Phone apps : యాప్లు మొరాయిస్తున్నాయా.. ఇలా చేసి చూడండి!
ఆండ్రాయిడ్ ఫోన్లలో (Android phone) కొన్ని యాప్లు (apps) సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ సమస్యను సొంతంగా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి.
సాంకేతిక పరిజ్ఞానం (Technology) పెరిగే కొద్దీ వేలాది యాప్లు (apps)ప్లే స్టోర్లలో (Play store) ప్రత్యక్షమవుతున్నాయి. విద్య, ఆరోగ్యం, వార్తలు, వినోదం ఇలా ప్రతి అంశానికి సంబంధించిన యాప్ల వాడకంతో ఫోన్లు నిండిపోతున్నాయి. అయితే అందులో కొన్ని ఉన్నట్టుండి మొరాయిస్తుంటాయి. లాగిన్ (Login) కాకపోవడం, మధ్యలోనే క్విట్ కావడం, చెక్ యువర్ ఇంటర్నెట్ (Internet) కనెక్షన్ వంటి సందేశాలు చూపిస్తూ సతాయిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలుసుకోండి.
యాప్లు ఎందుకు పని చేయవు?
మొబైల్ యాప్లు పని చేయకపోవడానికి అనేక కారణాలుంటాయి. సమయానుకూలంగా అప్డేట్ చేయకపోవడం సమస్యకు ఓ ప్రధాన కారణం. కొత్త ఫీచర్లు తెచ్చిన సందర్భంలో యాప్ డెవలపర్లు అప్డేట్ ఇస్తుంటారు. యూజర్లు గుర్తించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి, భద్రతా ప్రమాణాలు మెరుగు పరచడానికి సైతం అప్డేట్స్ తప్పనిసరి. అలా చేసిన సందర్భంలో పాత వెర్షన్ యాప్లు ఫోన్లో సరిగా పనిచేయవు.
మరిన్ని కారణాలు ఏమిటంటే..!
- సరైన సమయంలో అప్డేట్ చేయకపోవడం
- ఫోన్లో స్టోరేజీ తక్కువగా ఉండటం.
- కరప్టడ్ క్యాచీ, యాప్ డేటా
- యాప్లోని బగ్స్, గ్లిచెస్
- తాత్కాలిక ఎర్రర్స్
- అవుట్డేటెడ్ యాప్ లేదా ఫోన్ సాఫ్ట్వేర్
ఎలా సరిదిద్దుకోవాలి
యాప్ పని చేయలేదని తెలియగానే చిరాకు పడి కొంతమంది ప్లేస్టోర్లో రివ్యూలు రాసేస్తుంటారు. అంతకుముందే ఈ టిప్స్ ఒక్కొక్కటిగా ప్రయత్నించి చూస్తే ఉపయోగం ఉంటుంది.
1. ఫోన్ రీబూట్
ఏ సాంకేతిక పరికరం పని చేయకపోయినా అందరూ చేసే మొదటి పని రీబూట్. ఫోన్ యాప్ పని చేయని పక్షంలోనూ ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. పవర్ బటన్ను కొన్ని సెకన్లపాటు నొక్కితే ఆఫ్ ఆప్షన్తోపాటు రీబూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే ఫోన్ ఆఫ్ అయ్యి ఓ 20 సెక్లన్లలోపు మళ్లీ ఆన్ అవుతుంది. ఈ సమయంలో మొబైల్ తనకు తానుగా కొన్ని ప్రాథమిక రిపేర్లు చేసుకుంటుంది. అందులో యాప్ల తాలుకా సమస్య ఉన్నా పరిష్కారమవుతుంది.
