Kongunadu Issue: కొంగునాడు అంటే.. జోరుగా సాగుతున్న చర్చలు..
తమిళనాడులో పశ్చిమప్రాంతాలు అంటే పశ్చిమకనుమలను ఆనుకొని ఉన్న ప్రాంతాలను కొంగునాడు అని పిలుస్తారు. వాస్తవానికి దక్షిణాదిలో అనేకప్రాంతాల్లో నాడు అనేది వ్యవహారికం.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం : తమిళనాడులో పశ్చిమప్రాంతాలు అంటే పశ్చిమకనుమలను ఆనుకొని ఉన్న ప్రాంతాలను కొంగునాడు అని పిలుస్తారు. వాస్తవానికి దక్షిణాదిలో అనేకప్రాంతాల్లో నాడు అనేది వ్యవహారికం. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని నాడుగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పల్నాడు, రేనాడు, పాకనాడు అనే పేర్లతో ప్రాంతాలున్నాయి. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే తమిళనాడుకు చెందిన భాజపా నేత, రాజ్యసభ సభ్యుడు మురుగన్కు కేంద్రమంత్రివర్గంలో చోటు లభించింది. మురుగన్ తమిళనాడులోని కొంగునాడు ప్రాంతానికి చెందినవారుగా భాజపా పేర్కొనడంతో వివాదం ఏర్పడింది. తమిళనాడులోని పశ్చిమప్రాంతాలైన నీల్గిరీస్, కొయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, కరూర్, నమక్కల్. సేలం..తదితర జిల్లాలు కొంగునాడు అని పేర్కొంటారు.
పారిశ్రామికంగా అభివృద్ధి.,
ఈ జిల్లాల్లో నమక్కల్, సేలం, తిరుప్పూర్, కొయంబత్తూర్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. అన్నాడీఎంకేకు ఈ ప్రాంతంలో బాగా పట్టుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ద్వారా భాజపా నాలుగు స్థానాల్లో గెలుపొందింది. వీటిలో రెండు కొంగునాడులో ఉన్నాయి. అయితే రాష్ట్రానికి వచ్చే ఆదాయం దాదాపు సగభాగం ఈ ప్రాంతంనుంచే వస్తున్నా అభివృద్ధి లేదని కొందరి వాదన. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని ఎవరూ ఉద్యమాలు చేయలేదు. అయినా ద్రవిడ పార్టీలను దెబ్బతీసేందుకు భాజపా వ్యూహమని మరి కొందరు పేర్కొంటున్నారు.
డీఎంకేను నిలువరించేందుకు..
క్షేత్రస్థాయిలో భాజపాకు రాష్ట్రంలో పెద్ద బలంలేదు. డీఎంకే కేంద్రప్రభుత్వాన్ని ఒండ్రియ అరసు అని పిలుస్తోంది. అంటే యూనియన్ గవర్న్మెంట్ అని. వాస్తవానికి మదియ అరసు అని పిలవాలి. ఇలాంటి డీఎంకే దూకుడును అడ్డుకునేందుకు భాజపా ఇలాంటి వ్యూహాన్ని ఎన్నుకుందని కొందరు రాజకీయ పరిశీలకులు వెల్లడించారు.
జోరుగా చర్చలు..
తమిళనాడు రాష్ట్రంలో సుదీర్ఘకాలం అనంతరం కొంగునాడు అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కొంగు అంటే అమృతం లేదా తేనె అని తమిళ మేథావులు చెబుతున్నారు.ఈ ప్రాంతంలో తేనె ఎక్కువగా లభిస్తుంది. దీంతో అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. తమిళనాడును ఎవరూ విడదీయలేరు అని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చలో ఉందని నిజానికి ఈ ప్రాంత ప్రజల్లో ఎలాంటి వేర్పాటువాదం లేదని రాష్ట్ర భాజపా సీనియర్ నేతలు ప్రకటించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్, ఏఎంఎంకే .. తదితర పక్షాలు మాత్రం కొంగునాడు వాదాన్ని సమర్థించకూడదని నిర్ణయించాయి. ఈ చర్చను మొదలుపెట్టంది భాజపా కాబట్టి వారే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
-
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
-
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM