SubWays: అరుదైన సూపర్ సబ్వే మెట్రో స్టేషన్స్!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన సబ్వే రవాణా వ్యవస్థలు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉండటం గమనార్హం. కొన్ని సబ్వే మెట్రో స్టేషన్లను ఎప్పుడో మూసివేయగా.. మరికొన్నింటిని కరోనా మహమ్మారి నేపథ్యంలో అధికార యంత్రాంగం తెరవడం లేదు.
నగరాలకు వన్నెతెచ్చినా.. నిరుపయోగంగానే!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన సబ్వే రవాణా వ్యవస్థలు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉండటం గమనార్హం. కొన్ని సబ్వే మెట్రో స్టేషన్లను ఎప్పుడో మూసివేయగా.. మరికొన్నింటిని కరోనా మహమ్మారి నేపథ్యంలో అధికార యంత్రాంగం తెరవడం లేదు. నగరాలకు వన్నె తెచ్చేలా ఉన్న సబ్వే మెట్రో నిర్మాణాల గురించి తెలుసుకుందాం...
సబ్వేను మ్యూజియంగా మార్చేసి...
సబ్వేల నిర్మాణాలకు స్పెయిన్ పెట్టింది పేరు. మాడ్రిడ్లో ఎనిమిది మెట్రో స్టేషన్లతో 1919లో ప్రారంభించిన సబ్వేలను, 1966లో మూసివేశారు. అక్కడ అధునాతన రైళ్ల రాకపోకలకు సౌకర్యవంతంగా లేకపోవడంతో వాటిని మూసివేయడం గమనార్హం. పారిస్లోని మెట్రోస్టేషన్లను ఆదర్శంగా తీసుకుని అలాంటి ఫీచర్స్తోనే మాడ్రిడ్లో నిర్మించారు. 2008లో మళ్లీ వాటిని తెరచి మ్యూజియంగా మార్చేశారు. 1920లో ప్రజల జీవిత విధానం ఎలా ఉందో కళ్లకు కట్టేలా తీర్చిదిద్దారు.
పారిస్లోనే మూడు.. చిత్రీకరణకు సూపర్!
పారిస్లో సెయింట్ డెనిస్-రిపబ్లిక్ స్టేషన్ల మధ్య సెయింట్ మార్టిన్ సబ్ వే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో దీన్ని మూసివేశారు. అయితే యుద్ధం ముగిశాక మళ్లీ తెరచినా కొంతకాలానికే మూతపడింది. ఖాళీగా ఉండటంతో నిరాశ్రయులు అక్కడకు చేరుకోవడం మొదలైంది. ఇప్పటికీ గోడలపై అప్పటి పోస్టర్లు ఉన్నాయి. అలాగే పారిస్లో 1923-39 మధ్యకాలంలో తొలి మెట్రో లైన్ క్రొయిక్స్ రౌగ్. అయితే రెండో ప్రపంచయుద్ధం తర్వాతి నుంచి ఇప్పటి వరకు మెట్రో సబ్వేను పునఃప్రారంభించకపోవడం గమనార్హం. పారిస్లోని పన్నెండు మెట్రో స్టేషన్లలో రెండో ప్రపంచ యుద్ధంవేళ చాలావాటిని మూసివేసినా మళ్లీ తర్వాత తెరిచారు. అయితే క్రొయిక్స్ రౌగ్ మెట్రో సబ్వే స్టేషన్ను తెరవకుండా అలానే వదిలేశారు. పోర్ట్ డెస్ లిలాస్ సబ్వే మెట్రో స్టేషన్ను 1929లో మూసివేశారు. 1970 నుంచి సినిమాల చిత్రీకరణకు అద్భుతమైన ప్రాంతంగా ఇది పేరుగాంచింది. సాధారణ ప్రజల సందర్శన కోసం సబ్ వే మెట్రో స్టేషన్ను తెరిచి ఉంచారు. యూరోపియన్ చారిత్రాత్మక ప్రదేశంగా యాత్రికుల దృష్టిని ఇది ఆకర్షించింది. ఇక్కడ సినిమా చిత్రీకరణ కోసం పది గంటల సమయానికి 17,500 డాలర్లను వెచ్చించాల్సి ఉంటుంది.
దెయ్యాల నిలయాలుగా ప్రసిద్ధి!
లండన్లోని ఘోస్ట్ స్టేషన్లలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది అల్డ్విచ్ సబ్వే మెట్రో స్టేషన్. 1994కు వరకు పని చేసిన స్టేషన్ను అధికారులు మూసివేశారు. అయితే ఇప్పటికీ చూడటానికి అనుమతిస్తున్నారు. చెక్కతో రూపొందించిన పానెల్స్, చారిత్రక పోస్టర్లను పరిరక్షించారు. ఇక్కడ కూడా హాలీవుడ్ చిత్రాలను చిత్రీకరించారు. స్టేషన్కు పర్యాటకులను చేరవేసేలా లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం టూర్లు నిర్వహిస్తోంది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యటనలను ప్రస్తుతం తాత్కాలికంగా రద్దు చేసింది. లండన్లో అండర్గ్రౌండ్ రవాణా వ్యవస్థలు ఎక్కువగా ఉండేవి. ఈస్ట్రన్లోని సబ్వే మెట్రోస్టేషన్ ఎంతో బిజీగా ఉండే రూట్. అయితే న్యూ విక్టోరియా లైన్ను పునర్నిర్మాణం చేయడంతో ఈస్ర్టన్ టన్నెల్స్ ప్రభ తగ్గిపోయింది.
మధ్యలోనే వదిలేసిన అతిపెద్ద నిర్మాణం
అండర్గ్రౌండ్లో సబ్వే నిర్మాణమంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమెరికాలో చాలా సబ్వే మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అయితే సిన్సినాటీ సబ్వే మెట్రో స్టేషన్ నిర్మాణాన్ని 20వ శతాబ్దం తొలినాళ్లల్లో ప్రారంభించారు. నిర్మాణ వ్యయం పెరగడం, నిధుల సమస్య, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ప్రాజెక్టు ఆగిపోయింది. 1928లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వదిలిపెట్టేశారు. అమెరికాలోనే రద్దయిన అత్యంత పెద్ద టన్నెల్గా ఇది రికార్డుకెక్కింది. ఇప్పుడు లాస్ఏంజెలెస్ నగరంలో ఉన్న సబ్వే కాకుండా ఓల్డ్ సిటీలోనూ సబ్వే టెర్మినల్ ఉంది. 1940లలో దాదాపు 65వేల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ప్రస్తుతం సబ్వే మెట్రో స్టేషన్ అందుబాటులో లేదు.
నిరుపయోగంగా మారి..
గతంలో అవిభాజ్య సోవియట్ యూనియన్ విస్తీర్ణం చాలా పెద్దది. రష్యా నుంచి విడిపోయాక అనేక దేశాలు రిపబ్లిక్కులుగా ప్రకటించుకున్నాయి. వాటిలో ఉక్రెయిన్ పెద్దది. పురాతన చర్చీలకు పెట్టింది పేరు. అలానే కీవ్ మెట్రో స్టేషన్ను సోవియట్ యూనియన్ నిర్మించింది. అందులో న్యూక్లియర్ టన్నెల్స్, బంకర్లు, గిడ్డంగులు ఉండటం విశేషం. అయితే సబ్వే టన్నెల్లోకి వెళ్లాలంటే మాత్రం అంత సులభం కాదు. అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం కల్పిస్తారు.
బెల్జియంలో సొరంగం.. కెనడాలో కేవలం ఆరు నెలలే..
సొరంగ మార్గంలో రైలు దూసుకుపోతుంటే భలేగా ఉంటుంది కదా! బెల్జియంలోని యాంట్వెర్ప్ ప్రిమెట్రో స్టేషన్ను 1980లలో నిర్మించారు. ఇప్పటికీ ఇది వినియోగంలో ఉండటం విశేషం. నగర కేంద్రాన్ని అనుసంధానం చేసేలా టన్నెల్స్ నిర్మాణానికి నిధుల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఇక కెనడా టొరొంటోలోని లోయర్ బే స్టేషన్ను కేవలం ఆరు నెలలు మాత్రమే వినియోగించడం గమనార్హం. ఇంటర్లైనింగ్ ద్వారా కొత్త కనెక్ట్విటీ ఇవ్వాలనే ప్రయోగం కారణంగా ఈ ప్రాజెక్ట్ విఫలమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.