టీకాతో పూర్తి రక్షణే..కానీ..!
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ వల్ల కలిగే తీవ్ర జబ్బు నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ..ఇదే సమయంలో టీకా తీసుకున్న వారికి వైరస్ లక్షణాలుంటే వారినుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
వీరినుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం
హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేవరకు జాగ్రత్తలు తప్పనిసరి - నిపుణులు
దిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ వల్ల కలిగే తీవ్ర జబ్బు నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ..ఇదే సమయంలో టీకా తీసుకున్న వారికి వైరస్ లక్షణాలుంటే వారినుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుచేత టీకా తీసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు.
‘కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఉన్న వ్యూహాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ సాధనం మాత్రమే. అయినప్పటికీ మహమ్మారిని పూర్తిగా ఎదుర్కోవడంలో ఇదో అద్భుతమైన పరిష్కారం కాదు’ అని దిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇమ్యూనాలజిస్ట్ సత్యజిత్ రథ్ తెలిపారు. ‘వ్యాక్సిన్ తీసుకోని వారితో పోల్చితే టీకా తీసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ తక్కువగానే ఉంటుంది. కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా వైరస్ల వ్యాప్తిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు నిరోధించలేవు. దీంతో కొత్తరకాల వల్లే కలిగే ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది’ అని పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కి చెందిన ఇమ్యూనాలజిస్ట్ వినీతా బాల్ పేర్కొన్నారు.
వైరస్ వ్యాప్తికి కారణాలివే..
కమ్యూనిటీ స్థాయిలో కొవిడ్ కట్టడి చేయడంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం దోహదం చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా పూర్తి రక్షణ కలుగుతుంది. కానీ, వారు కొవిడ్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే మరోసారి కరోనా బారినపడే అవకాశం ఉంటుంది. తొలుత వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధకత కొన్నిరోజుల తర్వాత తగ్గిపోవడం ఇందుకు ఒక కారణమైతే.. వివిధ కొత్త రకాల వైరస్లు వెలుగుచూడడం మరో కారణం’ అని ఇమ్యూనాలజీ నిపుణులు డాక్టర్ సత్యజిత్ రథ్ విశ్లేషిస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేవరకూ వైరస్ కట్టడికి ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గర్భిణిలు, చిన్నారులకు ఇచ్చే టీకాల కోసం ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్న నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పట్లో సాధించడం కూడా కష్టమేననే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
రోగనిరోధకత కోల్పోవడమూ మరో కారణం..
‘కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇవి కల్పించే రోగనిరోధకత ఎన్ని నెలలు ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అందుచేత ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొన్ని నెలల తర్వాత వ్యాధినిరోధకత కణాలు వాటి మెమొరీని కోల్పోతాయి. దీంతో అలాంటి వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది’ అని వినీతా బాల్ పేర్కొన్నారు. అందుచేత వ్యాక్సిన్ తీసుకున్న వారుకూడా మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వైరస్ నుంచి వ్యాక్సిన్ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న వారినుంచి ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాపిస్తుందా? అన్న కోణంలో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో లక్షణాలున్నట్లయితే వారినుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న వారుకూడా మాస్కులు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేంత వరకూ ఈ జాగ్రత్తలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?