Sammed Shikharji: అప్పట్లో తీర్థంకరుల మోక్ష స్థలం ‘సమ్మేద్ శిఖర్జీ’.. ఇప్పుడెలా వార్తల్లోకెక్కింది!
‘సమ్మేద్ శిఖర్జీ’ (Sammed Shikharji).. ఇటీవల జైనులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ దాన్ని తమ పవిత్ర స్థలంగా గుర్తించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో తెలుసుకోండి.
సమ్మేద్ శిఖర్జీ’ (Sammed Shikharji).. ఇటీవల దేశవ్యాప్తంగా జైనులు (jain) ఆందోళనలు జరపడంతో ఈ పేరు బాగా వినిపించింది. ఈ స్థలం ఎక్కడుంది? దాన్ని తమ పవిత్రస్థలంగా గుర్తించాలని జైనులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారో తెలుసుకోండి.
(Image credit : Google map)
జైనులకు ఇది ఎందుకు పవిత్ర స్థలం ?
పార్శ్నాథ్ ఝార్ఖండ్(jharkhand)లోనే ఎత్తయిన పర్వతం. గిరిధ్ జిల్లాలో పార్శ్నాథ్ కొండపై సమ్మేద్ శిఖర్జీ(Sammed Shikharji) ఉంది. జైన మతం ఆచరించే దిగంబర, శ్వేతాంబరులకు ఇది ముఖ్యమైన జైనతీర్థం. 24 మంది జైన తీర్థంకరులలో 20 మంది ఇక్కడ మోక్షం సాధించినట్టు చెబుతుంటారు. సమ్మేద్ శిఖర్జీ(Sammed Shikharji) మాత్రమే కాకుండా గిర్నార్(గుజరాత్), దిల్వారా(రాజస్థాన్), పాలిటనా(గుజరాత్), అష్టపద్ కైలాస్(చైనాలోని టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం) వంటివి జైనులకు ముఖ్యమైన ఆరాధన ప్రదేశాలు.
మద్యం, మాంసంతో మొదలైన వివాదం
2019లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పార్శ్నాథ్ అభయారణ్యాన్ని అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా గుర్తించింది. దీంతో అక్కడికి పర్యాటకులను ఆకర్షించే విధంగా 2022 జులైలో ఝార్ఖండ్(jharkhand) రాష్ట్ర ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చింది. అప్పటి నుంచి పార్శ్నాథ్ కొండకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగింది. వారిపై సరైన నియంత్రణ లేకపోవడంతో మాంసం, మద్యం తదితర అసాంఘిక కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇటీవల నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పలు చోట్ల ఎముకలు కన్పించడం జైనుల ఆగ్రహానికి కారణమైంది.
చైతన్యవంతంగా నిరసన
2011 లెక్కల ప్రకారం దేశంలో జైనుల జనాభా(jain population) 44,51,753. అంటే భారతదేశంలోని మొత్తం జనాభాలో వీరు 1% కూడా లేరు. కానీ జైనుల్లో అక్షరాస్యత శాతం ఎక్కువ. వివిధ హోదాల్లో కొందరు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపార రంగంలోనూ జైనులు తమదైన ముద్ర వేశారు. తమ పవిత్ర స్థలానికి భంగం వాటిళ్లుతోందని తెలియగానే వేగంగా ప్రతిస్పందించారు. దిల్లీ(delhi), అహ్మదాబాద్(ahmedabad), కోల్కతా వంటి ముఖ్య నగరాల్లో ఆందోళనలు మొదలుపెట్టారు. క్రమంగా ఈ నిరసనలు మన తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా విస్తరించాయి. ఇద్దరు గురువులు నిరాహార దీక్ష దిగి ప్రాణాలు విడిచారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి ఎకో టూరిజం ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేశాయి.
ఎకో సెన్సిటివ్ జోన్పై పర్యవేక్షణ కమిటీ
సమ్మేద్ శిఖర్జీపై వివాదం తలెత్తడంతో ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ణయంపై ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఇద్దరు జైనులు, ఒక ఆదివాసీ సభ్యుడిగా ఉంటారని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) వెల్లడించారు. సమ్మేద్ శిఖర్జీ పవిత్రతకు భంగం వాటిల్లకుండా కొండపై చర్యలు చేపట్టాలని కేంద్రం.. ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పార్శ్నాథ్పై మద్యం, మాంసాహార విక్రయాలపై నిషేధం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, ట్రెక్కింగ్ వంటివి లేకుండా చూడాలని సూచించింది.
కొండపై ముదురుతున్న వివాదం
కేంద్రం ఎకో టూరిజం పాలసీపై స్టే విధించడంపై అక్కడ నివాసం ఉంటున్న ఆదివాసీ నేతలు మండిపడుతున్నారు. ‘ఆ ప్రాంతం మాకు చెందినది. గత కొన్ని దశాబ్దాలుగా మేము జైనుల మత విశ్వాసాలను గౌరవిస్తున్నాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మా సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. సమ్మేద్ శిఖర్జీకి 10 కిలోమీటర్లకు దూరంలో ఉన్న గ్రామాలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు.ఆదివాసీలకు కూడా ఈ కొండ పవిత్రమైనది. మాకూ హక్కులున్నాయనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇది జైనుల మత ప్రదేశమని ప్రకటిస్తే.. ఆదివాసీల తీర్థయాత్ర ప్రదేశంగా కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఆదివాసీలు ఇక్కడే ఉంటూ వారి ఆచారాలను కొనసాగించేలా చూడాలంటూ’ ఆదివాసీ హక్కుల పోరాట నేత సికందర్ హెంబ్రోం వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?