Flashback : బాబ్బాబు.. ఈ రైలును కాస్త తొయ్యండయ్యా!
ఒకప్పుడు రైళ్లు మధ్యలో మొరాయిస్తే ప్రయాణికులు దిగి తోసేవారు. ఆ సంగతేంటో చదివేయండి.
అమెరికా(America)లోని విల్మింగ్టన్(Wilmington), లాస్ ఏంజెలెస్ (Los Angeles) నగరాల నుంచి లాంగ్బీచ్లోని విల్మోర్ ప్రాంతానికి 19వ శతాబ్దంలో కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే వీధి రైలు మార్గం(Street railway) ఏర్పాటైంది. తొలుత ఆ మార్గంలో రైళ్లను గుర్రాలు లాగేవి. తరువాత ఆవిరి యంత్రంతో నడిచే రైలు ఇంజిన్లను ప్రవేశపెట్టారు. దానిని విల్మింగ్టన్ అండ్ లాంగ్ బీచ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ రైల్ రోడ్డుగా పిలిచేవారు. క్రమంగా అది ‘ది గెట్ అవుట్ అండ్ పుష్ రైల్ రోడ్డు’(The Get Out And Push Railroad)గా మారి పోయింది. అంటే దిగి తోసే రైలు అని అర్థం. ఆ పేరు రావడానికి వెనుక కారణం ఏంటో తెలుసుకోండి.
స్థిరాస్తి ప్రాజెక్టు కోసం..
అమెరికాకు చెందిన జడ్జ్ రాబర్ట్ ఎం. విడ్నీ, అతడి స్నేహితుడు డబ్ల్యూ.ఈ. విల్మోర్ కలిసి 1882లో లాస్ ఏంజెలెస్ కౌంటీలో ఓ స్థిరాస్తి ప్రాజెక్టును చేపట్టారు. 10వేల ఎకరాల్లో ఆ ప్రాజెక్టును రూపొందించారు. దాంతో ఓ నగరాన్నే నిర్మించాలని వారిద్దరూ సంకల్పించారు. దానికి తొలుత ‘ది అమెరికన్ కాలనీ ట్రాక్ట్’ అని పేరు పెట్టారు. తరువాత విల్మోర్ సిటీగా పేరు మార్చారు. ఈ స్థిరాస్తి ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, నివాసాలు, చర్చి(Church), పార్క్ల నిర్మాణానికి స్థలం వదిలిపెట్టారు. ప్రారంభంలో ఇక్కడి ప్లాట్లు చూడటానికి వచ్చేవారంతా లాస్ ఏంజెలెస్ నుంచి విల్మింగ్టన్ వరకు రైలు(Rail)లో వచ్చి.. అక్కడ్నుంచి గుర్రాలు, బగ్గీల్లో చేరుకొనేవారు. ఇదంతా ప్రయాసతో కూడిన పని అని కొనుగోలుదారులు చెప్పడంతో జడ్జ్ విడ్నీకి ఒక ఆలోచన వచ్చింది. విల్మింగ్టన్కు సమీపంలోని దక్షిణ పసిఫిక్ ట్రాక్లను విల్మోర్ సిటీతో కలిసేలా గుర్రాలు లాగే స్టీర్ కార్ రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని సంకల్పించాడు.
సొంతంగా రైల్వే ప్రాజెక్టు
విడ్నీ రైలు, ట్రాక్ నిర్మాణ ప్రతిపాదనను లాస్ ఏంజెలెస్ కౌంటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదం లభించింది. గుర్రాలు లాగే స్టీర్ కార్ రైల్వే లైన్ ప్రాజెక్టును తానే చేపట్టాలని విడ్నీ భావించాడు. అందుకోసం ఓ కంపెనీని స్థాపించి ముగ్గురు వడ్రంగులు, కొద్ది మంది సహాయకులతో ట్రాక్ నిర్మాణం ప్రారంభించాడు. గుర్రాలు లాగడానికి అవసరమైన కంపార్ట్మెంట్ తరహా బండ్లను విల్మోర్ సిటీలోనే చేయించాడు. వాటికి అమర్చాల్సిన ఇనుప చక్రాలను లాస్ ఏంజెలెస్ నుంచి తెప్పించాడు. మొత్తానికి గుర్రాలు లాగే స్టీర్ కార్ లైన్ను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాడు.
దిగి నెట్టక తప్పలేదు!
రైల్వే లైను పూర్తి కావడంతో స్థిరాస్తి ప్రాజెక్టు వేలానికి ఒక తేదీని విడ్నీ ప్రకటించాడు. ఆ రోజు జనం తండోపతండాలుగా లాస్ ఏంజెలెస్ నుంచి బయల్దేరారు. విల్మోర్ జంక్షన్లో వారిని చూడగానే తాను రూపొందించిన గుర్రాలు లాగే స్టీర్ కార్ లైన్ ఏ మాత్రం సరిపోదని అతడికి అర్థమైంది. ఆయన చుట్టూ ఉన్న వడ్రంగులు కూడా గుర్రాలు లాగాల్సిన రైలు పూర్తిగా చెక్కతో తయారు చేశామని, ఇంత మంది ఎక్కితే అది కచ్చితంగా ముక్కలవుతుందని చెప్పారు. దీంతో విడ్నీ ఆ చుట్టుపక్కల ఉండే ఎడ్ల బండ్లను అద్దెకు తెచ్చి అందుబాటులో ఉంచాడు. కానీ, విడ్నీ టైమ్ బాగాలేదు. ముందు ఊహించినట్లుగానే ఆ చెక్క రైలు మార్గంమధ్యలోనే ముక్కలైపోయింది. దాంతో కొంత మంది పురుషులు రైలు దిగి దానిని తోస్తూ ముందుకు నడిపించారు. దాంతో అది ‘గెట్ అవుట్ అండ్ పుష్ రైల్ రోడ్డు’గా ముద్రపడిపోయింది.
వ్యాపారానికి బైబై
విడ్నీ స్థిరాస్తి వ్యాపారంలో 36 లాట్లు మాత్రమే విక్రయించగలిగాడు. అందులో 9 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కేవలం 6 కుటుంబాలే నివాసం ఉండటానికి వచ్చాయి. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడికి రావడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. గుర్రాలు లాగే రైలు బండిని మెరుగు పరిచినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత వర్షాలు కూడా రావడంతో ఆ రైలు మార్గం కొట్టుకుపోయింది. దాంతో నిరాశ చెందిన విడ్నీ తన స్థిరాస్తి ప్రాజెక్టు వదిలేశాడు. భూమిని అసలు యజమానులకే మళ్లీ విక్రయించాడు. రోడ్ రైలు ప్రాజెక్టు మాత్రం తన వద్దే ఉంచుకున్నాడు.
స్టీమ్ ఇంజిన్ రైళ్ల ప్రవేశం
కొత్త యజమానులు విల్మోర్ సిటీ పేరును లాంగ్ బీచ్గా మార్చారు. వేసవి విడిదికి ఈ ప్రాంతం బాగుంటుందని చెబుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. జనాలను ఆకర్షించడానికి ఓ ఫైవ్స్టార్ హోటల్(Hotel) కూడా నిర్మించారు.
దాంతో విడ్నీ తన గుర్రాల రైలు బండి మార్గాన్ని ఆ హోటల్ వరకు పొడిగించాడు. దానికి ప్రయాణికుల ఆదరణ పెరగడంతో గుర్రాలతో కాకుండా స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్లను ఆ మార్గంలో ప్రవేశపెట్టాలని భావించాడు. కొత్త రైలు ప్రాజెక్టు 1885 సెప్టెంబరులో ప్రారంభమైంది. రద్దీకి సరిపడా ట్రాక్లు నిర్మించారు. ప్రయోగ పరీక్షల్లో కొన్నిచోట్ల ఎత్తయిన ప్రదేశాల్లో రైలు ముందుకు కదల్లేక పోయింది. మరుసటి ఏడాది పూర్తిస్థాయిలో స్టీమ్ ఇంజిన్ రైళ్లతో ట్రాక్పై రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఆ ఇంజిన్లకు కూడా లాగే సత్తా ఉండేది కాదు. దాంతో ప్రయాణికులు మళ్లీ దిగి నెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. అయితే గుర్రపు రైలు కార్తో పోలిస్తే ఈ ఇంజిన్లు కాస్త మెరుగైన పని తీరు కనబర్చాయి.
తరువాతి కాలంలో ఈ రైలు ప్రాజెక్టును దక్షిణ పసిఫిక్ రైలు రోడ్ కంపెనీ తన ఆధీనంలోకి తీసుకుంది. తేలికపాటి రైళ్లను తీసేసి.. దృఢమైన రైళ్లను ప్రవేశపెట్టింది. దాంతో ప్రయాణికులు దిగి నెట్టాల్సిన అవసరం ఇక లేకుండా పోయింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?