2. యాప్ అప్ డేట్
బ్యాంకులకు సంబంధించిన యాప్లు భద్రతా కారణాల రీత్యా తరచూ అప్ డేట్ చేస్తుంటారు. ఇలాంటి వాటిని మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్లేస్టోర్లోకి వెళ్లి ఆ యాప్ పేరుతో సెర్చ్ చేస్తే యాప్ సమాచారం ప్రత్యక్షమవుతుంది. ‘అప్డేట్’ ఆప్షన్ చూపిస్తుంటే దానిపై క్లిక్ చేయాలి. అన్ని యాప్లు అప్డేట్ కావాలంటే ‘అప్డేట్ ఆల్’పై క్లిక్ చేయాలి. అయితే ఆ పని చేసే ముందు సరిపడే డేటా మీ వద్ద ఉందో లేదో చెక్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
3. ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ యాప్
2021 మార్చిలో గూగుల్, ఇతర యాప్లు పనిచేయడం లేదని చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఫిర్యాదు చేశారు. సమస్య ఏంటని ఆరా తీస్తే క్రోమ్, ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ యాప్లోని అప్డేట్ కారణమని తేలింది. యాప్లు సరిగా పని చేయని సందర్భంలో ‘ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ’ యాప్ను చెక్ చేయాలి. ప్లే స్టోర్లోకి వెళ్లి ఈ పేరుతో సెర్చ్ చేస్తే ఆ యాప్ కనిపిస్తుంది. అక్కడ ‘అప్డేట్’ ఆప్షన్ కనిపిస్తే దానిపై నొక్కి తాజా వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం మరోసారి ఫోన్ రీస్టార్ట్ చేసి చూడాలి. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన యాప్ పనిచేయనట్లయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ యాప్ను రోల్ బ్యాక్ చేయాలి.
ఈ యాప్ను రోల్ బ్యాక్ చేసేందుకు ‘సెట్టింగ్స్’లోని ‘యాప్స్ & నోటిఫికేషన్స్’ ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులోని ‘ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ’ యాప్పై క్లిక్ చేస్తే ఆ యాప్నకు సంబంధించిన సమాచారం కన్పిస్తుంది. ‘అన్ ఇన్స్టాల్ అప్డేట్స్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే మళ్లీ పాత వెర్షన్ వస్తుంది. ఇప్పుడు మరోసారి ఫోన్ను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
4. చెక్ అండ్ ఇన్స్టాల్ ఆండ్రాయిడ్ అప్డేట్స్
ఫోన్కు సంబంధించిన అప్డేట్స్ గురించి ‘సిస్టమ్ అప్డేట్స్ అవైలబుల్’ అనే నోటిఫికేషన్లు కొన్నిసార్లు మన ఫోన్లో కన్పిస్తుంటాయి. పనిలో పడి వాటిని పట్టించుకోము. అయితే ఈ అప్డేట్స్ డివైజ్లో ఏర్పడే బగ్స్, గ్లిచెస్ను సరిదిద్దడానికి కూడా ఉపయోగపడుతాయి. దాంతో యాప్లు ఈజీగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ను అప్డేట్ చేసుకోవడానికి ‘సెట్టింగ్స్’లోకి వెళ్లాలి. సిస్టమ్➡సిస్టమ్ అప్డేట్స్➡ ఆన్లైన్ అప్డేట్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కనిపిస్తే చేసుకోవాలి. లేని పక్షంలో ఇదే లేటెస్ట్ వెర్షన్ అని అక్కడ చూపిస్తుంది.
5. క్లియర్ ది క్యాచీ డేటా
కొన్నిసార్లు యాప్లో పోగుపడిన క్యాచీ దాన్ని పనిచేయకుండా చేస్తుంది. తొలగించేందుకు యాప్పై నొక్కి పట్టుకుంటే ‘యాప్ ఇన్ ఫో’ కన్పిస్తుంది. అందులోకి వెళితే యాప్ సమాచారం మొత్తం కన్పిస్తుంది. ‘ఫోర్స్ స్టాప్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో ‘స్టోరేజ్ యూసేజ్’లోకి వెళ్లి ‘క్లియర్ క్యాచీ’పై క్లిక్ చేయాలి. తరువాత యాప్ను అన్ ఇన్స్టాల్ చేసి మరోసారి ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత ఫోన్ రీబూట్ చేసి యాప్ సరిగా పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి.
6. రీసెట్ యువర్ డివైజ్
పైన చెప్పిన చిట్కాలేవీ ఫలించని పక్షంలో ఫోన్ మొత్తాన్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఫోన్లోని డేటా మొత్తం తొలగిపోతుంది. అందుకే ముఖ్యమైన సమాచారం మొత్తాన్ని ఒక పెన్డ్రైవ్ లేదా సిస్టమ్లోకి బ్యాకప్ చేసుకోవాలి. తరువాత ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘రీసెట్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్’పై క్లిక్ చేయాలి. అక్కడ ‘ఎరేజ్ అల్ డేటా’ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే ఫోన్లోని సమాచారం మొత్తం తొలగిపోతుంది. తరువాత అవసరమైన యాప్లను మళ్లీ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?