MiG-21 : అనేక ప్రమాదాలు.. అయినా ‘మిగ్ ’యుద్ధ విమానాలే శరణ్యం ..!
భారత వాయుసేనకు (Indian Air Force)చెందిన మిగ్-21 (MiG-21) యుద్ధ విమానాలు తరచూ కూలిపోయి వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ పాతతరం యుద్ధ విమానాలను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలుసుకోండి.
ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా భారత వైమానిక దళానికి (Indian Air Force) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అత్యంత అధునాతన ఆయుధ సంపత్తిని ఈ దళం వినియోగించుకుంటోంది. అయినప్పటికీ మిగ్-21 వంటి పాతతరం విమానాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్లోని (Rajasthan)హనుమాన్గఢ్లోని పొలాల్లో మిగ్-21 (MiG-21) శిక్షణ యుద్ధవిమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. కాగా ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మిగ్-21లు ఎందుకు ఎక్కువగా కూలిపోతున్నాయి. వాటిని ఇంకా వాయుసేన ఎందుకు కొనసాగిస్తుందో తెలుసుకోండి.
సగం కూలిపోయాయి!
1985లోనే సోవియట్ యూనియన్ మిగ్-21లను తమ దళం నుంచి తొలగించింది. బంగ్లాదేశ్ కూడా వాటిని పక్కన పెట్టింది. భారత్ వాయుసేనలో మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని పలువురు రాజకీయ నేతలు, మాజీ వైమానిక దళ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాలున్నాయి. కానీ, వాటి సంఖ్య చాలా పరిమితం. దాంతో భారత వాయుసేన అవసరాలు తీరడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ రూపొందించిన ఈ మిగ్-21లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న 872 మిగ్ విమానాల్లో సగానికిపైగా కూలిపోయినట్లు 2012లోనే నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు. నాటి లెక్కల ప్రకారమే 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మృతి చెందారు. ఇటీవలి కాలంలో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఆ సంఖ్య మరింతగా పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రత్యామ్నాయం కరవు
ప్రస్తుతం వాయుసేనలో సుమారు 32 స్క్వాడ్రన్లు ఉన్నాయి. అయితే వాస్తవానికి 42 స్క్వాడ్రన్ల అవసరం ఉంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అదనపు స్వ్కాడ్రన్లను ప్రవేశపెట్టుకోవాల్సి ఉంది. అందుబాటులో ఉన్న స్క్వాడ్రన్లలో పాతతరం యుద్ధ విమానాలు మిగ్-21, జాగ్వార్, మిరాజ్ రకానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి. ఉన్నపళంగా వాటిని తొలగించడం కుదరని పని. 7 మిగ్-21 స్క్వాడ్రన్లు ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వాటిలో నాలుగింటిని 2025 నాటికి తొలగిస్తారని సమాచారం.
పాతవే అయినా..
మిగ్-21లు పేరుకు పాతతరం విమానాలే అయినా వాటిలో వాడుతున్న సాంకేతికత చాలా అధునాతనమైనది. అందుకే వాటిని ‘మిగ్-21 బైసన్’అని పిలుస్తుంటారు. 1963లో ప్రవేశపెట్టిన మిగ్లకు ఇప్పటి మిగ్లకు చాలా వైవిధ్యం ఉంది. సరికొత్త ఏవియానిక్స్, ఆయుధ రవాణా సామర్థ్యం జోడించిన కారణంగా ఇవి సురక్షితమని చెప్పేవారూ లేకపోలేదు. అనేక ప్రమాదాలకు కారణం కేవలం అవి పాతబడిపోవడం మాత్రమే కాదని చెబుతున్నారు.
భారత వాయుసేన నివేదికల ప్రకారం.. మిగ్-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి. 1971 యుద్ధంలో ఇండియాకు అద్భుత విజయం చేకూరడం వెనుక మిగ్ల కృషి దాగి ఉంది. అందుకే వీటితోనే కొత్తగా వాయుసేనలో చేరిన పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కువగా సేవలందించడం, శిక్షణలో పాల్గొనడం కారణంగా మిగ్-21లు కూలిపోతున్న ఘటనలు కూడా ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. నూతనంగా అందుబాటులోకి వచ్చిన తేజస్, రఫేల్లను శిక్షణలో వినియోగిస్తే ఖర్చు పెరిగిపోతుంది. అందుకే మిగ్-21లను వినియోగిస్తున్నారు.
‘తేజస్’ల రాక ఆలస్యం
మిగ్-21ల స్థానాన్ని భర్తీ చేయడానికి 1980 ప్రాంతంలోనే భారత ప్రభుత్వం (లైట్ కొంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) ఎల్సీఏ ప్రాజెక్టును చేపట్టింది. హాల్తో కలిసి సుదీర్ఘ పరిశోధన అనంతరం తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను మనం సొంతంగా రూపొందించుకోగలిగాము. 2016 నాటికి తేజస్లు స్క్వాడ్రన్లలో చేరిపోయాయి. సుమారు 123 తేజస్ విమానాల కోసం ఆర్డర్ చేయగా 30 వరకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వాటితో రెండు స్క్వాడ్రన్లు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుంది. సుమారు 90 తేజస్ విమానాల రాక ఆలస్యం కావడంతో మిగ్-21లను వాయుసేన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తగ్గిన రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య
ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం ద్వారా లోటు భర్తీ చేయవచ్చని తొలుత భావించారు. 126 విమానాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా 2016లో కేంద్రప్రభుత్వం 36 మాత్రమే ఆర్డర్ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!