Dreams-Sleep : కనులు మూస్తే కలలు.. రోజూ ఎందుకొస్తాయంటే..?
రోజూ మన ప్రమేయం లేకుండానే నిద్రలో అనేక కలలు వస్తుంటాయి. వాటి సృష్టి ఏ రకంగా జరుగుతుంది? ఎలా మనల్ని కలవరపెడతాయో తెలుసుకోండి.
మన నిద్రలో కలలు(dreams) ఒక భాగం. అవి మంచివి కావచ్చు.. చెడువి కావచ్చు. గుర్తు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కలలు మనల్ని ఆనందింపజేస్తుంటాయి. కొన్నిసార్లు భయపెడుతుంటాయి. సంతోషం, శృంగారం, కలవరపెట్టడం.. ఇలా రకరకాలుగా ఉంటాయి. ‘కలలో కూడా ఊహించలేం’ అనే డైలాగ్లాగే ఊహించనివన్నీ కలలుగా వస్తుంటాయి. అసలు కలలు ఎందుకు వస్తున్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, మానసిక వైద్యులకు అంతుచిక్కడం లేదు.
మనకు సాధ్యం కాని కోరికలు కలలో తీర్చుకోవడం జరుగుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. మెదడు, శరీరం నుంచి వచ్చిన సంకేతాల ద్వారా కూడా కలలు ఉద్భవిస్తాయట. రోజంతా జరిగిన వ్యవహారాలకు సంబంధం లేని అంశాలను జత చేస్తూ కలలు ఉంటాయి. భవిష్యత్లో జరగబోయే చెడును ఊహిస్తూ కూడా కలలు(dreams) కనడం జరుగుతుంది. కొన్నిసార్లు ఒకే కలలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల సంఘటనలు మిళితమవుతాయి.
కలల గురించి కొన్ని నిజాలు
- ప్రతి కల మనకు గుర్తులేకున్నా.. రాత్రి(night) పడుకున్న(sleep) తర్వాత 3 నుంచి 6 కలలు వస్తాయి.
- ఒక్కో కల 5 నుంచి 20 నిమిషాలు ఉంటుంది.
- నిద్రలేచే సరికి 95 శాతం కలలు మనం మర్చిపోతాం.
- కలలు కనడం వల్ల మన మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
- కంటి చూపు ఉన్న వారి కంటే అంధులకు(Blind people) కలలు ఎక్కువగా వస్తాయి. ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల వారికి కూడా కలలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
- మగవారి కంటే ఆడవారికి కలలు ఎక్కువగా వస్తాయి.
స్వప్నశాస్త్రం.. ఏం చెబుతోంది?
ఇక కలల గురించి చెప్పేందుకు ఓ శాస్త్రం కూడా ఉంది. దానినే స్వప్నశాస్త్రం అంటారు. దాని ప్రకారం.. కలలు మూడు రకాలు. అవి ‘చింతజములు’, ‘వ్యాధిజములు’, ‘యాదృచ్ఛికములు’. ఏ విషయం గురించైనా అదే పనిగా ఆలోచిస్తే అలాంటి కలలే వస్తాయి. వాటిని ‘చింతజములు’ అంటారు. మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు, వ్యాధుల బారినపడినప్పుడు కొన్ని కలలు వస్తుంటాయి. వాటిని ‘వ్యాధిజములు’ అంటారు. ఇక మనకు అసలు సంబంధం లేకుండా వచ్చేవి ‘యాదృచ్ఛికములు’. వీటిలో కొన్ని భవిష్యత్తును సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలు మనిషి శరీరంలోని చక్రాలపై ఆధారపడి ఉంటాయని యోగశాస్త్రం సూచిస్తోంది.
నిద్రలో రెండు దశలు.. కలలకు కారణం
నిద్రలో రెండు రకాల దశలు ఉంటాయి. ఒకటి ర్యాపిడ్ ఐ మూవ్మెంట్(ఆర్ఈఎం స్లీప్). రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్లో వచ్చిన కలలు ఎంతమాత్రం గుర్తుండవు. ఈ దశ తరువాత వచ్చే ఆర్ఈఎం స్లీప్(rapid eye movement)లో ఎక్కువగా కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం అసాధారణంగా ఉంటుంది. మూతపడిన కళ్లు వివిధ కోణాల్లో తిరుగుతూ ఉంటాయి. గుండె(Heart) కొట్టుకునే వేగం ఎక్కువ అవుతుంది. మగవారిలో అయితే శృంగార కాంక్షలు చెలరేగుతాయి. అప్పుడు నిద్రలో నుంచి ఉన్నఫలంగా మేల్కొంటే.. వచ్చిన కల నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఇలాంటి స్థితి మన రోజువారీ నిద్రలో 20 నుంచి 25 శాతం ఉంటుందట.
ఆర్ఈఎం స్లీప్ అంటే..
నిద్రపోయిన తరువాత దాదాపు 90 నిమిషాలకు ఇది మొదలవుతుంది. మూసిన రెప్పలోనే కనుగుడ్లు వేగంగా తిరుగుతూ ఉంటాయి. కానీ, మెదడుకు ఎలాంటి సంకేతాలు పంపించవు. ఇలాంటి స్థితి నిద్ర పోయిన తర్వాత తొలిసారి 10 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత మళ్లీ నాన్ ఆర్ఈఎం స్లీప్కు వెళ్లిపోతాం. ఆ తర్వాత మళ్లీ ఆర్ఈఎంలోకి వస్తాం. అప్పుడు స్థితి నిడివి పెరుగుతుంది. అలా దశలు మారే కొద్దీ ఆర్ఈఎం నిద్ర ఉండే సమయం పెరుగుతూ ఉంటుంది. ఆర్ఈఎం స్లీప్ కారణంగా మెదడులోని కొంత భాగం ఉత్తేజితమవుతుంది. ఆ చర్య కలలో వచ్చిన వాటిని గుర్తుంచుకోవడానికి, ప్రోటీన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువ సేపు ఆర్ఈఎం స్టేజీలో ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కల గుర్తు రావాలంటే ఏం చేయాలి
బాల్యంలో 10 ఏళ్లు దాటిన తరువాత ప్రతి ఒక్కరికి రాత్రి పూట 4 నుంచి 6 కలలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. అయితే అవి అందరికీ గుర్తుండవు. కల ముగిసిన 5 నిమిషాలకే 50 శాతం దాన్ని మరచిపోతామట. ఆ తరువాత 5 నిమిషాలు గడిస్తే 90 శాతం కల గుర్తుండదట. అయితే మిగతా పదిశాతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
- అలారం లేకుండా నిద్ర లేవాలి.
- ఆ వెంటనే ఎలాంటి కల వచ్చిందో దానిపై ఆలోచనల్ని కేంద్రీకరించాలి.
- గుర్తుకు వచ్చిన మేర దాన్ని పేపర్పై రాయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఎలాంటి కలలు వచ్చాయో సులభంగా తెలుసుకోవచ్చు.
తెలిసి కూడా కలగంటాం..
నిత్యం జీవితం మనకు నచ్చినట్లుగా ఉండక పోవచ్చు గానీ.. కొన్ని సార్లు కలలు మనకు నచ్చినట్లుగా ఉంటాయి. వాటినే లూసిడ్ డ్రీమ్స్(Lucid dreams) అంటారు. కలలో ఇష్టమైన వారితో సంభోగం జరపడం, వైరం ఉన్న వ్యక్తులపై దాడికి పాల్పడటం వంటివన్నీ.. ఇలాంటి కలల్లోనే సాధ్యపడతాయి. కలలో వచ్చే వ్యక్తులు కూడా విచిత్రంగా ఉంటారు. ఒక సర్వే ప్రకారం.. 48 శాతం కలల్లో తెలిసిన, పరిచయం ఉన్న వ్యక్తులే వస్తుంటారట. 35 శాతం కలల్లో సమాజంలోని వివిధ రకాల వృత్తులు చేసే వ్యక్తులు కనపడుతున్నారట. దొంగలు, పోలీసులు, వ్యాపారులు ఇలా. ఎప్పుడూ చూడని విచిత్రమైన మనుషులు, జంతువులు మిగతా శాతం కలల్లో కనపడుతుంటాయని తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.