మనసున్న మారాజు ఈ డాక్టర్.. ఆడపిల్ల పుడితే పైసా తీసుకోడు!
మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన ఓ డాక్టర్(Doctor) తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఆయన సంకల్పానికి ఓ ముగ్గురు మహిళలు అండగా నిలుస్తున్నారు.
(Image : Twitter)
ఆ డాక్టర్ (Doctor) ఓ గైనకాలజిస్ట్. ఆడపిల్లలంటే ఆయనకు ప్రాణం. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ముఖం చిట్లించే వారిని తన సర్వీసులో ఎంతో మందిని చూశారు. కానీ, ఆయనకు మాత్రం అమ్మాయి అంటే ‘లక్ష్మీదేవి’తో సమానం. అందుకే తన ఆస్పత్రి (Hospital)లో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోడు. అంతటి గొప్ప మనసున్న డాక్టర్ ఎక్కడున్నారు? ఆయన లక్ష్యానికి వేర్వేరు మతాలకు చెందిన మహిళలు ఏ విధంగా సహకరిస్తున్నారో చదివేయండి.
‘మ్యాడ్’ డాక్టర్ అన్నారు!
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగలాగే మహారాష్ట్ర (Maharashtra)లో గుడిపడ్వా జరుపుకొంటారు. 2007లో సరిగ్గా అదే పండగ రోజున హడాప్సర్ పట్టణంలో మెడికేర్ హాస్పటల్ను ప్రారంభించారు డా.గణేశ్ రాఖ్. తన ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న వారికి ఆడపిల్ల పుడితే పైసా తీసుకోకూడదని ఆయన 2012లో నిర్ణయించుకున్నారు. నిన్నటి ఉగాదితో ఆ గొప్ప సంకల్పానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 2470 ఉచిత డెలివరీలు చేసిన ఆయన.. ఏ రూపంలోనూ పైసా తీసుకోలేదు. ఆస్పత్రిలో ఓపీ మొదలుకొని డెలివరీ వరకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ ఖర్చులేకుండా సమకూర్చారు.
ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం అని ప్రకటించగానే మొదట్లో గణేశ్ రాఖ్ను కొందరు ‘మ్యాడ్ డాక్టర్’ అని పిలిచారు. అలా విమర్శించిన నోళ్లే ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ వైద్యుడి సేవ మెచ్చి ఇతర వైద్యులు, నర్సులు తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. గణేశ్ రాఖ్ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించడంతో అనేక దేశాల నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ‘సేవ్ గర్ల్ చైల్డ్’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరుపై డా.గణేశ్ రాఖ్ త్వరలో అక్కడ ప్రసంగించనున్నారు.
జనహితమే తమ అభి‘మతం’
గణేశ్ రాఖ్ ఉచితంగా వైద్యం అందించడం వెనుక ముగ్గురు మహిళల పరోక్ష సహకారం ఉంది. వారే ఆస్పత్రి భవన యజమానులు. ముగ్గురూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందినవారు. గణేశ్ చేస్తున్న మంచి పనికి సహకారం అందించేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. అతి తక్కువ, నామమాత్రపు అద్దె మాత్రమే తీసుకొంటున్నారు. మొదటి భవనం యజమాని పేరు షగుఫ్తా ముస్తఫ్ఖాన్. ఈమె భర్త ఓ ట్యాంకర్ డ్రైవర్. రెండో భవనం యజమాని అనురాధ సదాశివ్ గోపాలె. ఈమె భర్త ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. ఈయనే గణేశ్కు బాల్యంలో ఇంగ్లిష్ బోధించారు. ఎప్పుడైనా అద్దె ఆలస్యం అయితే ఉపాధ్యాయుడిలాగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ గణేశ్పై ఒత్తిడి తెస్తారు. ఆ సమయంలో ఆయన భార్య అనురాధ తన వైపు అండగా నిలవడంతో ఆయన వెనక్కి తగ్గుతుంటారని డాక్టర్ ఓ సందర్భంలో వివరించారు. మూడో భవనం యజమాని జెన్నిఫర్ ఎరిక్ మనేజెస్. ఈమె భర్త పారా గ్లైడింగ్ పైలట్. ఆస్పత్రిని విస్తరించే క్రమంలో ఈ మూడు భవంతులను డాక్టర్ అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుత అవసరాలు తీర్చడం కోసం ఆ మూడు భవనాలను కలిపి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు