Flights - Alcohol: అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో మద్యం సరఫరా ఎందుకు?
మద్యం అనర్థదాయకం. అయినా కూడా అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాల్లో మద్యం పంపిణీ చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో చదివేయండి!
ఇటీవల పలు అంతర్జాతీయ విమాన(International flights) ప్రయాణాల్లో మందుబాబులు చేసిన హల్చల్ చర్చనీయాంశమైంది. మద్యం మత్తులో తోటి ప్రయాణికులపైనే మూత్రం విసర్జన చేయడం, అనుచితంగా ప్రవర్తించడం, ఎయిర్ హోస్టెస్లతో వాదనకు దిగడం, విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వారిలో చాలా మంది మద్యం మత్తులోనే అలాంటి విపరీత పోకడలకు పోయారని తెలిసింది. అయితే ఇన్ని గొడవలకు కారణమవుతుందని తెలిసీ విమానంలో మద్యాన్ని ఎందుకు సరఫరా చేస్తారంటే...
విమాన ప్రయాణం ఒక విలాసం. అందులో ఎక్కువగా ఖర్చుకు వెనుకాడని ధనవంతులే ప్రయాణిస్తుంటారు. వారికి మరిన్ని సౌకర్యాలు సమకూరిస్తే మరింత ఆదాయం పొందవచ్చనేది విమాన సంస్థల ఆలోచన. అందుకే ఎకానమీ, బిజినెస్ క్లాసులను బట్టి మద్యం (alcohol) సరఫరా చేసి లాభాలను ఆర్జిస్తుంటాయి. ఇదివరకు కొన్ని విమాన సంస్థలు తమ ప్రయాణికుల (passenger)కు మద్యం (liquor) మాత్రమే కాకుండా.. రాజభోగాలు సమకూర్చాయి. అనుకోకుండా తమ సంస్థ విమానాలు రద్దయితే టికెట్ (ticket) రేటుతో సంబంధం లేకుండా ఫైవ్స్టార్ హోటల్స్లో బస ఏర్పాటు చేశాయి. ఎందుకంటే వాటి మధ్య ఉన్న పోటీతత్వం. ప్రయాణికుల (customers) మనసులో చోటు సంపాదిస్తే ఎప్పుడూ తమ సంస్థ విమానాల్లోనే ప్రయాణిస్తారని వారి నమ్మకం. ఇలా అనవసర ఆర్భాటాలతో ‘గాల్లో విమానాలు’ నడిపి ఆ సంస్థలు నష్టాలను చవి చూసి చివరికి చేతులు కాల్చుకున్న ఘటనలు ఉన్నాయి.
మద్యం అందించడం వెనుక కారణాలేంటి?
మద్యం పంపిణీ చేయడం వెనుక కంపెనీ పబ్లిసిటీ, లాభాపేక్ష తప్పితే ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. విమాన టికెట్లో మద్యంపై కొంత మొత్తాన్ని ముందుగానే వసూలు చేస్తారు. దీంతో ఆ విమాన సంస్థకు ఆదాయం లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలకు కచ్చితంగా కొన్ని గంటల సమయం పడుతుంది. అందువల్ల కొంత మంది మద్యం, ఆహారం తీసుకుంటే ప్రయాణం బోర్ కొట్టదని భావిస్తారు. ఇక మద్యం తీసుకున్న ప్రయాణికులు నిద్రలోకి జారుకునే అవకాశాలు ఎక్కువ. దాంతో ఎయిర్లైన్స్ సిబ్బంది అందించాల్సిన సేవలు తగ్గుతాయి. మత్తులో ఉండటం వల్ల.. ప్రయాణికులు తరచూ సమయం చూడటం తగ్గుతుంది. తమకు అందుతున్న సేవలపై, ప్రయాణంలో లోపాలపై ప్రశ్నించడానికి ఆసక్తి చూపించరు.
రెడ్ కేటగిరీ ప్రయాణికులతోనే ఇబ్బంది
మద్యం తీసుకున్న చాలా మంది ప్రయాణికులు గ్రీన్ కేటగిరికి చెంది ఉంటారు. అంటే వీరు హద్దుల్లో ఉంటారు. ఎంత మొత్తం తాగాలి.. అది ఎంత సేపు తమ శరీరంపై ప్రభావం చూపుతుంది అనే స్పష్టమైన ఆలోచన ఉంటుంది. తాము మోతాదుకు మించి తాగుతున్నామని తెలియగానే కచ్చితంగా ఆపేస్తారు. రెండోది ఎల్లో కేటగిరి. వీరు పరిస్థితులు అదుపుతప్పితేనే అతిగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. మూడోది విపరీత పోకడలకు పాల్పడేవారు. వీరిని రెడ్ కేటగిరీ కింద చూస్తారు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గొడవ చేయడం, మూత్ర విసర్జన చేయడం, అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఇబ్బందులు ఇలాంటి వారి వల్లే ఎదురవుతాయి. ఇలా మూడు కేటగిరీల ప్రయాణికులను గుర్తించి.. అతి చేసేవారిని నియంత్రించేలా విమానయాన సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తారు. తాజాగా మన దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా తమ సిబ్బందికి ఇలాంటి సూచనలే చేసింది.
సర్వేలు ఏం చెబుతున్నాయి!
విమాన ప్రయాణాల్లో ఎక్కువ మంది ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వేలు చేపట్టాయి. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎంత విమాన ప్రయాణమైనా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే ఎక్కువ సమయమే తీసుకుంటుంది. అంత సమయం ఏం చేయాలో తోచక చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఇష్టపడతున్నారట. 10 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో దాదాపు 8 మంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. ఇక వయసు పైబడిన వారితో పోలిస్తే యువకులు ప్రయాణం పట్ల ఆందోళనకు గురై ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారని తెలిసింది. విమానంలో పీడనం సముద్ర పీడనానికి కంటే 4శాతం తక్కువగా ఉంటుంది. దాంతో ప్రయాణికుల శరీరంలో ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది. ఆ సమయంలో మద్యం తీసుకున్న ప్రయాణికులకు కిక్ ఎక్కని భావన కలుగుతుంది. ఇంకాస్త తాగినా.. తమకు ఏమీ కాదనే అభిప్రాయంతో ఎయిర్హోస్టెస్లను మద్యం అడుగుతుంటారు. అయితే వారికి రక్తంలో కలిసిన ఆల్కహాల్ ప్రభావం విమానం నేలపై ల్యాండ్ అయిన తరువాత తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆ విమానాలు మద్యానికి దూరం
ప్రయాణికులకు తప్పనిసరిగా మద్యం ఇవ్వాలని నిబంధనలు ఏమీ లేవు. దీంతో కొన్ని విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు మద్యం అందించవు. చాలా మధ్య ప్రాచ్య దేశాల విమాన సంస్థలు.. ప్రయాణాల్లో ఆల్కహాల్ తాగడాన్ని నిషేధించాయి. అవి ముస్లిం దేశాలకు చెందినవి కావడం కూడా ఒక కారణం. దాంతో ఎయిర్ అరేబియా, ఈజిప్ట్ ఎయిర్, ఇరాన్ ఎయిర్, ఇరాకీ ఎయిర్ వేస్, కువైట్ ఎయిర్ వేస్, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్, రాయల్ బ్రూనై ఎయిర్లైన్స్, సౌదియా విమాన కంపెనీలు మద్య నిషేధం అమలు చేస్తున్నాయి.
మన దేశీయ ప్రయాణాల్లో ‘నో’
మన దేశంలోనూ ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే విమానాల్లో(domestic flights) మద్యం తాగడానికి అనుమతించరు. మద్యం పోయరు. అయితే పరిమిత సంఖ్యలో మద్యం సీసాల రవాణాకు మాత్రం అనుమతిస్తారు. ఇలాగే టర్కీ, చైనా కూడా తమ దేశీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ను అనుమతించవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.