Air traffic : గగనతలంలో లక్ష్మణ రేఖలెన్నో..!
ప్రపంచవ్యాప్తంగా (World) రోజుకు దాదాపు లక్ష విమానాలు (Flight) గాల్లో ఎగురుతున్నాయి. గగనతలం (Sky)లో అంత రద్దీ ఉన్నా అవి ఢీకొంటున్న ఘటనలు అరుదు. అందుకు కారణాలు తెలుసుకోండి.
కొద్ది రోజుల క్రితం నేపాల్ (Nepal) గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా (Air India), నేపాల్ ఎయిర్లైన్స్ (Nepal Airlines)లకు చెందిన విమానాలు గాల్లో దాదాపు ఢీకొట్టుకున్నంత పని చేశాయి. వెంటనే.. హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అసలు విమానాలు (Flights) ఎదురెదురుగా, వెనుక నుంచి ఒకదానినొకటి ఢీకొనకుండా గాల్లో ఏ విధంగా ప్రయాణం సాగిస్తాయో చదివేయండి.
సుశిక్షితులైన పైలట్లు
గగనతలంలో సురక్షిత ప్రయాణానికి విమానం నడిపే పైలట్లు (Pilots) రకరకాల పద్ధతులను అవలంబిస్తారు. రాడార్ రహిత, రాడార్ సహిత వ్యవస్థలను ఆధారం చేసుకొని ఎలా ప్రయాణం చేయాలో వారు శిక్షణలో నేర్చుకుంటారు. దాంతో గాల్లోనే రెండు విమానాలు ఢీకొనడం దాదాపుగా అసాధ్యం. విమానాలు గాల్లో ఎగరడం మొదలైన తొలినాళ్లలో పక్కనే ఏమైనా విమానం వస్తోందా అని పైలట్లు కిటికీలో నుంచి చూసేవారట. ఆ పరిస్థితిని మార్చేందుకు కొన్ని సంప్రదాయ పద్ధతులను కనుగొని పాటించారు. నేడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో దేశం తమ అవసరాలకు తగ్గట్లుగా మొత్తం రక్షణ వ్యవస్థలను వినియోగించుకుంటుంది. వాటిలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
నిరంతర సమాచారం
విమానాశ్రయానికి దగ్గరలో వచ్చిపోయే విమానాల ట్రాఫిక్ గురించి స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ డిపార్చర్ (ఎస్ఐడి), స్టాండర్డ్ టెర్మినల్ ఎరైవల్ రూట్(స్టార్) ద్వారా పైలట్లు తెలుసుకుంటారు. ఏ సమయంలో ఏయే విమానాలు వస్తాయో మొత్తం సమాచారం వారికి ఎప్పటికప్పుడు అందుతుంటుంది. టేకాఫ్ కావడానికి విమానాశ్రయంలో పరిస్థితులు అనుకూలించపోయినా పైలట్లకు సమాచారం వెళ్తుంది. దాంతో వారు కొంచెం సేపు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించి తరువాత కిందకి దించుతారు. ఒక వేళ విమానాశ్రయానికి దూరంగా ప్రయాణిస్తుంటే నిలువు, అడ్డం సూత్రాలను ఆధారం చేసుకొని విమానాలను నడిపిస్తారు. అంటే గాల్లో ఎగిరే సమయంలో ఇతర విమానాలకు దూరం పాటిస్తారు. నేపాల్ ఘటనలో ఈ విధానంలో తేడా రావడంతోనే ప్రమాదానికి ఆస్కారం ఏర్పడినట్లు సమాచారం.
నిలువు దూరం లెక్కన..
విమానం స్థితిని బట్టి అవి ఎగిరే ఎత్తులో ఎంత దూరం పాటించాలో నిర్ధారిస్తారు. సాధారణంగా 29 వేల అడుగుల లోపు ఎత్తులో ప్రయాణించే విమానాల మధ్య వెయ్యి అడుగుల నిలువు దూరం పాటించాల్సి ఉంటుంది. అంటే ‘X’ అనే విమానం 12 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తే ‘Y’ 13 వేల అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణం చేయాలి. 29 వేల అడుగులకు పైన ప్రయాణిస్తుంటే రెండు విమానాల ఎత్తులో దూరం 2 వేల అడుగులుంటుంది. 45వేల అడుగులకు పైన ప్రయాణించే సూపర్సోనిక్ విమానాలు 4 వేల అడుగుల ఎత్తు దూరం పాటించాలి. అధునాతన జెట్ విమానాలను మాత్రం ‘రెడ్యూస్డ్ వెర్టికల్ సెపరేషన్ మినిమా’ విధానంలో 29-41వేల అడుగుల ఎత్తులో వెయ్యి అడుగుల దూరం పాటించడానికి అనుమతిస్తారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి ఈ విధానం తోడ్పడుతుంది.
పలురకాలుగా ‘అడ్డు’కట్ట
విమానాలను అడ్డంగా వేరు చేసేందుకు రెండు మార్గాలను ఎంచుకుంటారు. రాడార్ కవర్ చేసే ప్రదేశాన్ని దూరంతో, రాడార్లేని ప్రదేశాన్ని సమయంతో వేరు చేస్తారు. రాడార్ కవర్ చేస్తున్న ప్రదేశంలో రెండు విమానాలు ఒకదాని వెనుక మరొకటి వెంటనే వెళ్లడానికి అనుమతించరు. ఈ విధానంలో ఒక్కో విమానానికి దాదాపు 5 నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాడార్ కవర్ చేయని ప్రాంతంలో ప్రయాణానికి రెండు విమానాలు బయలుదేరే సమయం 10 నుంచి 15 నిమిషాలు తేడా ఉంటుంది. ఇక ఎదురెదురుగా వచ్చే విమానాలు ఢీకొట్టకుండా ‘నార్త్-సౌత్’ రూల్ను పాటిస్తారు. అంటే ఆకాశ మార్గాన్ని 360 డిగ్రీలుగా విభజించుకొని 0-179 డిగ్రీల వరకు విమానాలు నార్త్ నుంచి సౌత్కు వెళతాయి. 180-359 డిగ్రీల మధ్య విమానాలు సౌత్ నుంచి నార్త్ వైపు ప్రయాణిస్తాయి.
రాడార్ రహిత గగనతలంలో
అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఖండాలు, మహా సముద్రాలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. శాస్త్ర పరిశోధనల పరిమితుల కారణంగా ప్రపంచంలో కొన్ని చోట్ల రాడార్లు పనిచేయవు. దాన్నే రాడార్ రహిత గగనతలం అంటారు. ముఖ్యంగా సముద్రంపై మార్గాలను రాడార్లు కవర్ చేయలేవు. ఇలాంటి సమయంలో ఒక విమానానికి మరో విమానానికి మధ్య ఎత్తులో, పక్క, వెనుక నుంచి దూరం(పొజిషన్) పాటించడం ఎంతో ఉపకరిస్తుంది. ఎత్తులో తేడా వెయ్యి కిలోమీటర్లే అయినప్పటికీ విమానం బయలుదేరే సమయం మధ్య వ్యవధి 30 నిమిషాలు, దూరం దాదాపు 90 కిలోమీటర్లు ఉండేలా చేసుకుంటారు.
ఏటీసీ ఆదేశాలు కీలకం
విమానాలు సురక్షితంగా గాల్లో ప్రయాణం చేయడంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) కీలక పాత్ర పోషిస్తుంది. ఏ విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోందో ఏటీసీకి ఎప్పటికప్పుడు రాడార్ల సహాయంతో తెలిసిపోతుంది. అందుకు విమానంలో అమర్చిన ట్రాన్స్పాండర్ దోహదం చేస్తుంది. ఏటీసీ సూచనలు పైలట్లు తప్పకుంటా పాటించాల్సి ఉంటుంది. ఇక విమానాలు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటే వాటి వేగం 463 కిలోమీటర్ల లోపునే ఉండాలి. ఎక్కడ తేడా జరిగినట్లు తెలిసినా ఏటీసీ, పైలట్లు, పరికరాలు అన్నింటినీ తనిఖీ చేసి తప్పు ఎక్కడ దొర్లిందో సాంకేతిక సిబ్బంది కనిపెట్టేస్తారు.
అధునాతన వ్యవస్థ ‘టీసీఏఎస్’
విమానం గగనతలంలో ఎగురుతుండగానే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే ట్రాఫిక్ అలర్ట్ & కొలిజన్ అవైడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్) పైలట్లను అప్రమత్తం చేస్తుంది. దాదాపు అన్ని విమానాల్లో ఇటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఎగిరే ఎత్తు పెంచమని ఒక పైలట్ను, తగ్గించమని మరో పైలట్ను కమాండ్ చేస్తుంది. ఈ వ్యవస్థ అప్రమత్తం చేసిందంటే దాన్ని కచ్చితంగా పైలట్లు పాటించి తీరాలి. ఒక వేళ ఆ సమయంలో ఏటీసీ నుంచి భిన్నమైన కమాండ్స్ వచ్చినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ప్రయాణికులతో రాకపోకలు సాగించే విమానాలకు ‘టీసీఏఎస్’ వ్యవస్థ తప్పనిసరి చేశారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం