Restaurant : కొండంత రెస్టారెంట్.. 5800 మంది విందు ఆరగించొచ్చు!
సాధారణంగా ఏ రెస్టారెంట్లో (Restaurant)అయినా పదుల సంఖ్యలో వెళ్లి తినడానికి వసతి ఉంటుంది. మరీ పెద్దవి అయితే వందల మంది వెళ్లి తినొచ్చు. కానీ చైనాలోని (China)ఓ రెస్టారెంట్లో ఒకేసారి 5800 మంది విందు ఆరగించవచ్చట. ఆ సంగతేంటో చదివేయండి.
(Image :guinnessworldrecords.com)
చైనాలోని (China)చాంగ్క్వింగ్ పట్టణానికి సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద హాట్పాట్ రెస్టారెంట్ (Restaurant)ఉంది. ‘హాట్పాట్’అంటే కొందరు సమూహంగా ఏర్పడి టేబుల్ మధ్య పాత్ర పెట్టి ఏదైనా వంటకం (Food)వండుకుంటారు. తరువాత దాన్ని వడ్డించుకుని, కబుర్లు చెబుతూ తింటారు. ప్రస్తుతం వండే పరిస్థితి లేదు కాబట్టి కేవలం చెఫ్లు తయారు చేయగా.. తెచ్చిపెట్టిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ కొండపైనున్న ఈ రెస్టారెంట్లో సుమారు 900 టేబుళ్లున్నాయి. ఏకకాలంలో వాటిపై 5800 మంది విందు ఆరగించవచ్చని దాని నిర్వాహకులు చెబుతున్నారు.
చాంగ్క్వింగ్ రెస్టారెంట్ హాట్పాట్కు చాలా ప్రసిద్ధి. కొండప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్ అసలు పేరు పిపా యువాన్. మొత్తం 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇందులో ఎవరైనా టేబుల్ బుక్ చేసుకుంటే అదెక్కడుందో కనుక్కోవడానికి ఒక మనిషి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇది అతి పెద్ద హాట్ పాట్ రెస్టారెంట్గా ఖ్యాతి గడించింది. గతేడాది గిన్నిస్ బుక్లో కూడా చోటు సంపాదించింది. పిపా యువాన్లో కస్టమర్లు ఎవరు ఆర్డర్ పెట్టినా ఆ వంటకం తీసుకురావడానికి కనీసం 30 నిమిషాలు సమయం పడుతుంది. అయినా ఇక్కడకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. రిజర్వేషన్ చేసుకోకుండా వస్తే వేసవి కాలంలో ఇక్కడ టేబుల్ దొరకడం అసాధ్యమట. చైనా నలుమూలల నుంచి పర్యాటకులు ఈ రెస్టారెంట్కు తరలివస్తుంటారు.
ఒక్క రెస్టారెంట్లో నిత్యం టన్నుల కొద్దీ వంటలు తయారు చేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే ఇక్కడ వెయిటర్లు, కుక్లు, కిచెన్లో పని చేసే సిబ్బంది అంతా కలిపి వందల సంఖ్యలో ఉంటారు. కేవలం క్యాషియర్లే 25 మంది దాకా ఉన్నారట. ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా ఉండదు. చాలా మంది టూరిస్టులు రాత్రి పూటే వస్తుంటారు. ఎందుకంటే ఆ సమయంలో కొండ మొత్తాన్ని వివిధ రకాల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరిస్తారు. ఆ సందడి ఓ జాతరను తలపిస్తుంటుంది. ఇంత బిజీగా ఉన్న రెస్టారెంట్లో అసలు రుచి ఉంటుందా అని అనుమానం వస్తుంది. కానీ, ఆన్లైన్లో మాత్రం నెటిజన్లు దీనికి మంచి రివ్యూలే ఇస్తున్నారు. రద్దీ వేళల్లో ఆహారం తీసుకురావడం కాస్త ఆలస్యమైనప్పటికీ రుచిలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు రాజీ పడబోరని చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.