China New Year : ఈ రోజు చైనాలో ‘హ్యాపీ న్యూ ఇయర్’
ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. కానీ చైనాలో మాత్రం ‘చైనీస్ న్యూ ఇయర్’ పేరుతో 15 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. అలా ప్రత్యేకంగా ఎందుకు చేస్తారో చదివేయండి!
అందరికీ జనవరి 1న నూతన సంవత్సరం(calendar) ప్రారంభమవుతుంది. కానీ, చైనా(china)లో మాత్రం ఇవాళ.. అంటే జనవరి 22న. సంప్రదాయ లూనిసోలార్ క్యాలెండర్ ప్రకారం వసంత రుతువు లిచున్తో చైనాలో నూతన సంవత్సరం(Chinese New Year) ప్రారంభమవుతుంది. దీనినే ‘స్ప్రింగ్ ఫెస్టివల్’ అని కూడా అంటారు. చైనా క్యాలెండర్లో 24 సౌర కాలాలు ఉంటాయి.
మనకు 60 తెలుగు సంవత్సరాల్లాగే అక్కడ 12 జంతువుల పేర్లతో సంవత్సరాలు వస్తూ.. పోతూ ఉంటాయి. నెలవంక రాక ఆధారంగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో 15 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ రోజుల్లో జరిగే లాంతర్ ఫెస్టివల్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏడు రోజులు దేశం మొత్తం సెలవులు ప్రకటిస్తారు. ఎక్కడా ఎటువంటి కార్యకలాపాలు జరగవు. చైనాలో మాత్రమే కాకుండా టిబెట్, కొరియా, వియత్నాం, బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, భారత్ వంటి దేశాల్లోనూ వేడుకలు చేసుకొంటారు. ఆసియా ఖండంలోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్, న్యూజిలాండ్, పెరూ, దక్షిణాఫ్రికా, యూకే, యూఎస్ సహా పలు ఐరోపా దేశాల్లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తారు.
‘నియాన్’ దరి చేరకూడదని..
చైనా పురాణాల ప్రకారం.. నియాన్(Nian) అనే ఒక విచిత్ర జంతువు కారణంగా ఈ పండగ ప్రారంభమైనట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఆ జంతువు సముద్రం అడుగున లేదా పర్వతాల్లో ఉంటుందని నమ్ముతారు. పూర్వం నియాన్ రోజూ వచ్చి గ్రామ ప్రజలను తినేదట. అర్ధరాత్రి వేళ పిల్లలను చంపేదట. ఒకసారి దాని నుంచి తప్పించుకునేందుకు గ్రామస్థులంతా కలిసి మరో ప్రదేశానికి వెళ్లి దాక్కోవాలనే నిర్ణయానికి వచ్చారు. అలా వారు గ్రామం విడిచి వెళ్తుంటే.. యాన్హాంగ్ అనే ముసలాయన ఎదురై నియాన్పై ప్రతీకారం తీర్చకుంటానని చెప్పాడు. ఆ రాత్రి వృద్ధుడు ఎర్రటి పేపర్లు తన ఇంట్లో కట్టి, బాణసంచా పేలుస్తూ ఉన్నాడు. మరుసటి రోజు గ్రామస్థులు తిరిగి వచ్చి చూస్తే.. వృద్ధుడికి ఎటువంటి హానీ జరగలేదు. దీంతో ఆ వృద్ధుణ్ని తమను కాపాడటానికి వచ్చిన దేవుడిగా భావించారు. నాటి నుంచి ఎర్రటి రంగు, పెద్దపెద్ద శబ్దాలు నియాన్కు నచ్చవని తెలుసుకున్నారు. ఆ రంగు దుస్తులు ధరించడం, లాంతర్లు వెలిగించడం, బాణసంచా కాల్చడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ఒక సంప్రదాయంగా అలవాటు చేసుకున్నారు. నియాన్ను టోయిస్ట్ మాంక్ హాంగ్జన్ లోజు బంధించాడని నమ్ముతుంటారు. ‘నియాన్’ అంటే సంవత్సరం అని కూడా అర్థం.
సందడంతా ఎరుపు రంగులోనే..
చైనీయులు తమ పురాణాలను ఎక్కువగా విశ్వసిస్తారు. ఆచారాలను పాటిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో దేవతలను, పూర్వీకులను ఆరాధిస్తారు. ఏడాది ప్రారంభానికి ముందే తమ ఇంటిని తప్పకుండా శుభ్రం చేసుకుంటారు. అలా చేయడం వల్ల దురదృష్టం బయటకు వెళ్లి.. తమ ఇంటికి అదృష్టం వస్తుందని నమ్ముతారు. తలుపులు, కిటికీలను ఎర్రటి(red) కాగితాలతో అలంకరిస్తారు. కొన్ని సంప్రదాయ కవితలు రాసిన పేపర్లను కూడా గుమ్మాలకు వేలాడదీస్తారు. అవి అదృష్టం కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని, సంపద కలగాలని, ఆయుష్షు పొందాలని ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎర్రటి ఎన్వలప్ కవర్లలో నగదు ఉంచి తమకు ఇష్టమైన వారికి బహుమతిగా ఇస్తారు. ఎర్రటి దుస్తులు ధరిస్తారు. బాణసంచా కాలుస్తారు. కొత్త ఏడాది పండగ సందర్భంగా రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులకు, అతిథులకు వాటిని వడ్డిస్తారు. ఆ వంటకాల్లో డంప్లింగ్స్, టాంగ్యూన్ తప్పనిసరిగా ఉంటాయి. ఇక డ్రాగన్ అండ్ లయన్ డ్యాన్స్ న్యూ ఇయర్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ వేషధారణలో నృత్యాలు చేస్తే దుష్టశక్తులు తమ దరిచేరవని నమ్ముతారు.
భారత్లోనూ చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు
ఇక మనదేశం(india)లో పశ్చమబెంగాల్ రాజధాని కోల్కతాలోని టైరెట్టా బజార్లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతాన్ని ఓల్డ్ చైనా మార్కెట్గా కూడా పిలుస్తారు. ఇక్కడ ఒకప్పుడు 20వేల మంది చైనా-భారత సంతతి ప్రజలు నివసిస్తుండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 2వేలు మాత్రమే ఉన్నట్లు అంచనా. ఇక్కడ చేసే లయన్, డ్రాగన్ నృత్యాలు బాగా ఆకట్టుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం