Mount Everest : ఎవరెస్టు అధిరోహణ ప్రాణాలతో చెలగాటం.. ఎన్ని అడ్డంకులు దాటాలంటే!
జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్టు పర్వతాన్ని (Mount Everest) అధిరోహించాలనేది పర్వతారోహకుల (Mountaineers) కల. అయితే దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక కొందరు మధ్యలోనే వెనుదిరుగుతారు. మరికొందరు మొండిగా ముందుకెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ క్రమంలో ఎవరెస్టు అధిరోహణలో ఉండే కష్టనష్టాల గురించి చదివేయండి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఒక్కసారి అధిరోహించడమే అరుదైన విషయం. అలాంటిది ప్రముఖ పర్వతారోహకులు కమీ రీటా షెర్పా 28 సార్లు, పాసన్గ్ దావా షెర్పా 27 సార్లు ఎవరెస్టు ఎక్కి సంచలనం సృష్టించారు. ఈ సీజన్లోనే ఆస్ట్రేలియా (Australia)లోని పెర్త్కు చెందిన 40 ఏళ్ల జేసన్ బెర్నార్డ్ కెన్నిసన్ (Jason Bernard Kennison)గత శుక్రవారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించి.. కిందకు దిగే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఎవరెస్టును అధిరోహించడం ఎందుకు కష్టమైన పని? ఏటా ఎంత మంది మృత్యువాత పడుతున్నారు? షెర్పాలు ఎవరు?తదితర విషయాలు తెలుసుకోండి.
ఎవరీ షెర్పాలు?
షెర్పా అనేది పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక తెగ. భారత్, నేపాల్, టిబెట్ సహా పలు దేశాల్లో ఈ జనాభా ఉంది. వీరు వివిధ భాషలు మాట్లాడుతూ పర్వతారోహకులు, పర్యాటకులకు సాయం చేస్తుంటారు. అందుకోసం కొంత డబ్బు తీసుకుంటారు. ఎవరెస్ట్ పర్వాతారోహణ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో వీరికి డిమాండ్ ఏర్పడింది. టూరిస్టులకు సాయం చేసే క్రమంలో కొన్నిసార్లు షెర్పాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన షెర్పాలు సంఖ్య కూడా ఎక్కువే. తొలి రోజుల్లో వీరు పర్వతాలను దేవతలుగా ఆరాధించారు. వాటిని ఇతరులు అధిరోహించడానికి కూడా అంగీకరించేవారు కాదట.
ఎత్తయిన శిఖరం ‘ఎవరెస్టు’
ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా మౌంట్ ఎవరెస్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీన్ని టిబెట్ భాషలో ‘చోమోలుంగ్మా’, నేపాలీలో ‘సాగర్మాత’ అని పిలుస్తారు. ఈ పర్వతం సముద్రం మట్టం నుంచి 8849 మీటర్ల ఎత్తులో ఉంది. ఎవరెస్టు శిఖరాన్ని తొలిసారి టెన్జింగ్ నార్గే, సర్ ఎడ్మండ్ హిల్లరీలు అధిరోహించారు. ఈ నెల 29 నాటికి ఆ ఘట్టానికి 70 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సారి మౌంట్ ఎవరెస్టుపై బాగా రద్దీ నెలకొంది. నేపాల్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 478 క్లైంబింగ్ పర్మిట్లు మంజూరు చేసింది. అదే విధంగా ఈ సీజన్లోనే మే 23 దాకా 11 మంది మృతిచెందారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది.
ఏళ్ల తరబడి సన్నద్ధం
ఎవరెస్టు ఎక్కడం సాధారణ విషయం కాదు. శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా పర్వతారోహకులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అందుకోసం కొన్ని సంవత్సరాలు సాధన చేస్తారు. ముందుగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న, ఎత్తయిన కొండలపై నిద్ర అలవాటు చేసుకుంటారు. అలాగే తక్కువ ఆక్సిజన్ ఉన్న గదుల్లోకి వెళ్లి ఎంతసేపు ఉండగలమో ప్రయత్నించి చూస్తారు. మెల్లగా ఆ సమయాన్ని పెంచుతూ పోతారు. చిన్న చిన్న పర్వతాలను అధిరోహిస్తూ తమ శక్తియుక్తులను బలోపేతం చేసుకుంటారు. ఇంతగా శిక్షణ తీసుకున్నా కొందరు ఎవరెస్టు బేస్ క్యాంప్లోకి అడుగుపెట్టగానే తడబడతారు. వివిధ అడ్డంకుల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు.
నాన్ షెర్పాల మరణాలు అధికం
హిమాలయన్ డేటా బేస్ ప్రకారం 1922 నుంచి 2022 క్లైంబింగ్ సీజన్ పూర్తయ్యేనాటికి 310 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 16 వేల మంది నాన్-షెర్పాలు ఎవరెస్టు ఎక్కే సాహసం చేసి 5633 మంది మాత్రమే విజయం సాధించారు. వారి గెలుపునకు కారణం 5825 మంది షెర్పాలు. ఈ షెర్పాలు ఎవరెస్టును అధిరోహించాలనే ఆలోచన లేకుండానే పర్వతారోహకులకు తోడుగా వెళ్లారు. వీరిలో కొందరు ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎవరెస్టును అధిరోహించారు.
2006 నుంచి 2019 మధ్య కాలంలో నాన్-షెర్పా మహిళల మరణాలు 0.5 శాతం కాగా.. పురుషుల మరణాలు 1.1 శాతం. ఈ మరణాలకు కారణం అవలంచెలు, మంచు కొండలు విరిగిపడటం, భయానక ఖుంబూ హిమపాతాన్ని దాటుకోవడం, అల్పోష్ణ స్థితి, భయంకరమైన చలి, తీవ్ర అలసట, ఆయాసం, ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో అనారోగ్యం వంటి కారణాలున్నాయి. ఇక 1950 నుంచి సంభవించిన నాన్-షెర్పా మరణాల్లో 35 శాతం కింద పడిపోవడం, 22 శాతం ఆయాసం, 18 శాతం అనారోగ్యం.. మిగతావి ఇతర కారణాల వల్ల జరిగాయి. అయితే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం వల్ల షెర్పాలు మరణాలను చాలా వరకు తప్పించుకోగలిగారు. వారి మరణాల్లో 44 శాతం హిమపాతాల కారణంగా చోటు చేసుకున్నాయి. 2014లో ఓ భారీ అవలంచె 16 మంది షెర్పాలను బలితీసుకుంది.
అకస్మాత్తుగా చుట్టుముట్టే వ్యాధులివే!
5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్ద 50 శాతం ఆక్సిజన్ మాత్రమే లభిస్తుంది. ఇక శిఖరం వద్ద ప్రాణవాయువు 30 శాతానికి లోపే ఉంటుంది. దాంతో కొందరు తీవ్రమైన ‘మౌంటెన్ సిక్నెస్’కు గురవుతారు. తలనొప్పి వికారం, ఆకలి నశించడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కొందరు ఈ స్థితిని తట్టుకొని కిందికి వస్తేనే ప్రాణాలతో ఉంటారు. ‘పల్మనరీ అడిమా’ అనేది మరో రోగ లక్షణం. ఊపిరితిత్తుల్లోకి నెమ్ము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పొడి దగ్గుతోపాటు నోట్లో నుంచి నురగ, గులాబీ రంగు కఫం బయటకు వస్తాయి. ‘సెరెబ్రల్ అడిమా’ ఇంకా ప్రమాదకరం. దీంతో మెదడులోకి ద్రవం చేరి తీవ్రమైన తలపోటు వస్తుంది. గందరగోళం ఏర్పడి మైకం వస్తుంది. శరీరంపై నియంత్రణ కోల్పోతారు. సకాలంలో చికిత్స అందకపోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. పర్వతారోహకులు ఆక్సిజన్ ట్యాంకులు తమ వెంట తీసుకెళ్లడం ద్వారా చాలావరకు ఈ ప్రమాదాలను నివారించుకోగలుగుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఇతని చేత బలవంతంగా 200 మంది పిల్లలను కనిపించారు!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!