Dreams-Sleep : కనులు మూస్తే కలలు.. రోజూ ఎందుకొస్తాయంటే..?
రోజూ మన ప్రమేయం లేకుండానే నిద్రలో అనేక కలలు వస్తుంటాయి. వాటి సృష్టి ఏ రకంగా జరుగుతుంది? ఎలా మనల్ని కలవరపెడతాయో తెలుసుకోండి.
మన నిద్రలో కలలు(dreams) ఒక భాగం. అవి మంచివి కావచ్చు.. చెడువి కావచ్చు. గుర్తు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కలలు మనల్ని ఆనందింపజేస్తుంటాయి. కొన్నిసార్లు భయపెడుతుంటాయి. సంతోషం, శృంగారం, కలవరపెట్టడం.. ఇలా రకరకాలుగా ఉంటాయి. ‘కలలో కూడా ఊహించలేం’ అనే డైలాగ్లాగే ఊహించనివన్నీ కలలుగా వస్తుంటాయి. అసలు కలలు ఎందుకు వస్తున్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, మానసిక వైద్యులకు అంతుచిక్కడం లేదు.
మనకు సాధ్యం కాని కోరికలు కలలో తీర్చుకోవడం జరుగుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. మెదడు, శరీరం నుంచి వచ్చిన సంకేతాల ద్వారా కూడా కలలు ఉద్భవిస్తాయట. రోజంతా జరిగిన వ్యవహారాలకు సంబంధం లేని అంశాలను జత చేస్తూ కలలు ఉంటాయి. భవిష్యత్లో జరగబోయే చెడును ఊహిస్తూ కూడా కలలు(dreams) కనడం జరుగుతుంది. కొన్నిసార్లు ఒకే కలలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల సంఘటనలు మిళితమవుతాయి.
కలల గురించి కొన్ని నిజాలు
- ప్రతి కల మనకు గుర్తులేకున్నా.. రాత్రి(night) పడుకున్న(sleep) తర్వాత 3 నుంచి 6 కలలు వస్తాయి.
- ఒక్కో కల 5 నుంచి 20 నిమిషాలు ఉంటుంది.
- నిద్రలేచే సరికి 95 శాతం కలలు మనం మర్చిపోతాం.
- కలలు కనడం వల్ల మన మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
- కంటి చూపు ఉన్న వారి కంటే అంధులకు(Blind people) కలలు ఎక్కువగా వస్తాయి. ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల వారికి కూడా కలలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
- మగవారి కంటే ఆడవారికి కలలు ఎక్కువగా వస్తాయి.
స్వప్నశాస్త్రం.. ఏం చెబుతోంది?
ఇక కలల గురించి చెప్పేందుకు ఓ శాస్త్రం కూడా ఉంది. దానినే స్వప్నశాస్త్రం అంటారు. దాని ప్రకారం.. కలలు మూడు రకాలు. అవి ‘చింతజములు’, ‘వ్యాధిజములు’, ‘యాదృచ్ఛికములు’. ఏ విషయం గురించైనా అదే పనిగా ఆలోచిస్తే అలాంటి కలలే వస్తాయి. వాటిని ‘చింతజములు’ అంటారు. మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు, వ్యాధుల బారినపడినప్పుడు కొన్ని కలలు వస్తుంటాయి. వాటిని ‘వ్యాధిజములు’ అంటారు. ఇక మనకు అసలు సంబంధం లేకుండా వచ్చేవి ‘యాదృచ్ఛికములు’. వీటిలో కొన్ని భవిష్యత్తును సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలు మనిషి శరీరంలోని చక్రాలపై ఆధారపడి ఉంటాయని యోగశాస్త్రం సూచిస్తోంది.
