Vande Bharat Express: వందే భారత్.. అలా మొదలైంది!
తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) ఈ నెల 19న హైదరాబాద్ నుంచి విశాఖకు పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించనున్న ఈ రైలును ఎలా తీర్చిదిద్దారు.. దాని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande bharat express) ఈ నెల 19న హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖ (Vizag)కు పరుగులు పెట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించనున్నారు. అసలు ఈ వందే భారత్ రైలును ఎలా తీర్చిదిద్దారు.. దాని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.
ఇలా రూపకల్పన..
వేగవంతమైన రైళ్లు నడపాలనేది ఎప్పటి నుంచో భారతీయ రైల్వే(indian railways) ఆలోచన. అలా 2015లో మోడ్రన్ హై స్పీడ్ రైలుకు రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దానికి స్పందన రాకపోవడంతో 2017లో దేశీయంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు(semi high speed train) తయారీ చేయాలని ప్రభుత్వం దృఢంగా నిశ్చయించుకొంది. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడమే లక్ష్యంగా చెన్నైలోని ఐసీఎఫ్లో ‘ట్రైన్-18’ (train 18)ప్రాజెక్టు పట్టాలెక్కింది. తొలి టెస్ట్ రన్ నిర్వహించగా 180 కి.మీ వేగంతో ఈ రైలు ప్రయాణించింది. అయితే దేశంలోని ఏ ట్రాక్లూ ఆ వేగాన్ని తట్టుకునే స్థాయిలో లేకపోవడంతో ఈ రైళ్ల వేగాన్ని 130 కి.మీకు పరిమితం చేశారు.
తొలి కూత అక్కడే
‘ట్రైన్-18’కు వందే భారత్ ఎక్స్ప్రెస్(1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ - వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో 762 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ ఛైర్కార్ సీసీ క్లాస్ ధరను రూ.1,440గా నిర్దేశించారు. 2022 సెప్టెంబర్ 30న గాంధీనగర్ - ముంబయి వందేభారత్ 2.0 ట్రైన్ను ప్రారంభించారు.
తయారీ వేగానికి బ్రేకులు
2022 నాటికే 45 రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ కొవిడ్ కారణంగా అది నెరవేరలేదు. 2022 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ త్వరలో 400 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను తయారు చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) ప్రకటించారు. ఈ రైళ్ల కోసం కావాల్సిన 36 వేల చక్రాలను తయారు చేసేందుకు భారత్.. ఉక్రెయిన్కు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా వాటి రాక ఆలస్యమైంది.
దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన భారత్ చెక్ రిపబ్లిక్, పోలండ్, మలేసియా, చైనా, అమెరికా దేశాల్లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలోని స్టీల్ అథారిటీతో 1లక్ష చక్రాలు తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది. దుర్గాపూర్ స్టీల్ప్లాంట్ యూనిట్లో వాటి ఉత్పత్తి జరుగుతోంది.
చిన్న చిన్న ప్రమాదాలు
2019 ఫిబ్రవరిలో ఈ తొలి రైలు ప్రారంభమైన రెండో రోజే ఉత్తరప్రదేశ్లోని ఈఠవా వద్ద ఒక ఎద్దును ఢీకొంది. ఆ ప్రమాదం(accident)లో ఫైబర్, స్టీల్ కలగలిసి తయారైన రైలు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అదే సంవత్సరం ఆగస్టు 17న మరోసారి పశువులు ఈ రైలును ఢీకొన్నాయి. 2022 అక్టోబర్ 6న గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఓ పశువుల మందను ఢీకొంది. ఇటీవల బిహార్(bihar)లో ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు.
ఇక వందే భారత్ 2.0 విషయానికి వస్తే..
- వందేభారత్ రైలు బరువు 392 టన్నులు. తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతోంది.
- ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది.
- జీపీఐఎస్ బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది.
- ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు
- వైఫై సదుపాయం
- కవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్.
- బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్.
- అన్ని కోచ్లలో రిక్లైనబుల్ సీట్లు.
- వీటిలో 32 ఇంచుల టెలివిజన్ సదుపాయం.
- ఆటోమాటిక్ ప్లగ్ డోర్స్, టచ్ ఫ్రీ స్లయిడింగ్ డోర్స్.
- ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్.
- విశాలమైన డ్రైవర్ క్యాబిన్.
- హయ్యర్ ఫ్లడ్ ప్రొటెక్షన్
నిత్య నూతనం.. అధునాతనం..
త్వరలో ‘ట్రైన్ 20’ పేరుతో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మలుపుల వద్ద రైలు ఎంత వేగంగా వెళ్లినా ప్రమాదాలు జరగకుండా టిల్టింగ్ టెక్నాలజీ(tilting technology)ని జోడించనున్నారు. 1.0 వెర్షన్ ఫీచర్లతో తయారైన ఈ రైలులో సకల సదుపాయాలను, భద్రతా సౌకర్యాలను విస్తరిస్తూ 4.0 వెర్షన్కు చేర్చనున్నారు. వందేభారత్కు ఉన్న ఆదరణ దృష్ట్యా విదేశాలు ఈ రైళ్లను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులు చేస్తామని రైల్వే ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. ఈ రైళ్లను పరీక్షించడానికి జోధ్పూర్ డివిజన్లో 59 కిలోమీటర్ల ట్రాక్ను కూడా నిర్మిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య