Flights - Alcohol: అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో మద్యం సరఫరా ఎందుకు?
మద్యం అనర్థదాయకం. అయినా కూడా అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాల్లో మద్యం పంపిణీ చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో చదివేయండి!
ఇటీవల పలు అంతర్జాతీయ విమాన(International flights) ప్రయాణాల్లో మందుబాబులు చేసిన హల్చల్ చర్చనీయాంశమైంది. మద్యం మత్తులో తోటి ప్రయాణికులపైనే మూత్రం విసర్జన చేయడం, అనుచితంగా ప్రవర్తించడం, ఎయిర్ హోస్టెస్లతో వాదనకు దిగడం, విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వారిలో చాలా మంది మద్యం మత్తులోనే అలాంటి విపరీత పోకడలకు పోయారని తెలిసింది. అయితే ఇన్ని గొడవలకు కారణమవుతుందని తెలిసీ విమానంలో మద్యాన్ని ఎందుకు సరఫరా చేస్తారంటే...
విమాన ప్రయాణం ఒక విలాసం. అందులో ఎక్కువగా ఖర్చుకు వెనుకాడని ధనవంతులే ప్రయాణిస్తుంటారు. వారికి మరిన్ని సౌకర్యాలు సమకూరిస్తే మరింత ఆదాయం పొందవచ్చనేది విమాన సంస్థల ఆలోచన. అందుకే ఎకానమీ, బిజినెస్ క్లాసులను బట్టి మద్యం (alcohol) సరఫరా చేసి లాభాలను ఆర్జిస్తుంటాయి. ఇదివరకు కొన్ని విమాన సంస్థలు తమ ప్రయాణికుల (passenger)కు మద్యం (liquor) మాత్రమే కాకుండా.. రాజభోగాలు సమకూర్చాయి. అనుకోకుండా తమ సంస్థ విమానాలు రద్దయితే టికెట్ (ticket) రేటుతో సంబంధం లేకుండా ఫైవ్స్టార్ హోటల్స్లో బస ఏర్పాటు చేశాయి. ఎందుకంటే వాటి మధ్య ఉన్న పోటీతత్వం. ప్రయాణికుల (customers) మనసులో చోటు సంపాదిస్తే ఎప్పుడూ తమ సంస్థ విమానాల్లోనే ప్రయాణిస్తారని వారి నమ్మకం. ఇలా అనవసర ఆర్భాటాలతో ‘గాల్లో విమానాలు’ నడిపి ఆ సంస్థలు నష్టాలను చవి చూసి చివరికి చేతులు కాల్చుకున్న ఘటనలు ఉన్నాయి.
మద్యం అందించడం వెనుక కారణాలేంటి?
మద్యం పంపిణీ చేయడం వెనుక కంపెనీ పబ్లిసిటీ, లాభాపేక్ష తప్పితే ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. విమాన టికెట్లో మద్యంపై కొంత మొత్తాన్ని ముందుగానే వసూలు చేస్తారు. దీంతో ఆ విమాన సంస్థకు ఆదాయం లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలకు కచ్చితంగా కొన్ని గంటల సమయం పడుతుంది. అందువల్ల కొంత మంది మద్యం, ఆహారం తీసుకుంటే ప్రయాణం బోర్ కొట్టదని భావిస్తారు. ఇక మద్యం తీసుకున్న ప్రయాణికులు నిద్రలోకి జారుకునే అవకాశాలు ఎక్కువ. దాంతో ఎయిర్లైన్స్ సిబ్బంది అందించాల్సిన సేవలు తగ్గుతాయి. మత్తులో ఉండటం వల్ల.. ప్రయాణికులు తరచూ సమయం చూడటం తగ్గుతుంది. తమకు అందుతున్న సేవలపై, ప్రయాణంలో లోపాలపై ప్రశ్నించడానికి ఆసక్తి చూపించరు.
రెడ్ కేటగిరీ ప్రయాణికులతోనే ఇబ్బంది
మద్యం తీసుకున్న చాలా మంది ప్రయాణికులు గ్రీన్ కేటగిరికి చెంది ఉంటారు. అంటే వీరు హద్దుల్లో ఉంటారు. ఎంత మొత్తం తాగాలి.. అది ఎంత సేపు తమ శరీరంపై ప్రభావం చూపుతుంది అనే స్పష్టమైన ఆలోచన ఉంటుంది. తాము మోతాదుకు మించి తాగుతున్నామని తెలియగానే కచ్చితంగా ఆపేస్తారు. రెండోది ఎల్లో కేటగిరి. వీరు పరిస్థితులు అదుపుతప్పితేనే అతిగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. మూడోది విపరీత పోకడలకు పాల్పడేవారు. వీరిని రెడ్ కేటగిరీ కింద చూస్తారు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గొడవ చేయడం, మూత్ర విసర్జన చేయడం, అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఇబ్బందులు ఇలాంటి వారి వల్లే ఎదురవుతాయి. ఇలా మూడు కేటగిరీల ప్రయాణికులను గుర్తించి.. అతి చేసేవారిని నియంత్రించేలా విమానయాన సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తారు. తాజాగా మన దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా తమ సిబ్బందికి ఇలాంటి సూచనలే చేసింది.
సర్వేలు ఏం చెబుతున్నాయి!
విమాన ప్రయాణాల్లో ఎక్కువ మంది ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వేలు చేపట్టాయి. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎంత విమాన ప్రయాణమైనా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే ఎక్కువ సమయమే తీసుకుంటుంది. అంత సమయం ఏం చేయాలో తోచక చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఇష్టపడతున్నారట. 10 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో దాదాపు 8 మంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. ఇక వయసు పైబడిన వారితో పోలిస్తే యువకులు ప్రయాణం పట్ల ఆందోళనకు గురై ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారని తెలిసింది. విమానంలో పీడనం సముద్ర పీడనానికి కంటే 4శాతం తక్కువగా ఉంటుంది. దాంతో ప్రయాణికుల శరీరంలో ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది. ఆ సమయంలో మద్యం తీసుకున్న ప్రయాణికులకు కిక్ ఎక్కని భావన కలుగుతుంది. ఇంకాస్త తాగినా.. తమకు ఏమీ కాదనే అభిప్రాయంతో ఎయిర్హోస్టెస్లను మద్యం అడుగుతుంటారు. అయితే వారికి రక్తంలో కలిసిన ఆల్కహాల్ ప్రభావం విమానం నేలపై ల్యాండ్ అయిన తరువాత తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆ విమానాలు మద్యానికి దూరం
ప్రయాణికులకు తప్పనిసరిగా మద్యం ఇవ్వాలని నిబంధనలు ఏమీ లేవు. దీంతో కొన్ని విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు మద్యం అందించవు. చాలా మధ్య ప్రాచ్య దేశాల విమాన సంస్థలు.. ప్రయాణాల్లో ఆల్కహాల్ తాగడాన్ని నిషేధించాయి. అవి ముస్లిం దేశాలకు చెందినవి కావడం కూడా ఒక కారణం. దాంతో ఎయిర్ అరేబియా, ఈజిప్ట్ ఎయిర్, ఇరాన్ ఎయిర్, ఇరాకీ ఎయిర్ వేస్, కువైట్ ఎయిర్ వేస్, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్, రాయల్ బ్రూనై ఎయిర్లైన్స్, సౌదియా విమాన కంపెనీలు మద్య నిషేధం అమలు చేస్తున్నాయి.
మన దేశీయ ప్రయాణాల్లో ‘నో’
మన దేశంలోనూ ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే విమానాల్లో(domestic flights) మద్యం తాగడానికి అనుమతించరు. మద్యం పోయరు. అయితే పరిమిత సంఖ్యలో మద్యం సీసాల రవాణాకు మాత్రం అనుమతిస్తారు. ఇలాగే టర్కీ, చైనా కూడా తమ దేశీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ను అనుమతించవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్