నిద్రలో రెండు దశలు.. కలలకు కారణం
నిద్రలో రెండు రకాల దశలు ఉంటాయి. ఒకటి ర్యాపిడ్ ఐ మూవ్మెంట్(ఆర్ఈఎం స్లీప్). రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్లో వచ్చిన కలలు ఎంతమాత్రం గుర్తుండవు. ఈ దశ తరువాత వచ్చే ఆర్ఈఎం స్లీప్(rapid eye movement)లో ఎక్కువగా కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం అసాధారణంగా ఉంటుంది. మూతపడిన కళ్లు వివిధ కోణాల్లో తిరుగుతూ ఉంటాయి. గుండె(Heart) కొట్టుకునే వేగం ఎక్కువ అవుతుంది. మగవారిలో అయితే శృంగార కాంక్షలు చెలరేగుతాయి. అప్పుడు నిద్రలో నుంచి ఉన్నఫలంగా మేల్కొంటే.. వచ్చిన కల నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఇలాంటి స్థితి మన రోజువారీ నిద్రలో 20 నుంచి 25 శాతం ఉంటుందట.
ఆర్ఈఎం స్లీప్ అంటే..
నిద్రపోయిన తరువాత దాదాపు 90 నిమిషాలకు ఇది మొదలవుతుంది. మూసిన రెప్పలోనే కనుగుడ్లు వేగంగా తిరుగుతూ ఉంటాయి. కానీ, మెదడుకు ఎలాంటి సంకేతాలు పంపించవు. ఇలాంటి స్థితి నిద్ర పోయిన తర్వాత తొలిసారి 10 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత మళ్లీ నాన్ ఆర్ఈఎం స్లీప్కు వెళ్లిపోతాం. ఆ తర్వాత మళ్లీ ఆర్ఈఎంలోకి వస్తాం. అప్పుడు స్థితి నిడివి పెరుగుతుంది. అలా దశలు మారే కొద్దీ ఆర్ఈఎం నిద్ర ఉండే సమయం పెరుగుతూ ఉంటుంది. ఆర్ఈఎం స్లీప్ కారణంగా మెదడులోని కొంత భాగం ఉత్తేజితమవుతుంది. ఆ చర్య కలలో వచ్చిన వాటిని గుర్తుంచుకోవడానికి, ప్రోటీన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువ సేపు ఆర్ఈఎం స్టేజీలో ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కల గుర్తు రావాలంటే ఏం చేయాలి
బాల్యంలో 10 ఏళ్లు దాటిన తరువాత ప్రతి ఒక్కరికి రాత్రి పూట 4 నుంచి 6 కలలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. అయితే అవి అందరికీ గుర్తుండవు. కల ముగిసిన 5 నిమిషాలకే 50 శాతం దాన్ని మరచిపోతామట. ఆ తరువాత 5 నిమిషాలు గడిస్తే 90 శాతం కల గుర్తుండదట. అయితే మిగతా పదిశాతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
- అలారం లేకుండా నిద్ర లేవాలి.
- ఆ వెంటనే ఎలాంటి కల వచ్చిందో దానిపై ఆలోచనల్ని కేంద్రీకరించాలి.
- గుర్తుకు వచ్చిన మేర దాన్ని పేపర్పై రాయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఎలాంటి కలలు వచ్చాయో సులభంగా తెలుసుకోవచ్చు.
తెలిసి కూడా కలగంటాం..
నిత్యం జీవితం మనకు నచ్చినట్లుగా ఉండక పోవచ్చు గానీ.. కొన్ని సార్లు కలలు మనకు నచ్చినట్లుగా ఉంటాయి. వాటినే లూసిడ్ డ్రీమ్స్(Lucid dreams) అంటారు. కలలో ఇష్టమైన వారితో సంభోగం జరపడం, వైరం ఉన్న వ్యక్తులపై దాడికి పాల్పడటం వంటివన్నీ.. ఇలాంటి కలల్లోనే సాధ్యపడతాయి. కలలో వచ్చే వ్యక్తులు కూడా విచిత్రంగా ఉంటారు. ఒక సర్వే ప్రకారం.. 48 శాతం కలల్లో తెలిసిన, పరిచయం ఉన్న వ్యక్తులే వస్తుంటారట. 35 శాతం కలల్లో సమాజంలోని వివిధ రకాల వృత్తులు చేసే వ్యక్తులు కనపడుతున్నారట. దొంగలు, పోలీసులు, వ్యాపారులు ఇలా. ఎప్పుడూ చూడని విచిత్రమైన మనుషులు, జంతువులు మిగతా శాతం కలల్లో కనపడుతుంటాయని తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్