Bhindranwale: సాఫ్ట్గానే ఉండేవాడు.. మరీ అంత ఉగ్రంగా ఎలా మారాడు?
పంజాబ్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలను గుర్తు చేస్తున్నాయి. భింద్రన్వాలే నేతృత్వంలో వేర్పాటువాదులు అనేక సవాళ్లు విసిరారు.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: 80ల్లో పంజాబ్.. అంతా భయంభయంగా ఉండేది.. ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు.. తుపాకుల బుల్లెట్లు ఎక్కడ నుంచి వస్తాయో అంతుబట్టదు.. లా అండ్ ఆర్డర్ ఉండేది కాదు.. మోటార్ సైకిళ్లపై యువత ఆయుధాలు చేతబట్టి విచ్చలవిడిగా తిరిగేవారు.. ఖలిస్థాన్ మద్దతుదారులు బాహటంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు.. వీరి ధైర్యానికి కారణం ఒక్కరే కావడం గమనార్హం... ఆయనే జర్నైల్ సింగ్ భింద్రన్వాలే (Jarnail Singh Bhindranwale). తొలినాళ్లలో సాఫ్ట్గా ఉన్న భింద్రన్ కరడుగట్టిన వేర్పాటువాదిగా మారడం గమనార్హం.
ఆధ్యాత్మిక సంస్థ నుంచి అడుగులు
1947లో మోగా జిల్లాలో ఆయన జన్మించారు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆరో తరగతిలోనే చదువు ముగించి పొలంబాట పట్టాడు. అనంతరం కొన్నాళ్లకు ఆధ్యాత్మిక విద్యాసంస్థలో చేర్పించారు. తరువాత మత పెద్దగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పర్యటించారు. అప్పట్లో పంజాబ్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండేది. దీంతో ఎక్కువమంది ఆయన ప్రసంగాలకు ప్రభావితమయ్యేవారు.
కాంగ్రెస్ అండతో..
రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీలు మాత్రమే ప్రధాన పక్షాలుగా ఉండేవి. అకాలీదళ్ పార్టీని నివారించేందుకు కాంగ్రెస్ భింద్రన్ను ప్రోత్సాహించింది. అందివచ్చిన అవకాశాలను అందుకొని తిరుగులేని నేతగా ఎదిగాడు. అయితే, తొలినాళ్లలో ఖలిస్థాన్ ఉద్యమానికి దన్నుగా నిలవలేదు. ఆనందపుర్ సాహిబ్ తీర్మానాన్ని అమలు చేయాలని మాత్రమే కోరేవాడు. పంజాబ్కు సంబంధించి పలు డిమాండ్లు ఈ తీర్మానంలో ఉన్నాయి.
అమృత్సర్ కేంద్రంగా..
ఈ క్రమంలో ఆయన అనుచరులకు మాజీ సైనికాధికారులైన సాహెబ్సింగ్ ... తదితరులు ఆయుధాల శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ నిఘా పెరగడంతో ఆయుధాలతో పాటు భింద్రన్వాలే స్వర్ణదేవాలయానికి చేరుకున్నాడు. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఖలిస్థాన్ డిమాండ్ ఉన్నా అకాలీనేత మాస్టర్ తారాసింగ్, ఇతర సంస్థనాధీశులైన సర్దార్ బల్దేవ్సింగ్, రాజా హరిందర్ సింగ్, సర్దార్ హుకుంసింగ్లు భారత్ వైపే మొగ్గు చూపారు.
ఆపరేషన్ బ్లూస్టార్తో హతం
అమృత్సర్ స్వర్ణదేవాలయంలో వేర్పాటువాదులతో మకాం వేసిన భింద్రన్వాలేను జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సారథ్యంలోని ప్రభుత్వం కోరింది. అయితే, ఈ వినతిని భింద్రన్ పట్టించుకోలేదు. చివరకు 1984 జూన్లో ఆపరేషన్ బ్లూస్టార్తో సైనికచర్య ప్రారంభించింది. ఏడు రోజుల పాటు సాగిన పోరులో భింద్రన్వాలే చనిపోవడంతో పోరు ముగిసింది. తరువాత కొద్ది కాలానికే ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులు కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్తో పాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లింది. ఐపీఎస్ అధికారి గిల్ కఠిన చర్యలు తీసుకోవడంతో ఉగ్రవాదం రూపుమాసింది. అయితే స్వతంత్ర్య భారత చరిత్రలో ఈ వేర్పాటువాద ఘటనలు ఎందరో అమాయకుల ప్రాణాలను తీసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