Vande Bharat Express : ఆయన కలల ప్రాజెక్టే ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’
సంక్రాంతి పండగ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ పరుగులు తీస్తోంది. ఈ రైలు వేగం, అందులోని వసతుల గురించి అంతటా చర్చ నడుస్తోంది. అయితే ఈ రైలు సృష్టికర్త ఎవరు? ఆయన తన కలల ప్రాజెక్టు కోసం ఎలాంటి కృషి చేశారు? చదివేయండి మరి.
(Image : sudhanshu mani twitter)
‘వందే భారత్ ఎక్స్ప్రెస్’(Vande Bharat Express).. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొత్తం ఈ రైలులో కనిపించింది. సికింద్రాబాద్(secunderabad)-విశాఖ(vizag) సర్వీసులతో ప్రారంభమైన ఈ రైలు(train) వేగంగా తమ గమ్యస్థానాలకు తీసుకెళ్తుండటంతో ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ వెనుక ఓ వ్యక్తి చేసిన అవిరళ కృషి దాగి ఉంది. ఆయనెవరో చదివి తెలుసుకోండి మరి.
ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా
సుధాన్షు మణి(sudhanshu mani).. 1979లో రైల్వేశాఖలో మెకానికల్ ఇంజినీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2016 ఆగస్టులో చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(icf) జీఎం(general manager)గా నియమితులయ్యారు. తన ఉద్యోగ జీవితంలో వర్క్షాప్ నిర్వహణ, రైల్వే ఆపరేషన్స్, తయారీ, ప్రాజెక్టుల నిర్వహణ, ప్లానింగ్ విభాగాల్లో సేవలందించిన ఆయన 1990 నుంచి 2010 వరకు పలు డీజిల్ లోకోమోటివ్స్(diesel locomotive) అభివృద్ధికి కృషి చేశారు. జీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే సెమీ హైస్పీడ్ రైళ్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టారు. అతి తక్కువ కాలంలోనే తన కలల ప్రాజెక్టు ‘ట్రైన్ 18’(train 18)ను విజయవంతం చేసి 2018 డిసెంబరు 31న ఆయన పదవీ విరమణ చేశారు. భారతీయ రైల్వేల అభివృద్ధికి సుధాన్షు చేసిన సేవలను కీర్తిస్తూ ఆయనను ‘ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ప్రెస్గా పిలుస్తున్న ‘ట్రైన్ 18’ ప్రాజెక్టులో తన అనుభవాలను వివరిస్తూ సుధాన్షు ‘మై ట్రైన్ 18 స్టోరీ’ పేరుతో పుస్తకం కూడా రాశారు.
మనసులో ఉంది.. మార్గం వెతికారు
ఒక మెకానికల్ ఇంజినీర్గా రైల్వేల్లోకి అడుగుపెట్టిన సుధాన్షు మణికి ఆ వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేకపోవడం ఆలోచింపజేసింది. విదేశాలు బుల్లెట్ రైళ్లు(bullet train) నడపాలనే ఆలోచనతో ముందుకెళ్తుంటే.. మనం ఇంకా అవే డిజైన్లు, అవే పాత బోగీలతో ఎంతకాలం ఉంటాం అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది. అనుకున్నదే తడవుగా సెమీ హై స్పీడ్ రైళ్ల ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో అలాంటి రైళ్ల తయారీ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. కానీ సుధాన్షు పట్టుదల, పనితీరును అర్థం చేసుకున్న అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్ రూ.200 కోట్ల పెట్టుబడితో రెండు రైళ్ల తయారీకి మాత్రం అనుమతించారు. దీంతో మేక్ ఇన్ ఇండియా(make in india) నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘ట్రైన్-18’ ప్రాజెక్టును పట్టాలెక్కించడం మొదలు పెట్టారు.
సమయం లేదు మిత్రమా అంటూ కర్తవ్య బోధ
‘ట్రైన్ 18’ ప్రాజెక్టుకు అనుమతి లభించినా.. సుధాన్షు పదవీ విరమణ చేయడానికి రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయన కోచ్ ఫ్యాక్టరీలో పని చేసే సిబ్బందిని జాగృతం చేశారు. ‘ఓ కొత్త ప్రాజెక్టు మీ చేతుల్లోకి వచ్చింది. దాన్ని విజయవంతం చేసే బాధ్యత మీదే’ అంటూ అక్కడి సిబ్బంది, ఉద్యోగుల్లో నూతనోత్తేజం నింపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే వ్యయంలో మూడో వంతు మాత్రమే వెచ్చించి ‘ట్రైన్ 18’ తయారీ పూర్తి చేయాలని డిజైన్ ఇంజినీర్లకు కర్తవ్య బోధ చేశారు. దాంతో రూ.12 కోట్లు ఖర్చు చేస్తే.. కానీ తయారు కాని ఒక బోగీ.. రూ.6 కోట్లతోనే తయారైంది. యూరప్, జపాన్ దేశాలతో సరి సమానంగా ఆ బోగీల లుక్ మారింది. అలా ఎట్టకేలకు భారత్లో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ పట్టాలపై ఎక్కింది. టెస్ట్ రన్లో 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి అందరి చేత ఔరా అనిపించింది.
(Image : sudhanshu mani twitter)
మార్పులకు శ్రీకారం.. చెన్నై ఐసీఎఫ్
దేశీయ రైల్వే అవసరాల కోసం చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాకర్టీ(chennai integral coach factory)ని 1955లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. 2015 జులై 6 నాటికి ఇక్కడ 50వేల కోచ్లు తయారయ్యాయి. ఈ ఘనతకు గానూ లిమ్కా బుక్ రికార్డ్స్(limca book of records)లో చోటు దక్కింది. 2017-18 మధ్య 2503 కోచ్లు, 2018-2019 మధ్య 3262 కోచ్లు ఇక్కడ ఉత్పత్తి కావడం మరో రికార్డుగా నిలిచింది. తాను జీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుధాన్షు మణి ఇక్కడ పలు మార్పులు తీసుకొచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ మొత్తం సౌరశక్తితో నడిచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇది భారతీయ రైల్వేలో తొలి కర్బన రహిత కంపెనీగా నిలిచింది. ఫ్యాక్టరీలోని వ్యర్థాలు, ఇతర వస్తువులు వినియోగించి చూడచక్కని ఆర్ట్ గ్యాలరీగానూ తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా ఆహ్లాదం ఉట్టిపడేలా ఆ ఫ్యాక్టరీని మలిచారు. రైళ్ల రంగు, డిజైన్లలో మార్పునకు చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్