Karnataka : రాజకీయాల్లో చందనసీమ తారాజువ్వలు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) భాజపాలో (BJP) చేరతారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో మీడియా (Media) ముందుకు వచ్చిన సుదీప్ తనకు గాడ్ ఫాదర్లాంటి సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj bommai) కోసం ప్రచారం మాత్రమే చేస్తానని, పోటీ చేయబోనని స్పష్టం చేశారు.
దక్షిణాదిలో సినీ, రాజకీయ (politics) రంగాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగునాట ఎన్టీఆర్ (NTR), తమిళనాట జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి సినీ రంగంలో పేరు సంపాదించి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పెను సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రి (CM) పీఠంపై తమదైన ముద్ర వేసి సత్తా చూపించారు. ఇటీవలే కన్నడ (Karnataka) నాట అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తాజాగా కన్నడ స్టార్ సుదీప్ (Sudeep) ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. దాన్ని ఖండించిన ఆయన సీఎం బసవరాజ్ బొమ్మై కోసం మాత్రమే భాజపాకు ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలపై అక్కడి నటులు ఎలాంటి ముద్రవేశారో చదివేయండి.
అగ్రనటుడు అంబరీశ్
దివంగత కన్నడ నటుడు అంబరీశ్ దాదాపు రెండొందలకు పైగా చిత్రాల్లో నటించారు. రాజ్కుమార్, విష్ణువర్దన్లతో సమానమైన గ్రాఫ్ ఈయనకు ఉండేది. దాంతో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ౧౯౯౪లో కాంగ్రెస్లో చేరారు. తర్వాత రెండేళ్లకు జనతాదళ్ తీర్థం పుచ్చుకొని ౧౯౯౮లో పోటీ చేశారు. మండ్య స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. ౧౯౯౯లో మళ్లీ సొంతగూటికి చేరి ఎంపీగా గెలుపొందారు. కేంద్ర మంత్రి పదవి రావడంతో ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా కొనసాగారు. కావేరీ జల వివాదంలో అన్యాయం జరిగిందని విమర్శిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ౨౦౦౯ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగిన అంబరీశ్.. హెచ్డీ కుమారస్వామి, ఎస్.ఎం కృష్ణ, కేఆర్. పేటే కృష్ణ వంటి ప్రముఖులను గెలిపించడం కోసం ప్రచారం చేశారు.
మండ్య ఎంపీగా సుమలత
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్రనటి సుమలత. ౨౨౦కి పైగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సినీ కెరీర్లో స్వీట్స్పాట్కు చేరుకొన్నాక అంబరీశ్ను వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత ౨౦౧౯ ఎన్నికల్లో మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శన్, రాక్లైన్ వెంకటేశ్, దొడ్డన్న వంటి సినీ ప్రముఖులు కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని ఇటీవల సుమలత ప్రకటించారు.
రాజకీయ వారసుడు నిఖిల్
౨౦౧౬లో విడుదలైన ‘జాగ్వార్’ చిత్రంతో కన్నడ, తెలుగు ప్రేక్షకులను పలకరించారు నిఖిల్ కుమారస్వామి. ఇప్పటి వరకు ఐదు చిత్రాల్లో నటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వారసుడిగా ఈయన రాజకీయ రంగప్రవేశం చేశారు. ౨౦౧౯ లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ టికెట్పై మండ్య స్థానం నుంచి ఎంపీగా పోటీచేశారు. కానీ, ఈ ఎన్నికల్లో నటి సుమలత చేతిలో నిఖిల్కు ఓటమి తప్పలేదు.
దివ్య స్పందన అలియాస్ రమ్య
చందన సీమలో అగ్ర శ్రేణి తారగా గుర్తింపు తెచ్చుకున్నారు రమ్య. ఆమె నటనకుగానూ రెండు ఫిల్మ్ఫేర్, ఉదయ, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు దక్కాయి. ఈమె తల్లి రంజిత కాంగ్రెస్లో చురుగ్గా పనిచేశారు. దాంతో రమ్య కూడా రాజకీయాలపై ఆసక్తితో ౨౦౧౨లో యూత్ కాంగ్రెస్లో చేరారు. తర్వాత మండ్య లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ౨౦౧౪లో మరోసారి పోటీ చేసి సీఎస్ పుట్టరాజు చేతిలో కేవలం ౫,౫౦౦ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. రమ్య భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ను నడిపిస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్
తన జీవితంలో సినిమా, రాజకీయాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ సాగిపోతున్నారు జగ్గేశ్. కెరీర్ తొలినాళ్లలో చిన్న పాత్రల్లో నటించారు. ఆ తరువాత విలన్గా అవకాశాలు వచ్చాయి. తనదైన శైలిలో హాస్యప్రతిభను చాటుతూ ఒక పెద్ద స్టార్గా ఎదిగారు. తొలుత కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీగా, కేఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్గా కొనసాగారు. కొన్నేళ్లపాటు హస్తం పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ౨౦౨౨ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
యాక్షన్ హీరో కుమార్ బంగారప్ప
౮0-౯౦వ దశకంలో యాక్షన్ హీరోగా రాణించారు కుమార్ బంగారప్ప. నాటకీయ పరిణామాల మధ్య రాజకీయాల్లో ప్రవేశించిన ఈయన ౧౯౯౬లో సొరబ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో అనేక పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ఈయన తండ్రి ఎస్.బంగారప్ప విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి దక్కక పోవడంతో ఎస్.బంగారప్ప సొంతంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ౧౯౯౯లో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో హస్తం గుర్తుపై బంగారప్ప రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ౨౦౦౪ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి ఎస్ఎం కృష్ణ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
సూపర్స్టార్ల చిత్రాల్లో శ్రుతి
చందనసీమపై తన దైన ముద్ర వేసిన నటీమణుల్లో శ్రుతి ఒకరు. రెండు దశాబ్దాలపాటు ఆమె వెండితెరపై వెలుగు వెలిగారు. ఈ క్రమంలో కన్నడ సూపర్ స్టార్లందరితో ఆమె కలిసి పని చేశారు. ౨౦౦౮లో ఆమె కాషాయ కండువా కప్పుకొని భాజపాలో చేరారు. దాంతో ఆమెకు మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవి దక్కింది. తర్వాతి కాలంలో శ్రుతి కర్ణాటక జనతాపక్ష పార్టీలో చేరారు. ౨౦౧౪లో ఆ పార్టీని భాజపాలో విలీనం చేశారు. ప్రస్తుతం ఈమె కర్ణాటక కేడర్ విమెన్స్ వింగ్లో ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
‘మాల్గుడి డేస్’ డాక్టర్ అనంత్నాగ్ నగర్కట్టే
దాదాపు ౩౦౦ చిత్రాలో నటించిన డాక్టర్ అనంత్నాగ్ నగర్కట్టే నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దూరదర్శన్లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’లోనూ ఈయన నటించారు. అనంత్ నటనకు ఆరు ఫిల్మ్ఫేర్ సహా ఎన్నో అవార్డులు వరించాయి. రాజకీయాల్లో ప్రవేశించి జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణపై కూడా జేడీఎస్ అభ్యర్థిగా ఓ సారి పోటీ చేశారు. ఇటీవలి కాలంలో ఈయన భాజపాలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్
నటుడిగా రాణించిన బీసీ పాటిల్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. హీరేకెరూర్ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సినిమాల్లోకి రాక ముందు ఈయన పోలీసు శాఖలో పనిచేశారు.
శశి కుమార్
నటుడిగా రాణిస్తున్న సమయంలోనే శశికుమార్ ఓ ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయనకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. రాజకీయాల్లోకి ప్రవేశించి జనతాదళ్ (యు)లో చేరారు. ౧౯౯౯లో చిత్రదుర్గ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.
తార
అనురాధగా పుట్టి.. సినిమాల్లో ‘తార’గా రాణించారీమె. సహాయక పాత్రల ద్వారా తార కన్నడ సీమలో అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ‘హసీనా’లో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తరువాత కమల దళంలో చేరిన ఆమెకు ౨౦౧౨లో కర్ణాటక చలనచిత్ర అకాడమీ అధ్యక్షురాలి హోదా దక్కింది. ఏడాది తర్వాత ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఉమా శ్రీ
సహాయక పాత్రల ద్వారా కన్నడ సినిమాల్లో రాణించిన మరో నటి ఉమా శ్రీ. ఎక్కువగా ఈమె హాస్యపాత్రల్లో నటించి నవ్వులు పూయించింది. రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్లో చేరి.. ౨౦౧౩ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అధిష్ఠానం గుర్తింపుతో సిద్ధరామయ్య మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగింది.
వీరు మాత్రమే కాకుండా నరేంద్రబాబు, మాళవిక అవినాశ్, భావన వంటి నటులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తరహాలో తమ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి నటులు కన్నడ సీమలో ఇంతవరకు లేరనే చెప్పవచ్చు. సినీ కెరీర్ గ్రాఫ్ టాప్లో ఉన్న సమయంలో దిగ్గజ నటుడు రాజ్కుమార్కు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం దక్కింది. జేహెచ్ పటేల్, జార్జ్ ఫెర్నాండెజ్లు ఆయనను కలిసి 1978 ఎన్నికల్లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయమని కోరారు. కానీ, ఆయనకు తన సినీ గ్లామర్ను రాజకీయాలకు వినియోగించుకోవడం ఇష్టం ఉండేది కాదట. అందుకే ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?