Twitter vs Threads: ట్విటర్కు కాస్త ఇబ్బందే.. పోటీ యాప్లు పెరుగుతున్నాయ్!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్కు (Twitter) పోటీగా మెటా (Meta) ‘థ్రెడ్స్’ను (Threads) తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీల మధ్య పోటీ ఎలా సాగుతోందో తెలుసుకోండి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) ట్విటర్ను (Twitter) కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ సామాజిక మాధ్యమంలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. చాలా మంది సెలబ్రిటీల బ్లూ టిక్ తొలగించాడు. కొంత రుసుం వసూలు చేసి సాధారణ యూజర్లకు కూడా బ్లూ టిక్ ఇచ్చేశాడు. కొద్ది రోజుల క్రితం పోస్టులు చేయడానికి, చూడటానికి కూడా పరిమితి పెట్టేశాడు. ఈ చర్యలతో ట్విటర్ యూజర్లు మస్క్పై గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో మెటా (Meta) కంపెనీ ‘థ్రెడ్స్’ను (Threads) తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి? ఏ విధంగా దూసుకెళ్తోంది? ఇలాంటి ఇతర యాప్లకు కూడా ఆదరణ పెరుగుతోందా?తదితర విషయాలు పరిశీలించండి.
ఏంటీ ‘థ్రెడ్స్’
ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ల మాతృసంస్థ మెటా ఈ నెల 5న ‘థ్రెడ్స్’ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్ ఆధారిత పబ్లిక్ సంభాషణలు జరిపే యాప్. ఇన్స్టాగ్రామ్ యాప్ వెనుకున్న సాంకేతిక బృందమే దీనిని అభివృద్ధి చేసింది. సుమారు 100 దేశాల్లోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ను వినియోగించుకునే వీలుంది. దాంతో రెండ్రోజుల్లోనే ఏడు కోట్ల మంది ఈ యాప్లో ఖాతా తెరిచారు. ఈ అనూహ్య స్పందన చూసి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సైతం ఆశ్చర్యపోయాడట.
ఎలా పని చేస్తుంది?
‘థ్రెడ్స్’ అనేది యూజర్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భాగం. అందులో నుంచే వారు ఈ ఖాతా తెరవచ్చు. దాంతో అప్పటికే వాడుతున్న ఖాతా పేరు, అనుసరిస్తున్న ఖాతాలు కొత్త యాప్లోకి కూడా బదిలీ అవుతాయి. బ్లాకింగ్, పరిమిత వినియోగదారులు, పదాలను కనిపించకుండా చేయడం వంటి ఫీచర్లు ఈ రెండు యాప్లలోనూ ఉన్నాయి. ఒక వేళ యూజర్లకు ‘థ్రెడ్స్’ యాప్ నచ్చకపోతే వారి ఖాతాను డీ యాక్టివేట్ చేసుకోవచ్చు కానీ, డిలీట్ చేయలేరు. పొరపాటును ఈ ఖాతాను డిలీట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా పోతుందట. ‘థ్రెడ్స్’ నుంచి గోప్యంగా ఇతరులకు సందేశం పంపించే వీలు లేదు.
డేటా మొత్తం సేకరిస్తోంది
గూగుల్ ప్లే స్టోర్ ప్రకారం.. థ్రెడ్స్ యూజర్ల ప్రాంతం, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం, ఆరోగ్యం, ఫిట్నెస్, సందేశాలు, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్, ముఖ్యమైన రోజులు తదితర డేటాను సేకరిస్తుంది. అంతేకాకుండా చిరునామా, ఫోన్ నంబర్, రాజకీయ, మత పరమైన ఆసక్తులు, లైంగిక ధోరణి గురించి కూడా తెలుసుకుంటుందట.
ట్విటర్ సారూప్యతలు
థ్రెడ్స్లోని యూజర్ ఇంటర్ఫేస్, బేసిక్ ఫీచర్లన్నీ దాదాపు ట్విటర్ను పోలి ఉన్నాయి. ఇందులో పోస్ట్, కామెంట్, రిప్లై వంటి కార్యకలాపాలు చేయొచ్చు. ఒక పోస్టును ఐదు వందల అక్షరాలకు పరిమితం చేశారు. లింక్లు, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను కూడా పోస్ట్ చేసే సదుపాయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చాలా మంది ట్విటర్ను వినియోగిస్తున్నారు. ఏదైనా హాట్ టాపిక్ గురించి కీవర్డ్ను టైప్ చేస్తే ఆ సమాచారం వెంటనే తెరపై ప్రత్యక్షమవుతుంది. కానీ, థ్రెడ్స్లో అలాంటి ఫీచర్ లేదు. రోజువారీ సంఘటనలను తెలుసుకునే ‘ట్రెండ్స్’ ఫీచర్ను కూడా కొత్త యాప్లో ప్రవేశపెట్టలేదు. అయితే ఇందులో ఇప్పటి దాకా ప్రకటనలు కనిపించలేదు.
మస్క్ స్పందన..
‘థ్రెడ్స్’ రాబోతోందన్న వార్తల గురించి ఎలాన్ మస్క్ మొదట్లో పొడిపొడిగా ప్రతిస్పందించారు. అయితే ‘థ్రెడ్స్’ను ట్విటర్లాగే రూపొందించారని తెలిసి తమ న్యాయవాది అలెక్స్ స్పైరోతో జుకర్బర్గ్కు ఓ లేఖ పంపించారు. తమ సంస్థలో పనిచేసిన పాత ఉద్యోగులను మెటా నియమించుకుని వాణిజ్య రహస్యాలు, ఇతర మేధోపరమైన అంశాలను తెలుసుకుందని ఆ లేఖలో ఆరోపించారు. ట్విటర్ వాణిజ్య రహస్యాలను, ఇతర రహస్య సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు చేపట్టాలని.. లేదంటే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ‘పోటీ మంచిదే. కానీ, మోసం సరైన పద్ధతి కాదు’ అని ఎలాన్ మస్క్ కూడా తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలను మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ ఖండించారు. థ్రెడ్స్ ఇంజినీరింగ్ బృందంలో పని చేస్తున్న వారెవరూ కూడా గతంలో ట్విటర్లో పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఐరోపాలో ఆలస్యం
విడుదలైన తొలి రోజే దాదాపు 100 దేశాల్లోకి అడుగుపెట్టిన ‘థ్రెడ్స్’కు ఐరోపాలో మాత్రం అడ్డుకట్ట పడింది. రెగ్యులేటరీ సమస్యల కారణంగా మెటా దీన్ని ప్రారంభించలేకపోయింది. కొంచెం ఆలస్యమైనా ఈయూ చట్టాలకు తగినట్లుగా కొన్ని మార్పులు చేసి త్వరలోనే ‘థ్రెడ్స్’ను ప్రవేశపెడతామని ఇన్స్టాగ్రామ్ సీఈవో ఆడం మోస్సేరి తెలిపారు. ఐరోపాలో మే నెలలో ‘ఈయూ డిజిటల్ మార్కెట్ చట్టం’ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఆన్లైన్ వేదికలు డేటాను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలి. ప్రత్యర్థులకు నష్టం కలిగించకూడదు. టార్గెట్ ప్రకటనల కోసం యూజర్ల సమ్మతి తీసుకోవాలి.
మరిన్ని పోటీ యాప్లు
స్పిల్ : దీన్ని ట్విటర్ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. ఇందులో దృశ్య సంభాషణలు చేయొచ్చు. యూజర్లు గిఫ్స్, మీమ్స్, వీడియోలను పోస్టు చేసుకోవచ్చు. ట్విటర్లో పోస్టుల రీడ్కు మస్క్ పరిమితి విధించిన నేపథ్యంలో వేల కొద్దీ కొత్త యూజర్లు తమ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చారని స్పిల్ సీఈవో టొర్రెల్ తెలిపారు.
టీ2 : ఈ సామాజిక మాధ్యమాన్ని కూడా ట్విటర్ మాజీ ఉద్యోగులే అభివృద్ధి చేశారు. ఇందులో 280 అక్షరాలతో పోస్టులు చేయొచ్చు.
బ్లూ స్కై : ఈ సామాజిక మాధ్యమం సృష్టి వెనుక ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఉన్నాడు. డీ సెంట్రలైజ్డ్ నెట్వర్క్ ఇందులోని ప్రత్యేకత.
మాస్టోడాన్ : ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేయక ముందు నుంచే మాస్టోడాన్ ఉంది. అయితే మస్క్ నిర్ణయాల కారణంగా ఈ యాప్నకు ఆదరణ పెరిగింది. ఇందులో ప్రకటనలు కనిపించవు.
కోహోస్ట్ : 2022 ప్రారంభమైన ఈ నెట్వర్క్లోనూ దాదాపు ట్విటర్లో ఉన్న అన్ని ఫీచర్లున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్