TikTok : ‘టిక్టాక్’ ఏం చేస్తోంది.. దానిపై నిషేధాలు ఎందుకు?
యూజర్లలో బాగా ఆదరణ పొందిన సామాజిక మాధ్యమం టిక్టాక్పై ఇప్పటికే కొన్ని దేశాలు నిషేధం విధించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా అడుగులు వేస్తోంది.
టిక్టాక్.. చైనాకు చెందిన ఈ సామాజిక మాధ్యమం(social media) మొత్తం ఆధునిక సమాజాన్ని షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 100 కోట్లకు పైగా యూజర్లున్నారు(users). ఇటీవలి కాలంలో అమెరికా(america), యూరప్, కెనడా తదితర దేశాల్లో టిక్టాక్కు అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రజా ప్రతినిధులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. షార్ట్ వీడియో యాప్(app)గా ప్రజల్లో ఆదరణ పొందిన టిక్టాక్(TikTok) మాతృసంస్థ చైనీస్ కంపెనీ బైట్డాన్స్(bytedance)కు చెందినది కావడమే ఆ దేశాల అందోళనకు అసలు కారణం.
అమెరికాలోని ప్రభుత్వ పరికరాల్లో 30 రోజుల్లోగా ఆ యాప్ను పూర్తిగా తొలగించాలని వైట్హౌస్(white house) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కెనడా, ఐరోపాలు కూడా అధికారిక పరికరాల నుంచి ఆ యాప్ను తీసేయాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా పౌరులు సైతం టిక్టాక్ ఉపయోగించకుండా పూర్తిగా నిషేధం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో 10 కోట్లకు పైగా యూజర్లు టిక్టాక్ వాడుతున్నారు.
దేశాల ఆందోళన ఎందుకు?
టిక్టాక్ కార్యకలాపాలు మొత్తం దాని మాతృసంస్థ బైట్డాన్స్ నుంచే సాగుతాయి. చైనాకు చెందిన ఈ సంస్థ వద్ద ప్రపంచంలోని ప్రతి యూజర్ డేటా ఉంటుంది. కొన్నిసార్లు అనూహ్య చర్యలకు పాల్పడే డ్రాగన్ ఆ డేటాను దుర్వినియోగం చేసే వీలుందని కొందరు నాయకులు, సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా(Data) ఉపయోగించి ఏ యూజర్ ఏ ప్రదేశంలో నివాసం ఉంటున్నారో కూడా చైనా ప్రభుత్వం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధికారులు అక్కడి సంస్థల నుంచి రహస్యంగా ఆ డేటా పొందే ప్రమాదం లేకపోలేదు. టిక్టాక్ ద్వారా చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను టిక్టాక్ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోంది. అటువంటి సందేహాలు అవసరం లేదని.. తమ యూజర్ల డేటా ఎల్లప్పుడూ భద్రంగా ఉంటుందని చెబుతూ వస్తోంది.
మన దేశంలోనూ..
భారత్లోనూ టిక్టాక్కు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ యాప్ను వాడే యూజర్ల సంఖ్య అనతి కాలంలోనే కోట్లకు చేరింది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత చోటు చేసుకున్న తరువాత 2020 మధ్య కాలంలో 59 చైనీస్ యాప్లను భారత్ నిషేధించింది. అందులో టిక్టాక్ కూడా ఒకటి. భారత యూజర్ల డేటా మొత్తం బయటి దేశాల సర్వర్లకు(server) ఈ యాప్లు పంపుతున్నాయని భారత్ అనుమానం వ్యక్తం చేసింది. తైవాన్, అఫ్గాన్ దేశాలు టిక్టాక్పై పూర్తి నిషేధం విధించగా.. పాకిస్థాన్ తాత్కాలికంగా నాలుగు సార్లు టిక్టాక్ సర్వీసును నిలిపివేసింది.
అమెరికాలో బ్యాన్ చేస్తే..
గతేడాది నవంబరు నుంచే అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రభుత్వ పరికరాల్లో టిక్టాక్ వినియోగాన్ని బ్యాన్ చేశాయి. కొన్ని కళాశాలలు, టెక్సాస్, ఆబర్న్, బోయిస్ వంటి యూనివర్సిటీలు తమ క్యాంపస్ పరిధిలో వినియోగించే వైఫైలో టిక్టాక్ రాకుండా చేశాయి. యూఎస్ ఆర్మీ, మెరైన్ పోలీసులు, వాయుసేన అధికారులు, తీర రక్షక దళాలు వినియోగించే పరికరాల్లో యాప్పై మూడేళ్లుగా బ్యాన్ కొనసాగుతోంది. మిగతా యూజర్లు స్వేచ్ఛగా టిక్టాక్ను వినియోగిస్తున్నారు. విద్యార్థులు తమ సొంత డేటాను ఖర్చు చేసి మరీ టిక్టాక్ వాడుతున్నారు.
టిక్టాక్ను అమెరికాలో పూర్తిగా నిషేధించే బిల్లును ఆమోదించడానికి అక్కడి చట్ట సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ట్రంప్ హయాంలోనూ అలాంటి ప్రయత్నం చేయగా.. కోర్టు దాన్ని అడ్డుకుంది. టిక్టాక్ మాత్రమే కాకుండా రష్యా, ఇరాన్ దేశాలకు సంబంధించిన సామాజిక మాధ్యమాలను కూడా అమెరికాలో వినియోగించకుండా చట్టం చేయాలని చూస్తున్నారు. అలా చేస్తే న్యాయపరంగా ప్రభుత్వానికి కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. టిక్టాక్ను కేవలం సాధారణ పౌరులే కాదు.. అమెరికా చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ పత్రికా సంస్థలు కూడా వాడుతున్నాయి.
టిక్ ‘టాక్’ ఏంటి?
తమ యాప్పై నిషేధం విధిస్తారనే వార్తలపై టిక్ టాక్ స్పందించింది. అదంతా ఓ ‘రాజకీయ డ్రామా’గా అభివర్ణించింది. అమెరికా ప్రజలపై సెన్సార్ విధించేందుకు కొందరు చట్టసభల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.
యూజర్ల మద్దతు
ఫేస్బుక్(Face book), ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లాగే టిక్టాక్ కూడా యూజర్ల డేటా సేకరిస్తోందని అందులో ఎలాంటి తప్పు లేదని కొన్ని డిజిటల్ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. టిక్టాక్పై బ్యాన్ ప్రయత్నాలు ఆపాలని హౌస్ ఫారెన్ ఎఫైర్స్ కమిటీకి ‘ది అమెరికన్ సివిల్ లిబర్టీస్’ లేఖ రాసింది. టిక్టాక్ను తొలగిస్తే యూజర్లకు మాత్రమే నష్టం కాదని, మార్కెట్లు, డిజిటల్ క్రియేటర్లకు కూడా నష్టం వాటిళ్లుతుందని.. బ్యాన్ నిర్ణయం రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే