్పుడు రైళ్లు మధ్యలో మొరాయిస్తే ప్రయాణికులు దిగి తోసేవారు. ఆ సంగతేంటో చదివేయండి.
అమెరికా(America)లోని విల్మింగ్టన్(Wilmington), లాస్ ఏంజెలెస్ (Los Angeles) నగరాల నుంచి లాంగ్బీచ్లోని విల్మోర్ ప్రాంతానికి 19వ శతాబ్దంలో కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే వీధి రైలు మార్గం(Street railway) ఏర్పాటైంది. తొలుత ఆ మార్గంలో రైళ్లను గుర్రాలు లాగేవి. తరువాత ఆవిరి యంత్రంతో నడిచే రైలు ఇంజిన్లను ప్రవేశపెట్టారు. దానిని విల్మింగ్టన్ అండ్ లాంగ్ బీచ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ రైల్ రోడ్డుగా పిలిచేవారు. క్రమంగా అది ‘ది గెట్ అవుట్ అండ్ పుష్ రైల్ రోడ్డు’(The Get Out And Push Railroad)గా మారి పోయింది. అంటే దిగి తోసే రైలు అని అర్థం. ఆ పేరు రావడానికి వెనుక కారణం ఏంటో తెలుసుకోండి.
స్థిరాస్తి ప్రాజెక్టు కోసం..
అమెరికాకు చెందిన జడ్జ్ రాబర్ట్ ఎం. విడ్నీ, అతడి స్నేహితుడు డబ్ల్యూ.ఈ. విల్మోర్ కలిసి 1882లో లాస్ ఏంజెలెస్ కౌంటీలో ఓ స్థిరాస్తి ప్రాజెక్టును చేపట్టారు. 10వేల ఎకరాల్లో ఆ ప్రాజెక్టును రూపొందించారు. దాంతో ఓ నగరాన్నే నిర్మించాలని వారిద్దరూ సంకల్పించారు. దానికి తొలుత ‘ది అమెరికన్ కాలనీ ట్రాక్ట్’ అని పేరు పెట్టారు. తరువాత విల్మోర్ సిటీగా పేరు మార్చారు. ఈ స్థిరాస్తి ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, నివాసాలు, చర్చి(Church), పార్క్ల నిర్మాణానికి స్థలం వదిలిపెట్టారు. ప్రారంభంలో ఇక్కడి ప్లాట్లు చూడటానికి వచ్చేవారంతా లాస్ ఏంజెలెస్ నుంచి విల్మింగ్టన్ వరకు రైలు(Rail)లో వచ్చి.. అక్కడ్నుంచి గుర్రాలు, బగ్గీల్లో చేరుకొనేవారు. ఇదంతా ప్రయాసతో కూడిన పని అని కొనుగోలుదారులు చెప్పడంతో జడ్జ్ విడ్నీకి ఒక ఆలోచన వచ్చింది. విల్మింగ్టన్కు సమీపంలోని దక్షిణ పసిఫిక్ ట్రాక్లను విల్మోర్ సిటీతో కలిసేలా గుర్రాలు లాగే స్టీర్ కార్ రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని సంకల్పించాడు.
సొంతంగా రైల్వే ప్రాజెక్టు
విడ్నీ రైలు, ట్రాక్ నిర్మాణ ప్రతిపాదనను లాస్ ఏంజెలెస్ కౌంటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదం లభించింది. గుర్రాలు లాగే స్టీర్ కార్ రైల్వే లైన్ ప్రాజెక్టును తానే చేపట్టాలని విడ్నీ భావించాడు. అందుకోసం ఓ కంపెనీని స్థాపించి ముగ్గురు వడ్రంగులు, కొద్ది మంది సహాయకులతో ట్రాక్ నిర్మాణం ప్రారంభించాడు. గుర్రాలు లాగడానికి అవసరమైన కంపార్ట్మెంట్ తరహా బండ్లను విల్మోర్ సిటీలోనే చేయించాడు. వాటికి అమర్చాల్సిన ఇనుప చక్రాలను లాస్ ఏంజెలెస్ నుంచి తెప్పించాడు. మొత్తానికి గుర్రాలు లాగే స్టీర్ కార్ లైన్ను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాడు.
దిగి నెట్టక తప్పలేదు!
రైల్వే లైను పూర్తి కావడంతో స్థిరాస్తి ప్రాజెక్టు వేలానికి ఒక తేదీని విడ్నీ ప్రకటించాడు. ఆ రోజు జనం తండోపతండాలుగా లాస్ ఏంజెలెస్ నుంచి బయల్దేరారు. విల్మోర్ జంక్షన్లో వారిని చూడగానే తాను రూపొందించిన గుర్రాలు లాగే స్టీర్ కార్ లైన్ ఏ మాత్రం సరిపోదని అతడికి అర్థమైంది. ఆయన చుట్టూ ఉన్న వడ్రంగులు కూడా గుర్రాలు లాగాల్సిన రైలు పూర్తిగా చెక్కతో తయారు చేశామని, ఇంత మంది ఎక్కితే అది కచ్చితంగా ముక్కలవుతుందని చెప్పారు. దీంతో విడ్నీ ఆ చుట్టుపక్కల ఉండే ఎడ్ల బండ్లను అద్దెకు తెచ్చి అందుబాటులో ఉంచాడు. కానీ, విడ్నీ టైమ్ బాగాలేదు. ముందు ఊహించినట్లుగానే ఆ చెక్క రైలు మార్గంమధ్యలోనే ముక్కలైపోయింది. దాంతో కొంత మంది పురుషులు రైలు దిగి దానిని తోస్తూ ముందుకు నడిపించారు. దాంతో అది ‘గెట్ అవుట్ అండ్ పుష్ రైల్ రోడ్డు’గా ముద్రపడిపోయింది.
వ్యాపారానికి బైబై
విడ్నీ స్థిరాస్తి వ్యాపారంలో 36 లాట్లు మాత్రమే విక్రయించగలిగాడు. అందులో 9 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కేవలం 6 కుటుంబాలే నివాసం ఉండటానికి వచ్చాయి. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడికి రావడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. గుర్రాలు లాగే రైలు బండిని మెరుగు పరిచినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత వర్షాలు కూడా రావడంతో ఆ రైలు మార్గం కొట్టుకుపోయింది. దాంతో నిరాశ చెందిన విడ్నీ తన స్థిరాస్తి ప్రాజెక్టు వదిలేశాడు. భూమిని అసలు యజమానులకే మళ్లీ విక్రయించాడు. రోడ్ రైలు ప్రాజెక్టు మాత్రం తన వద్దే ఉంచుకున్నాడు.
స్టీమ్ ఇంజిన్ రైళ్ల ప్రవేశం
కొత్త యజమానులు విల్మోర్ సిటీ పేరును లాంగ్ బీచ్గా మార్చారు. వేసవి విడిదికి ఈ ప్రాంతం బాగుంటుందని చెబుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. జనాలను ఆకర్షించడానికి ఓ ఫైవ్స్టార్ హోటల్(Hotel) కూడా నిర్మించారు.
దాంతో విడ్నీ తన గుర్రాల రైలు బండి మార్గాన్ని ఆ హోటల్ వరకు పొడిగించాడు. దానికి ప్రయాణికుల ఆదరణ పెరగడంతో గుర్రాలతో కాకుండా స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్లను ఆ మార్గంలో ప్రవేశపెట్టాలని భావించాడు. కొత్త రైలు ప్రాజెక్టు 1885 సెప్టెంబరులో ప్రారంభమైంది. రద్దీకి సరిపడా ట్రాక్లు నిర్మించారు. ప్రయోగ పరీక్షల్లో కొన్నిచోట్ల ఎత్తయిన ప్రదేశాల్లో రైలు ముందుకు కదల్లేక పోయింది. మరుసటి ఏడాది పూర్తిస్థాయిలో స్టీమ్ ఇంజిన్ రైళ్లతో ట్రాక్పై రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఆ ఇంజిన్లకు కూడా లాగే సత్తా ఉండేది కాదు. దాంతో ప్రయాణికులు మళ్లీ దిగి నెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. అయితే గుర్రపు రైలు కార్తో పోలిస్తే ఈ ఇంజిన్లు కాస్త మెరుగైన పని తీరు కనబర్చాయి.
తరువాతి కాలంలో ఈ రైలు ప్రాజెక్టును దక్షిణ పసిఫిక్ రైలు రోడ్ కంపెనీ తన ఆధీనంలోకి తీసుకుంది. తేలికపాటి రైళ్లను తీసేసి.. దృఢమైన రైళ్లను ప్రవేశపెట్టింది. దాంతో ప్రయాణికులు దిగి నెట్టాల్సిన అవసరం ఇక లేకుండా పోయింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు