Mount Everest : ఎవరెస్టు అధిరోహణ ప్రాణాలతో చెలగాటం.. ఎన్ని అడ్డంకులు దాటాలంటే!
జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్టు పర్వతాన్ని (Mount Everest) అధిరోహించాలనేది పర్వతారోహకుల (Mountaineers) కల. అయితే దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక కొందరు మధ్యలోనే వెనుదిరుగుతారు. మరికొందరు మొండిగా ముందుకెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ క్రమంలో ఎవరెస్టు అధిరోహణలో ఉండే కష్టనష్టాల గురించి చదివేయండి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఒక్కసారి అధిరోహించడమే అరుదైన విషయం. అలాంటిది ప్రముఖ పర్వతారోహకులు కమీ రీటా షెర్పా 28 సార్లు, పాసన్గ్ దావా షెర్పా 27 సార్లు ఎవరెస్టు ఎక్కి సంచలనం సృష్టించారు. ఈ సీజన్లోనే ఆస్ట్రేలియా (Australia)లోని పెర్త్కు చెందిన 40 ఏళ్ల జేసన్ బెర్నార్డ్ కెన్నిసన్ (Jason Bernard Kennison)గత శుక్రవారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించి.. కిందకు దిగే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఎవరెస్టును అధిరోహించడం ఎందుకు కష్టమైన పని? ఏటా ఎంత మంది మృత్యువాత పడుతున్నారు? షెర్పాలు ఎవరు?తదితర విషయాలు తెలుసుకోండి.
ఎవరీ షెర్పాలు?
షెర్పా అనేది పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక తెగ. భారత్, నేపాల్, టిబెట్ సహా పలు దేశాల్లో ఈ జనాభా ఉంది. వీరు వివిధ భాషలు మాట్లాడుతూ పర్వతారోహకులు, పర్యాటకులకు సాయం చేస్తుంటారు. అందుకోసం కొంత డబ్బు తీసుకుంటారు. ఎవరెస్ట్ పర్వాతారోహణ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో వీరికి డిమాండ్ ఏర్పడింది. టూరిస్టులకు సాయం చేసే క్రమంలో కొన్నిసార్లు షెర్పాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన షెర్పాలు సంఖ్య కూడా ఎక్కువే. తొలి రోజుల్లో వీరు పర్వతాలను దేవతలుగా ఆరాధించారు. వాటిని ఇతరులు అధిరోహించడానికి కూడా అంగీకరించేవారు కాదట.
ఎత్తయిన శిఖరం ‘ఎవరెస్టు’
ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా మౌంట్ ఎవరెస్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీన్ని టిబెట్ భాషలో ‘చోమోలుంగ్మా’, నేపాలీలో ‘సాగర్మాత’ అని పిలుస్తారు. ఈ పర్వతం సముద్రం మట్టం నుంచి 8849 మీటర్ల ఎత్తులో ఉంది. ఎవరెస్టు శిఖరాన్ని తొలిసారి టెన్జింగ్ నార్గే, సర్ ఎడ్మండ్ హిల్లరీలు అధిరోహించారు. ఈ నెల 29 నాటికి ఆ ఘట్టానికి 70 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సారి మౌంట్ ఎవరెస్టుపై బాగా రద్దీ నెలకొంది. నేపాల్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 478 క్లైంబింగ్ పర్మిట్లు మంజూరు చేసింది. అదే విధంగా ఈ సీజన్లోనే మే 23 దాకా 11 మంది మృతిచెందారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది.
ఏళ్ల తరబడి సన్నద్ధం
ఎవరెస్టు ఎక్కడం సాధారణ విషయం కాదు. శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా పర్వతారోహకులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అందుకోసం కొన్ని సంవత్సరాలు సాధన చేస్తారు. ముందుగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న, ఎత్తయిన కొండలపై నిద్ర అలవాటు చేసుకుంటారు. అలాగే తక్కువ ఆక్సిజన్ ఉన్న గదుల్లోకి వెళ్లి ఎంతసేపు ఉండగలమో ప్రయత్నించి చూస్తారు. మెల్లగా ఆ సమయాన్ని పెంచుతూ పోతారు. చిన్న చిన్న పర్వతాలను అధిరోహిస్తూ తమ శక్తియుక్తులను బలోపేతం చేసుకుంటారు. ఇంతగా శిక్షణ తీసుకున్నా కొందరు ఎవరెస్టు బేస్ క్యాంప్లోకి అడుగుపెట్టగానే తడబడతారు. వివిధ అడ్డంకుల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు.
నాన్ షెర్పాల మరణాలు అధికం
హిమాలయన్ డేటా బేస్ ప్రకారం 1922 నుంచి 2022 క్లైంబింగ్ సీజన్ పూర్తయ్యేనాటికి 310 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 16 వేల మంది నాన్-షెర్పాలు ఎవరెస్టు ఎక్కే సాహసం చేసి 5633 మంది మాత్రమే విజయం సాధించారు. వారి గెలుపునకు కారణం 5825 మంది షెర్పాలు. ఈ షెర్పాలు ఎవరెస్టును అధిరోహించాలనే ఆలోచన లేకుండానే పర్వతారోహకులకు తోడుగా వెళ్లారు. వీరిలో కొందరు ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎవరెస్టును అధిరోహించారు.
2006 నుంచి 2019 మధ్య కాలంలో నాన్-షెర్పా మహిళల మరణాలు 0.5 శాతం కాగా.. పురుషుల మరణాలు 1.1 శాతం. ఈ మరణాలకు కారణం అవలంచెలు, మంచు కొండలు విరిగిపడటం, భయానక ఖుంబూ హిమపాతాన్ని దాటుకోవడం, అల్పోష్ణ స్థితి, భయంకరమైన చలి, తీవ్ర అలసట, ఆయాసం, ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో అనారోగ్యం వంటి కారణాలున్నాయి. ఇక 1950 నుంచి సంభవించిన నాన్-షెర్పా మరణాల్లో 35 శాతం కింద పడిపోవడం, 22 శాతం ఆయాసం, 18 శాతం అనారోగ్యం.. మిగతావి ఇతర కారణాల వల్ల జరిగాయి. అయితే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం వల్ల షెర్పాలు మరణాలను చాలా వరకు తప్పించుకోగలిగారు. వారి మరణాల్లో 44 శాతం హిమపాతాల కారణంగా చోటు చేసుకున్నాయి. 2014లో ఓ భారీ అవలంచె 16 మంది షెర్పాలను బలితీసుకుంది.
అకస్మాత్తుగా చుట్టుముట్టే వ్యాధులివే!
5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్ద 50 శాతం ఆక్సిజన్ మాత్రమే లభిస్తుంది. ఇక శిఖరం వద్ద ప్రాణవాయువు 30 శాతానికి లోపే ఉంటుంది. దాంతో కొందరు తీవ్రమైన ‘మౌంటెన్ సిక్నెస్’కు గురవుతారు. తలనొప్పి వికారం, ఆకలి నశించడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కొందరు ఈ స్థితిని తట్టుకొని కిందికి వస్తేనే ప్రాణాలతో ఉంటారు. ‘పల్మనరీ అడిమా’ అనేది మరో రోగ లక్షణం. ఊపిరితిత్తుల్లోకి నెమ్ము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పొడి దగ్గుతోపాటు నోట్లో నుంచి నురగ, గులాబీ రంగు కఫం బయటకు వస్తాయి. ‘సెరెబ్రల్ అడిమా’ ఇంకా ప్రమాదకరం. దీంతో మెదడులోకి ద్రవం చేరి తీవ్రమైన తలపోటు వస్తుంది. గందరగోళం ఏర్పడి మైకం వస్తుంది. శరీరంపై నియంత్రణ కోల్పోతారు. సకాలంలో చికిత్స అందకపోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. పర్వతారోహకులు ఆక్సిజన్ ట్యాంకులు తమ వెంట తీసుకెళ్లడం ద్వారా చాలావరకు ఈ ప్రమాదాలను నివారించుకోగలుగుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి