TikTok : ‘టిక్టాక్’ ఏం చేస్తోంది.. దానిపై నిషేధాలు ఎందుకు?
యూజర్లలో బాగా ఆదరణ పొందిన సామాజిక మాధ్యమం టిక్టాక్పై ఇప్పటికే కొన్ని దేశాలు నిషేధం విధించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా అడుగులు వేస్తోంది.
టిక్టాక్.. చైనాకు చెందిన ఈ సామాజిక మాధ్యమం(social media) మొత్తం ఆధునిక సమాజాన్ని షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 100 కోట్లకు పైగా యూజర్లున్నారు(users). ఇటీవలి కాలంలో అమెరికా(america), యూరప్, కెనడా తదితర దేశాల్లో టిక్టాక్కు అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రజా ప్రతినిధులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. షార్ట్ వీడియో యాప్(app)గా ప్రజల్లో ఆదరణ పొందిన టిక్టాక్(TikTok) మాతృసంస్థ చైనీస్ కంపెనీ బైట్డాన్స్(bytedance)కు చెందినది కావడమే ఆ దేశాల అందోళనకు అసలు కారణం.
అమెరికాలోని ప్రభుత్వ పరికరాల్లో 30 రోజుల్లోగా ఆ యాప్ను పూర్తిగా తొలగించాలని వైట్హౌస్(white house) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కెనడా, ఐరోపాలు కూడా అధికారిక పరికరాల నుంచి ఆ యాప్ను తీసేయాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా పౌరులు సైతం టిక్టాక్ ఉపయోగించకుండా పూర్తిగా నిషేధం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో 10 కోట్లకు పైగా యూజర్లు టిక్టాక్ వాడుతున్నారు.
దేశాల ఆందోళన ఎందుకు?
టిక్టాక్ కార్యకలాపాలు మొత్తం దాని మాతృసంస్థ బైట్డాన్స్ నుంచే సాగుతాయి. చైనాకు చెందిన ఈ సంస్థ వద్ద ప్రపంచంలోని ప్రతి యూజర్ డేటా ఉంటుంది. కొన్నిసార్లు అనూహ్య చర్యలకు పాల్పడే డ్రాగన్ ఆ డేటాను దుర్వినియోగం చేసే వీలుందని కొందరు నాయకులు, సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా(Data) ఉపయోగించి ఏ యూజర్ ఏ ప్రదేశంలో నివాసం ఉంటున్నారో కూడా చైనా ప్రభుత్వం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధికారులు అక్కడి సంస్థల నుంచి రహస్యంగా ఆ డేటా పొందే ప్రమాదం లేకపోలేదు. టిక్టాక్ ద్వారా చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను టిక్టాక్ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోంది. అటువంటి సందేహాలు అవసరం లేదని.. తమ యూజర్ల డేటా ఎల్లప్పుడూ భద్రంగా ఉంటుందని చెబుతూ వస్తోంది.
మన దేశంలోనూ..
భారత్లోనూ టిక్టాక్కు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ యాప్ను వాడే యూజర్ల సంఖ్య అనతి కాలంలోనే కోట్లకు చేరింది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత చోటు చేసుకున్న తరువాత 2020 మధ్య కాలంలో 59 చైనీస్ యాప్లను భారత్ నిషేధించింది. అందులో టిక్టాక్ కూడా ఒకటి. భారత యూజర్ల డేటా మొత్తం బయటి దేశాల సర్వర్లకు(server) ఈ యాప్లు పంపుతున్నాయని భారత్ అనుమానం వ్యక్తం చేసింది. తైవాన్, అఫ్గాన్ దేశాలు టిక్టాక్పై పూర్తి నిషేధం విధించగా.. పాకిస్థాన్ తాత్కాలికంగా నాలుగు సార్లు టిక్టాక్ సర్వీసును నిలిపివేసింది.
అమెరికాలో బ్యాన్ చేస్తే..
గతేడాది నవంబరు నుంచే అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రభుత్వ పరికరాల్లో టిక్టాక్ వినియోగాన్ని బ్యాన్ చేశాయి. కొన్ని కళాశాలలు, టెక్సాస్, ఆబర్న్, బోయిస్ వంటి యూనివర్సిటీలు తమ క్యాంపస్ పరిధిలో వినియోగించే వైఫైలో టిక్టాక్ రాకుండా చేశాయి. యూఎస్ ఆర్మీ, మెరైన్ పోలీసులు, వాయుసేన అధికారులు, తీర రక్షక దళాలు వినియోగించే పరికరాల్లో యాప్పై మూడేళ్లుగా బ్యాన్ కొనసాగుతోంది. మిగతా యూజర్లు స్వేచ్ఛగా టిక్టాక్ను వినియోగిస్తున్నారు. విద్యార్థులు తమ సొంత డేటాను ఖర్చు చేసి మరీ టిక్టాక్ వాడుతున్నారు.
టిక్టాక్ను అమెరికాలో పూర్తిగా నిషేధించే బిల్లును ఆమోదించడానికి అక్కడి చట్ట సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ట్రంప్ హయాంలోనూ అలాంటి ప్రయత్నం చేయగా.. కోర్టు దాన్ని అడ్డుకుంది. టిక్టాక్ మాత్రమే కాకుండా రష్యా, ఇరాన్ దేశాలకు సంబంధించిన సామాజిక మాధ్యమాలను కూడా అమెరికాలో వినియోగించకుండా చట్టం చేయాలని చూస్తున్నారు. అలా చేస్తే న్యాయపరంగా ప్రభుత్వానికి కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. టిక్టాక్ను కేవలం సాధారణ పౌరులే కాదు.. అమెరికా చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ పత్రికా సంస్థలు కూడా వాడుతున్నాయి.
టిక్ ‘టాక్’ ఏంటి?
తమ యాప్పై నిషేధం విధిస్తారనే వార్తలపై టిక్ టాక్ స్పందించింది. అదంతా ఓ ‘రాజకీయ డ్రామా’గా అభివర్ణించింది. అమెరికా ప్రజలపై సెన్సార్ విధించేందుకు కొందరు చట్టసభల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.
యూజర్ల మద్దతు
ఫేస్బుక్(Face book), ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లాగే టిక్టాక్ కూడా యూజర్ల డేటా సేకరిస్తోందని అందులో ఎలాంటి తప్పు లేదని కొన్ని డిజిటల్ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. టిక్టాక్పై బ్యాన్ ప్రయత్నాలు ఆపాలని హౌస్ ఫారెన్ ఎఫైర్స్ కమిటీకి ‘ది అమెరికన్ సివిల్ లిబర్టీస్’ లేఖ రాసింది. టిక్టాక్ను తొలగిస్తే యూజర్లకు మాత్రమే నష్టం కాదని, మార్కెట్లు, డిజిటల్ క్రియేటర్లకు కూడా నష్టం వాటిళ్లుతుందని.. బ్యాన్ నిర్ణయం రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
-
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
-
Putin: గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు.. 24 ఏళ్లుగా అధికారంలోనే!
-
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
-
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
-
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు