LTTE ప్రభాకరన్: ఎవరితను..? ఎందుకంత క్రూరంగా మారాడు..?
శ్రీలంకలో (Sri Lanka) తమిళుల హక్కుల కోసం ఎల్టీటీఈని స్థాపించిన ప్రభాకరన్ (LTTE Prabhakaran).. దేశాధినేతలనూ హతమార్చాడు. మూడున్నర దశాబ్దాల పాటు శ్రీలంకకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆయనను అక్కడి సైన్యం 2009లో మట్టుబెట్టింది. అయితే, ఆయన బతికే ఉన్నాడంటూ ఓ తమిళ నాయకుడు తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: వేలుపిళ్లై ప్రభాకరన్.. ఎల్టీటీఈ ప్రభాకరన్గా (LTTE Prabhakaran) గుర్తింపు పొందిన ఆయన పేరు నేటితరం వారికి అంతంత మాత్రంగానే తెలిసి ఉండొచ్చు. కానీ, సుమారు మూడున్నర దశాబ్దాలపాటు శ్రీలంకకు (Sri Lanka) కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి ఆయన. ఆ దేశంలోని తమిళ (Tamil) ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టినట్లు చెప్పుకొనే ప్రభాకరన్.. సాయుధ పోరాటం ద్వారానే తన జాతికి న్యాయం చేయొచ్చని భావించాడు. ఈ క్రమంలో ఎంతోమంది నేతలను, ప్రముఖులను దారుణంగా చంపి అంతర్జాతీయ సమాజం దృష్టిలో ‘రక్తం మరిగిన పులిగా’ మారాడు. అయితే, ఆయన్ను మట్టుబెట్టినట్లు 2009లోనే శ్రీలంక ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ప్రభాకరన్ (Prabhakaran) ఇంకా బతికే ఉన్నాడంటూ తమిళ జాతీయోద్యమ నేత ఒకరు తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమయ్యింది.
విద్యార్థి దశనుంచే..
శ్రీలంక జాఫ్నా ద్వీపకల్పంలోని వెల్వెట్టిథురైలో 1954 నవంబర్ 26న ప్రభాకరన్ జన్మించాడు. తండ్రి ఓ ప్రభుత్వాధికారి. నలుగురు సంతానంలో అందరికన్నా చిన్నవాడు. స్థానిక రాజకీయాలు, విద్య, ఉపాధిలో తమిళుల పట్ల శ్రీలంక ప్రభుత్వం చూపే వివక్ష పట్ల కలత చెందిన ప్రభాకరన్.. పాఠశాల చదువును వదిలిపెట్టి రాజకీయ సమావేశాల్లో పాల్గొనేవాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. నెపోలియన్, అలెగ్జాండర్లంటే ఎంతో ఇష్టమని.. చేగువేరా, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్లు స్ఫూర్తి అని చెప్పుకునేవాడు.
తమిళుల హక్కుల కోసం ఎల్టీటీఈ..
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళ్ న్యూటైగర్స్(TNT) పేరుతో 1972లో ఓ సంస్థను ప్రారంభించాడు. ముఖ్యంగా తమిళులు అధికంగా ఉండే శ్రీలంక ఈశాన్య రాష్ట్రం నుంచి వేర్పాటువాద ఉద్యమం సాగించాడు. 1975లో జాఫ్నా మేయర్ ఆల్ఫ్రెడ్ దురైయప్పను అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. ఇదే ఆయన మొట్టమొదటి రాజకీయ హత్య. 1976లో టీఎన్టీ పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(LTTE)గా మార్చాడు. సంస్థకు తనే నేతృత్వం వహించి.. ప్రత్యర్థుల్ని నిర్ధాక్షిణ్యంగా హత్య చేయడం మొదలుపెట్టాడు. ఆయన నాయకత్వంలో ఎల్టీటీఈ.. గెరిల్లా దళంగా ఎదిగింది. మూడున్నర దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో మొత్తం 70వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఆత్మాహుతి దాడులే ఆయుధంగా..
అణచివేతకు గురైన తమిళులకు స్వేచ్ఛ పేరిట ఉత్తర శ్రీలంకలోని వన్నీ అటవీ ప్రాంతం నుంచి ఎల్టీటీఈ సాయుధ పోరాటం కొనసాగించింది. ప్రపంచంలో తీవ్రవాద సంస్థల్లో త్రివిధ దళాలున్నది ఒక్క ఎల్టీటీఈకే. టైగర్లు, సముద్ర టైగర్లు, ఎయిర్ టైగర్ల పేరుతో మూడు రకాల బలగాలను నడిపించేది. బ్లాక్ టైగర్ల పేరుతో ఆత్మాహుతి దళం కూడా ఉండేది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉండేవారు. శత్రువు చేతికి చిక్కితే వెంటనే ఆత్మహత్య చేసుకోవడం కోసం ప్రభాకరన్ ఎల్లప్పుడూ సైనైడ్ గుళికను తన మెడలో వేలాడదీసుకునేవాడు. దీన్నే దళం సభ్యులు కూడా అనుసరించారు.
రాజీవ్ గాంధీ హత్యతోపాటు..
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991 మే 21న చెన్నైకి సమీపంలోని శ్రీ పెరంబుదూరు వద్ద ఎల్టీటీఈ బృందం మానవ బాంబు ప్రయోగించి హతమార్చింది. 1987లో తమపై బలవంతంగా శాంతి ఒప్పందాన్ని రుద్దారని.. తమ దళంపై దాడి చేయడానికి భారత శాంతి పరిరక్షక బలగాల్ని(ఐపీకేఎఫ్) రాజీవ్ గాంధీ వినియోగించాడన్న కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. 1991లో శ్రీలంక మంత్రి రంజన్ విజేరత్నే, 1993లో శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస, 2005లో శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కదిర్గమర్తో సహా ఎంతో మంది ప్రత్యర్థులు, ఉదారవాద తమిళనేతలు ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురయ్యారు. ఇలా ‘రక్తం మరిగిన పులి’గా మారిన ప్రభాకరన్ను 1991లో ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అదే ఏడాది రాజీవ్ గాంధీ హత్యకుగానూ మద్రాసు హైకోర్టు మరణదండన విధించింది. 1996లో కొలంబోలో ఓ సెంట్రల్ బ్యాంకు పేల్చివేతకుగాను అక్కడి కోర్టులో 200 ఏళ్ల శిక్ష పడింది.
అందుకే సాయుధ పోరాటం..
శ్రీలంకలోని తమిళ ప్రజల దీనస్థితి తనను ఆయుధం పట్టేలా చేసిందని చెప్పేవాడు ప్రభాకరన్. ఓ పథకం ప్రకారమే తమపై నరమేధం సాగుతోందని అనేవాడు. తమ జాతిని సమూలంగా నాశనం చేసేందుకు జరుగుతోన్న ఈ నిరంకుశ రాజ్యం నుంచి ప్రజలను రక్షించేందుకే సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నట్లు మరణించడానికి ముందు ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, ప్రత్యేక తమిళ ఈలం కోసం 35ఏళ్ల పాటు రక్తపుటేర్లు పారించిన ప్రభాకరన్.. చివరకు 2009లో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. దీంతో ప్రపంచంలోనే సుదీర్ఘకాలం పాటు సాగిన వేర్పాటువాద ఉద్యమం అంతమైనట్లయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు