Air traffic : గగనతలంలో లక్ష్మణ రేఖలెన్నో..!
ప్రపంచవ్యాప్తంగా (World) రోజుకు దాదాపు లక్ష విమానాలు (Flight) గాల్లో ఎగురుతున్నాయి. గగనతలం (Sky)లో అంత రద్దీ ఉన్నా అవి ఢీకొంటున్న ఘటనలు అరుదు. అందుకు కారణాలు తెలుసుకోండి.
కొద్ది రోజుల క్రితం నేపాల్ (Nepal) గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా (Air India), నేపాల్ ఎయిర్లైన్స్ (Nepal Airlines)లకు చెందిన విమానాలు గాల్లో దాదాపు ఢీకొట్టుకున్నంత పని చేశాయి. వెంటనే.. హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అసలు విమానాలు (Flights) ఎదురెదురుగా, వెనుక నుంచి ఒకదానినొకటి ఢీకొనకుండా గాల్లో ఏ విధంగా ప్రయాణం సాగిస్తాయో చదివేయండి.
సుశిక్షితులైన పైలట్లు
గగనతలంలో సురక్షిత ప్రయాణానికి విమానం నడిపే పైలట్లు (Pilots) రకరకాల పద్ధతులను అవలంబిస్తారు. రాడార్ రహిత, రాడార్ సహిత వ్యవస్థలను ఆధారం చేసుకొని ఎలా ప్రయాణం చేయాలో వారు శిక్షణలో నేర్చుకుంటారు. దాంతో గాల్లోనే రెండు విమానాలు ఢీకొనడం దాదాపుగా అసాధ్యం. విమానాలు గాల్లో ఎగరడం మొదలైన తొలినాళ్లలో పక్కనే ఏమైనా విమానం వస్తోందా అని పైలట్లు కిటికీలో నుంచి చూసేవారట. ఆ పరిస్థితిని మార్చేందుకు కొన్ని సంప్రదాయ పద్ధతులను కనుగొని పాటించారు. నేడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో దేశం తమ అవసరాలకు తగ్గట్లుగా మొత్తం రక్షణ వ్యవస్థలను వినియోగించుకుంటుంది. వాటిలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
నిరంతర సమాచారం
విమానాశ్రయానికి దగ్గరలో వచ్చిపోయే విమానాల ట్రాఫిక్ గురించి స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ డిపార్చర్ (ఎస్ఐడి), స్టాండర్డ్ టెర్మినల్ ఎరైవల్ రూట్(స్టార్) ద్వారా పైలట్లు తెలుసుకుంటారు. ఏ సమయంలో ఏయే విమానాలు వస్తాయో మొత్తం సమాచారం వారికి ఎప్పటికప్పుడు అందుతుంటుంది. టేకాఫ్ కావడానికి విమానాశ్రయంలో పరిస్థితులు అనుకూలించపోయినా పైలట్లకు సమాచారం వెళ్తుంది. దాంతో వారు కొంచెం సేపు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించి తరువాత కిందకి దించుతారు. ఒక వేళ విమానాశ్రయానికి దూరంగా ప్రయాణిస్తుంటే నిలువు, అడ్డం సూత్రాలను ఆధారం చేసుకొని విమానాలను నడిపిస్తారు. అంటే గాల్లో ఎగిరే సమయంలో ఇతర విమానాలకు దూరం పాటిస్తారు. నేపాల్ ఘటనలో ఈ విధానంలో తేడా రావడంతోనే ప్రమాదానికి ఆస్కారం ఏర్పడినట్లు సమాచారం.
నిలువు దూరం లెక్కన..
విమానం స్థితిని బట్టి అవి ఎగిరే ఎత్తులో ఎంత దూరం పాటించాలో నిర్ధారిస్తారు. సాధారణంగా 29 వేల అడుగుల లోపు ఎత్తులో ప్రయాణించే విమానాల మధ్య వెయ్యి అడుగుల నిలువు దూరం పాటించాల్సి ఉంటుంది. అంటే ‘X’ అనే విమానం 12 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తే ‘Y’ 13 వేల అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణం చేయాలి. 29 వేల అడుగులకు పైన ప్రయాణిస్తుంటే రెండు విమానాల ఎత్తులో దూరం 2 వేల అడుగులుంటుంది. 45వేల అడుగులకు పైన ప్రయాణించే సూపర్సోనిక్ విమానాలు 4 వేల అడుగుల ఎత్తు దూరం పాటించాలి. అధునాతన జెట్ విమానాలను మాత్రం ‘రెడ్యూస్డ్ వెర్టికల్ సెపరేషన్ మినిమా’ విధానంలో 29-41వేల అడుగుల ఎత్తులో వెయ్యి అడుగుల దూరం పాటించడానికి అనుమతిస్తారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి ఈ విధానం తోడ్పడుతుంది.
పలురకాలుగా ‘అడ్డు’కట్ట
విమానాలను అడ్డంగా వేరు చేసేందుకు రెండు మార్గాలను ఎంచుకుంటారు. రాడార్ కవర్ చేసే ప్రదేశాన్ని దూరంతో, రాడార్లేని ప్రదేశాన్ని సమయంతో వేరు చేస్తారు. రాడార్ కవర్ చేస్తున్న ప్రదేశంలో రెండు విమానాలు ఒకదాని వెనుక మరొకటి వెంటనే వెళ్లడానికి అనుమతించరు. ఈ విధానంలో ఒక్కో విమానానికి దాదాపు 5 నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాడార్ కవర్ చేయని ప్రాంతంలో ప్రయాణానికి రెండు విమానాలు బయలుదేరే సమయం 10 నుంచి 15 నిమిషాలు తేడా ఉంటుంది. ఇక ఎదురెదురుగా వచ్చే విమానాలు ఢీకొట్టకుండా ‘నార్త్-సౌత్’ రూల్ను పాటిస్తారు. అంటే ఆకాశ మార్గాన్ని 360 డిగ్రీలుగా విభజించుకొని 0-179 డిగ్రీల వరకు విమానాలు నార్త్ నుంచి సౌత్కు వెళతాయి. 180-359 డిగ్రీల మధ్య విమానాలు సౌత్ నుంచి నార్త్ వైపు ప్రయాణిస్తాయి.
రాడార్ రహిత గగనతలంలో
అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఖండాలు, మహా సముద్రాలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. శాస్త్ర పరిశోధనల పరిమితుల కారణంగా ప్రపంచంలో కొన్ని చోట్ల రాడార్లు పనిచేయవు. దాన్నే రాడార్ రహిత గగనతలం అంటారు. ముఖ్యంగా సముద్రంపై మార్గాలను రాడార్లు కవర్ చేయలేవు. ఇలాంటి సమయంలో ఒక విమానానికి మరో విమానానికి మధ్య ఎత్తులో, పక్క, వెనుక నుంచి దూరం(పొజిషన్) పాటించడం ఎంతో ఉపకరిస్తుంది. ఎత్తులో తేడా వెయ్యి కిలోమీటర్లే అయినప్పటికీ విమానం బయలుదేరే సమయం మధ్య వ్యవధి 30 నిమిషాలు, దూరం దాదాపు 90 కిలోమీటర్లు ఉండేలా చేసుకుంటారు.
ఏటీసీ ఆదేశాలు కీలకం
విమానాలు సురక్షితంగా గాల్లో ప్రయాణం చేయడంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) కీలక పాత్ర పోషిస్తుంది. ఏ విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోందో ఏటీసీకి ఎప్పటికప్పుడు రాడార్ల సహాయంతో తెలిసిపోతుంది. అందుకు విమానంలో అమర్చిన ట్రాన్స్పాండర్ దోహదం చేస్తుంది. ఏటీసీ సూచనలు పైలట్లు తప్పకుంటా పాటించాల్సి ఉంటుంది. ఇక విమానాలు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటే వాటి వేగం 463 కిలోమీటర్ల లోపునే ఉండాలి. ఎక్కడ తేడా జరిగినట్లు తెలిసినా ఏటీసీ, పైలట్లు, పరికరాలు అన్నింటినీ తనిఖీ చేసి తప్పు ఎక్కడ దొర్లిందో సాంకేతిక సిబ్బంది కనిపెట్టేస్తారు.
అధునాతన వ్యవస్థ ‘టీసీఏఎస్’
విమానం గగనతలంలో ఎగురుతుండగానే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే ట్రాఫిక్ అలర్ట్ & కొలిజన్ అవైడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్) పైలట్లను అప్రమత్తం చేస్తుంది. దాదాపు అన్ని విమానాల్లో ఇటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఎగిరే ఎత్తు పెంచమని ఒక పైలట్ను, తగ్గించమని మరో పైలట్ను కమాండ్ చేస్తుంది. ఈ వ్యవస్థ అప్రమత్తం చేసిందంటే దాన్ని కచ్చితంగా పైలట్లు పాటించి తీరాలి. ఒక వేళ ఆ సమయంలో ఏటీసీ నుంచి భిన్నమైన కమాండ్స్ వచ్చినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ప్రయాణికులతో రాకపోకలు సాగించే విమానాలకు ‘టీసీఏఎస్’ వ్యవస్థ తప్పనిసరి చేశారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?