Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి.
మాల్దీవులు (Maldives).. హిందూ మహా సముద్రంలోని చిన్న దేశం. భారత్ (India), శ్రీలంకకు (Sri lanka) అత్యంత సమీపంలోని ఈ దేశ అందాలను తిలకించడానికి అన్ని కాలాల్లోనూ పర్యాటకులు పోటెత్తుతుంటారు. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..! అందుకే.. ఇటీవలి కాలంలో మన పాన్ ఇండియా తారలు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో (Instagram) పోస్ట్ చేస్తున్నారు. అంత మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లను ఆకర్షిస్తున్న ఆ దేశ విశేషాలేంటో తెలుసుకోండి.
- మాల్దీవులు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇక్కడి పగడపు దిబ్బలు. ఈ దేశంలో 26 పగడపు అటోల్స్, 1200 దీవులున్నాయి.
- ఈ దేశ రాజధాని మాలే. ఇదే అతి పెద్ద నగరం కాబట్టి ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. రంగురంగుల భవనాలు, రద్దీ మార్కెట్లు, చారిత్రక మసీదులను పర్యాటకులు ఇక్కడ చూడొచ్చు.
- సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల వాతావరణ మార్పుల ప్రభావం ఈ దేశంపై అధికంగా ఉంటుంది. పెరుగుతున్న సముద్ర నీటి మట్టం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ కొన్ని దీవులు కనిపించకపోవచ్చు.
- ఇక్కడి ఏకాంత ద్వీపాల్లో చాలా రిసార్టులున్నాయి. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం, సెలబ్రిటీలు, ట్రావెలర్స్ క్యూ కడుతుంటారు.
- మాల్దీవుల్లో అధికారిక భాష ‘ధివేహి’. ఇది పొరుగునున్న శ్రీలంక భాష సింహళకు కాస్త దగ్గరగా ఉంటుంది. పర్యాటకుల రాక వల్ల ఇంగ్లిష్ మాట్లాడే స్థానికుల సంఖ్య కూడా పెరిగింది.
- మాల్దీవుల జనాభా దాదాపు 5.6 లక్షలు. భారత్, శ్రీలంక, అరబ్ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను స్థానికులు అనుసరిస్తుంటారు.
- సముద్ర జీవ వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతంలో దాదాపు 2వేల రకాల చేపలు, 200 జాతుల పగడపు దీవులను చూడొచ్చు. మెరైన్ జీవ శాస్త్రవేత్తలు, డైవర్స్, సర్ఫర్లు అందుకే ఎక్కువగా ఈ దేశం వెళ్తుంటారు.
- ప్రపంచంలోనే మొట్టమొదటి సారి నీటి అడుగున నిర్మించిన హోటల్ ‘కాన్రాడ్ మాల్దీవ్స్ రంగాలీ ఐలాండ్’ ఈ దేశంలోనే ఉంది. . 16 అడుగుల లోతులో, రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ హోటల్లో బస చేసి అతిథులు కడలి అందాలను చూసి మైమరచిపోవచ్చు.
- మాల్దీవుల సంప్రదాయ వంటకాలను చేపలు, కొబ్బరి, బియ్యం, పండ్లను వినియోగించి తయారు చేస్తారు. ‘మాస్ హుని’, ‘గరుధియా’, ‘హెధికా’ ప్రఖ్యాత రుచులు.
- పర్యాటక దేశం కదా అని బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్ తాగేందుకు అనుమతిస్తారనుకుంటే పొరపడినట్లే. రిసార్టులు, పర్యాటక సంస్థలు మాత్రమే ఇక్కడ మద్యం సరఫరా చేస్తాయి.
- ఈ చిన్న దేశంలో అక్షరాస్యత 98 శాతంగా ఉంది. దాన్ని బట్టి పాలకులు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
- మన ఇండియాలో క్రికెటర్ ధోనీ ఎంత ఫేమస్సో.. మాల్దీవుల్లో ‘ధోనీస్’ అంత ఫేమస్. ‘ధోనీస్’ అంటే సంప్రదాయ పడవ. చేపల వేట, ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి పర్యాటకుల రాకపోకలు వీటిలోనే సాగుతాయి.
- ప్రత్యేక సందర్భాల్లో ఈ దేశ స్త్రీ, పురుషులు ‘ధివేహి లిబ్బాస్’ వస్త్రాలను ధరిస్తారు. అవి పైజామా, లుంగీ ఆకారంలో ఉంటాయి.
- ఈ దేశంలోని ‘బోడు బెరు’ పేరుతో డ్రమ్స్ వాయిస్తూ, నృత్యం చేస్తూ, పాటలు పాడుతారు.
- ఇక్కడి ప్రజలు పడవలు నిర్మించడంలో నేర్పరులు. అనేక తరాలుగా వారు ‘ధోనీస్’ తరహాలో విభిన్న రకాల పడవలను తయారు చేశారు.
- ఈ దీవుల్లో నీటి అడుగున గుహలున్నాయి. రంగురంగుల చేపలను చూస్తూ వాటిలో ఈత కొడితే డైవర్లు తమ జీవితంలో ఆ అనుభూతిని మర్చిపోలేరు.
- మాల్దీవుల కరెన్సీ ‘రూఫియా’. అమెరికన్ డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీతో కూడా ఇక్కడ లావాదేవీలు జరుగుతుంటాయి.
- ఈ ప్రాంతంలోని రైతులు సముద్రంలోని పాచిని సాగు చేస్తారు. దాన్ని ఆహారంగానూ తీసుకుంటారు. అందులో విటమిట్ ఎ, సి, ఈ పుష్కలంగా ఉంటాయట.
- మాల్దీవుల్లో దొరికే కొబ్బరి బొండాన్ని ‘కురుంబ’ అని పిలుస్తారు. ఎక్కడికెళ్లినా ఇవి దొరుకుతాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్