Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి.
మాల్దీవులు (Maldives).. హిందూ మహా సముద్రంలోని చిన్న దేశం. భారత్ (India), శ్రీలంకకు (Sri lanka) అత్యంత సమీపంలోని ఈ దేశ అందాలను తిలకించడానికి అన్ని కాలాల్లోనూ పర్యాటకులు పోటెత్తుతుంటారు. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..! అందుకే.. ఇటీవలి కాలంలో మన పాన్ ఇండియా తారలు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో (Instagram) పోస్ట్ చేస్తున్నారు. అంత మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లను ఆకర్షిస్తున్న ఆ దేశ విశేషాలేంటో తెలుసుకోండి.
- మాల్దీవులు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇక్కడి పగడపు దిబ్బలు. ఈ దేశంలో 26 పగడపు అటోల్స్, 1200 దీవులున్నాయి.
- ఈ దేశ రాజధాని మాలే. ఇదే అతి పెద్ద నగరం కాబట్టి ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. రంగురంగుల భవనాలు, రద్దీ మార్కెట్లు, చారిత్రక మసీదులను పర్యాటకులు ఇక్కడ చూడొచ్చు.
- సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల వాతావరణ మార్పుల ప్రభావం ఈ దేశంపై అధికంగా ఉంటుంది. పెరుగుతున్న సముద్ర నీటి మట్టం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ కొన్ని దీవులు కనిపించకపోవచ్చు.
- ఇక్కడి ఏకాంత ద్వీపాల్లో చాలా రిసార్టులున్నాయి. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం, సెలబ్రిటీలు, ట్రావెలర్స్ క్యూ కడుతుంటారు.
- మాల్దీవుల్లో అధికారిక భాష ‘ధివేహి’. ఇది పొరుగునున్న శ్రీలంక భాష సింహళకు కాస్త దగ్గరగా ఉంటుంది. పర్యాటకుల రాక వల్ల ఇంగ్లిష్ మాట్లాడే స్థానికుల సంఖ్య కూడా పెరిగింది.
- మాల్దీవుల జనాభా దాదాపు 5.6 లక్షలు. భారత్, శ్రీలంక, అరబ్ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను స్థానికులు అనుసరిస్తుంటారు.
- సముద్ర జీవ వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతంలో దాదాపు 2వేల రకాల చేపలు, 200 జాతుల పగడపు దీవులను చూడొచ్చు. మెరైన్ జీవ శాస్త్రవేత్తలు, డైవర్స్, సర్ఫర్లు అందుకే ఎక్కువగా ఈ దేశం వెళ్తుంటారు.
- ప్రపంచంలోనే మొట్టమొదటి సారి నీటి అడుగున నిర్మించిన హోటల్ ‘కాన్రాడ్ మాల్దీవ్స్ రంగాలీ ఐలాండ్’ ఈ దేశంలోనే ఉంది. . 16 అడుగుల లోతులో, రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ హోటల్లో బస చేసి అతిథులు కడలి అందాలను చూసి మైమరచిపోవచ్చు.
- మాల్దీవుల సంప్రదాయ వంటకాలను చేపలు, కొబ్బరి, బియ్యం, పండ్లను వినియోగించి తయారు చేస్తారు. ‘మాస్ హుని’, ‘గరుధియా’, ‘హెధికా’ ప్రఖ్యాత రుచులు.
- పర్యాటక దేశం కదా అని బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్ తాగేందుకు అనుమతిస్తారనుకుంటే పొరపడినట్లే. రిసార్టులు, పర్యాటక సంస్థలు మాత్రమే ఇక్కడ మద్యం సరఫరా చేస్తాయి.
- ఈ చిన్న దేశంలో అక్షరాస్యత 98 శాతంగా ఉంది. దాన్ని బట్టి పాలకులు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
- మన ఇండియాలో క్రికెటర్ ధోనీ ఎంత ఫేమస్సో.. మాల్దీవుల్లో ‘ధోనీస్’ అంత ఫేమస్. ‘ధోనీస్’ అంటే సంప్రదాయ పడవ. చేపల వేట, ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి పర్యాటకుల రాకపోకలు వీటిలోనే సాగుతాయి.
- ప్రత్యేక సందర్భాల్లో ఈ దేశ స్త్రీ, పురుషులు ‘ధివేహి లిబ్బాస్’ వస్త్రాలను ధరిస్తారు. అవి పైజామా, లుంగీ ఆకారంలో ఉంటాయి.
- ఈ దేశంలోని ‘బోడు బెరు’ పేరుతో డ్రమ్స్ వాయిస్తూ, నృత్యం చేస్తూ, పాటలు పాడుతారు.
- ఇక్కడి ప్రజలు పడవలు నిర్మించడంలో నేర్పరులు. అనేక తరాలుగా వారు ‘ధోనీస్’ తరహాలో విభిన్న రకాల పడవలను తయారు చేశారు.
- ఈ దీవుల్లో నీటి అడుగున గుహలున్నాయి. రంగురంగుల చేపలను చూస్తూ వాటిలో ఈత కొడితే డైవర్లు తమ జీవితంలో ఆ అనుభూతిని మర్చిపోలేరు.
- మాల్దీవుల కరెన్సీ ‘రూఫియా’. అమెరికన్ డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీతో కూడా ఇక్కడ లావాదేవీలు జరుగుతుంటాయి.
- ఈ ప్రాంతంలోని రైతులు సముద్రంలోని పాచిని సాగు చేస్తారు. దాన్ని ఆహారంగానూ తీసుకుంటారు. అందులో విటమిట్ ఎ, సి, ఈ పుష్కలంగా ఉంటాయట.
- మాల్దీవుల్లో దొరికే కొబ్బరి బొండాన్ని ‘కురుంబ’ అని పిలుస్తారు. ఎక్కడికెళ్లినా ఇవి దొరుకుతాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM