Twitter vs Threads: ట్విటర్కు కాస్త ఇబ్బందే.. పోటీ యాప్లు పెరుగుతున్నాయ్!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్కు (Twitter) పోటీగా మెటా (Meta) ‘థ్రెడ్స్’ను (Threads) తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీల మధ్య పోటీ ఎలా సాగుతోందో తెలుసుకోండి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) ట్విటర్ను (Twitter) కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ సామాజిక మాధ్యమంలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. చాలా మంది సెలబ్రిటీల బ్లూ టిక్ తొలగించాడు. కొంత రుసుం వసూలు చేసి సాధారణ యూజర్లకు కూడా బ్లూ టిక్ ఇచ్చేశాడు. కొద్ది రోజుల క్రితం పోస్టులు చేయడానికి, చూడటానికి కూడా పరిమితి పెట్టేశాడు. ఈ చర్యలతో ట్విటర్ యూజర్లు మస్క్పై గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో మెటా (Meta) కంపెనీ ‘థ్రెడ్స్’ను (Threads) తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి? ఏ విధంగా దూసుకెళ్తోంది? ఇలాంటి ఇతర యాప్లకు కూడా ఆదరణ పెరుగుతోందా?తదితర విషయాలు పరిశీలించండి.
ఏంటీ ‘థ్రెడ్స్’
ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ల మాతృసంస్థ మెటా ఈ నెల 5న ‘థ్రెడ్స్’ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్ ఆధారిత పబ్లిక్ సంభాషణలు జరిపే యాప్. ఇన్స్టాగ్రామ్ యాప్ వెనుకున్న సాంకేతిక బృందమే దీనిని అభివృద్ధి చేసింది. సుమారు 100 దేశాల్లోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ను వినియోగించుకునే వీలుంది. దాంతో రెండ్రోజుల్లోనే ఏడు కోట్ల మంది ఈ యాప్లో ఖాతా తెరిచారు. ఈ అనూహ్య స్పందన చూసి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సైతం ఆశ్చర్యపోయాడట.
ఎలా పని చేస్తుంది?
‘థ్రెడ్స్’ అనేది యూజర్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భాగం. అందులో నుంచే వారు ఈ ఖాతా తెరవచ్చు. దాంతో అప్పటికే వాడుతున్న ఖాతా పేరు, అనుసరిస్తున్న ఖాతాలు కొత్త యాప్లోకి కూడా బదిలీ అవుతాయి. బ్లాకింగ్, పరిమిత వినియోగదారులు, పదాలను కనిపించకుండా చేయడం వంటి ఫీచర్లు ఈ రెండు యాప్లలోనూ ఉన్నాయి. ఒక వేళ యూజర్లకు ‘థ్రెడ్స్’ యాప్ నచ్చకపోతే వారి ఖాతాను డీ యాక్టివేట్ చేసుకోవచ్చు కానీ, డిలీట్ చేయలేరు. పొరపాటును ఈ ఖాతాను డిలీట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా పోతుందట. ‘థ్రెడ్స్’ నుంచి గోప్యంగా ఇతరులకు సందేశం పంపించే వీలు లేదు.
డేటా మొత్తం సేకరిస్తోంది
గూగుల్ ప్లే స్టోర్ ప్రకారం.. థ్రెడ్స్ యూజర్ల ప్రాంతం, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం, ఆరోగ్యం, ఫిట్నెస్, సందేశాలు, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్, ముఖ్యమైన రోజులు తదితర డేటాను సేకరిస్తుంది. అంతేకాకుండా చిరునామా, ఫోన్ నంబర్, రాజకీయ, మత పరమైన ఆసక్తులు, లైంగిక ధోరణి గురించి కూడా తెలుసుకుంటుందట.
ట్విటర్ సారూప్యతలు
థ్రెడ్స్లోని యూజర్ ఇంటర్ఫేస్, బేసిక్ ఫీచర్లన్నీ దాదాపు ట్విటర్ను పోలి ఉన్నాయి. ఇందులో పోస్ట్, కామెంట్, రిప్లై వంటి కార్యకలాపాలు చేయొచ్చు. ఒక పోస్టును ఐదు వందల అక్షరాలకు పరిమితం చేశారు. లింక్లు, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను కూడా పోస్ట్ చేసే సదుపాయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చాలా మంది ట్విటర్ను వినియోగిస్తున్నారు. ఏదైనా హాట్ టాపిక్ గురించి కీవర్డ్ను టైప్ చేస్తే ఆ సమాచారం వెంటనే తెరపై ప్రత్యక్షమవుతుంది. కానీ, థ్రెడ్స్లో అలాంటి ఫీచర్ లేదు. రోజువారీ సంఘటనలను తెలుసుకునే ‘ట్రెండ్స్’ ఫీచర్ను కూడా కొత్త యాప్లో ప్రవేశపెట్టలేదు. అయితే ఇందులో ఇప్పటి దాకా ప్రకటనలు కనిపించలేదు.
మస్క్ స్పందన..
‘థ్రెడ్స్’ రాబోతోందన్న వార్తల గురించి ఎలాన్ మస్క్ మొదట్లో పొడిపొడిగా ప్రతిస్పందించారు. అయితే ‘థ్రెడ్స్’ను ట్విటర్లాగే రూపొందించారని తెలిసి తమ న్యాయవాది అలెక్స్ స్పైరోతో జుకర్బర్గ్కు ఓ లేఖ పంపించారు. తమ సంస్థలో పనిచేసిన పాత ఉద్యోగులను మెటా నియమించుకుని వాణిజ్య రహస్యాలు, ఇతర మేధోపరమైన అంశాలను తెలుసుకుందని ఆ లేఖలో ఆరోపించారు. ట్విటర్ వాణిజ్య రహస్యాలను, ఇతర రహస్య సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు చేపట్టాలని.. లేదంటే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ‘పోటీ మంచిదే. కానీ, మోసం సరైన పద్ధతి కాదు’ అని ఎలాన్ మస్క్ కూడా తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలను మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ ఖండించారు. థ్రెడ్స్ ఇంజినీరింగ్ బృందంలో పని చేస్తున్న వారెవరూ కూడా గతంలో ట్విటర్లో పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఐరోపాలో ఆలస్యం
విడుదలైన తొలి రోజే దాదాపు 100 దేశాల్లోకి అడుగుపెట్టిన ‘థ్రెడ్స్’కు ఐరోపాలో మాత్రం అడ్డుకట్ట పడింది. రెగ్యులేటరీ సమస్యల కారణంగా మెటా దీన్ని ప్రారంభించలేకపోయింది. కొంచెం ఆలస్యమైనా ఈయూ చట్టాలకు తగినట్లుగా కొన్ని మార్పులు చేసి త్వరలోనే ‘థ్రెడ్స్’ను ప్రవేశపెడతామని ఇన్స్టాగ్రామ్ సీఈవో ఆడం మోస్సేరి తెలిపారు. ఐరోపాలో మే నెలలో ‘ఈయూ డిజిటల్ మార్కెట్ చట్టం’ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఆన్లైన్ వేదికలు డేటాను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలి. ప్రత్యర్థులకు నష్టం కలిగించకూడదు. టార్గెట్ ప్రకటనల కోసం యూజర్ల సమ్మతి తీసుకోవాలి.
మరిన్ని పోటీ యాప్లు
స్పిల్ : దీన్ని ట్విటర్ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. ఇందులో దృశ్య సంభాషణలు చేయొచ్చు. యూజర్లు గిఫ్స్, మీమ్స్, వీడియోలను పోస్టు చేసుకోవచ్చు. ట్విటర్లో పోస్టుల రీడ్కు మస్క్ పరిమితి విధించిన నేపథ్యంలో వేల కొద్దీ కొత్త యూజర్లు తమ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చారని స్పిల్ సీఈవో టొర్రెల్ తెలిపారు.
టీ2 : ఈ సామాజిక మాధ్యమాన్ని కూడా ట్విటర్ మాజీ ఉద్యోగులే అభివృద్ధి చేశారు. ఇందులో 280 అక్షరాలతో పోస్టులు చేయొచ్చు.
బ్లూ స్కై : ఈ సామాజిక మాధ్యమం సృష్టి వెనుక ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఉన్నాడు. డీ సెంట్రలైజ్డ్ నెట్వర్క్ ఇందులోని ప్రత్యేకత.
మాస్టోడాన్ : ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేయక ముందు నుంచే మాస్టోడాన్ ఉంది. అయితే మస్క్ నిర్ణయాల కారణంగా ఈ యాప్నకు ఆదరణ పెరిగింది. ఇందులో ప్రకటనలు కనిపించవు.
కోహోస్ట్ : 2022 ప్రారంభమైన ఈ నెట్వర్క్లోనూ దాదాపు ట్విటర్లో ఉన్న అన్ని ఫీచర్లున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా