MiG-21 : అనేక ప్రమాదాలు.. అయినా ‘మిగ్ ’యుద్ధ విమానాలే శరణ్యం ..!
భారత వాయుసేనకు (Indian Air Force)చెందిన మిగ్-21 (MiG-21) యుద్ధ విమానాలు తరచూ కూలిపోయి వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ పాతతరం యుద్ధ విమానాలను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలుసుకోండి.
ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా భారత వైమానిక దళానికి (Indian Air Force) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అత్యంత అధునాతన ఆయుధ సంపత్తిని ఈ దళం వినియోగించుకుంటోంది. అయినప్పటికీ మిగ్-21 వంటి పాతతరం విమానాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్లోని (Rajasthan)హనుమాన్గఢ్లోని పొలాల్లో మిగ్-21 (MiG-21) శిక్షణ యుద్ధవిమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. కాగా ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మిగ్-21లు ఎందుకు ఎక్కువగా కూలిపోతున్నాయి. వాటిని ఇంకా వాయుసేన ఎందుకు కొనసాగిస్తుందో తెలుసుకోండి.
సగం కూలిపోయాయి!
1985లోనే సోవియట్ యూనియన్ మిగ్-21లను తమ దళం నుంచి తొలగించింది. బంగ్లాదేశ్ కూడా వాటిని పక్కన పెట్టింది. భారత్ వాయుసేనలో మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని పలువురు రాజకీయ నేతలు, మాజీ వైమానిక దళ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాలున్నాయి. కానీ, వాటి సంఖ్య చాలా పరిమితం. దాంతో భారత వాయుసేన అవసరాలు తీరడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ రూపొందించిన ఈ మిగ్-21లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న 872 మిగ్ విమానాల్లో సగానికిపైగా కూలిపోయినట్లు 2012లోనే నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు. నాటి లెక్కల ప్రకారమే 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మృతి చెందారు. ఇటీవలి కాలంలో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఆ సంఖ్య మరింతగా పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రత్యామ్నాయం కరవు
ప్రస్తుతం వాయుసేనలో సుమారు 32 స్క్వాడ్రన్లు ఉన్నాయి. అయితే వాస్తవానికి 42 స్క్వాడ్రన్ల అవసరం ఉంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అదనపు స్వ్కాడ్రన్లను ప్రవేశపెట్టుకోవాల్సి ఉంది. అందుబాటులో ఉన్న స్క్వాడ్రన్లలో పాతతరం యుద్ధ విమానాలు మిగ్-21, జాగ్వార్, మిరాజ్ రకానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి. ఉన్నపళంగా వాటిని తొలగించడం కుదరని పని. 7 మిగ్-21 స్క్వాడ్రన్లు ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వాటిలో నాలుగింటిని 2025 నాటికి తొలగిస్తారని సమాచారం.
పాతవే అయినా..
మిగ్-21లు పేరుకు పాతతరం విమానాలే అయినా వాటిలో వాడుతున్న సాంకేతికత చాలా అధునాతనమైనది. అందుకే వాటిని ‘మిగ్-21 బైసన్’అని పిలుస్తుంటారు. 1963లో ప్రవేశపెట్టిన మిగ్లకు ఇప్పటి మిగ్లకు చాలా వైవిధ్యం ఉంది. సరికొత్త ఏవియానిక్స్, ఆయుధ రవాణా సామర్థ్యం జోడించిన కారణంగా ఇవి సురక్షితమని చెప్పేవారూ లేకపోలేదు. అనేక ప్రమాదాలకు కారణం కేవలం అవి పాతబడిపోవడం మాత్రమే కాదని చెబుతున్నారు.
భారత వాయుసేన నివేదికల ప్రకారం.. మిగ్-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి. 1971 యుద్ధంలో ఇండియాకు అద్భుత విజయం చేకూరడం వెనుక మిగ్ల కృషి దాగి ఉంది. అందుకే వీటితోనే కొత్తగా వాయుసేనలో చేరిన పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కువగా సేవలందించడం, శిక్షణలో పాల్గొనడం కారణంగా మిగ్-21లు కూలిపోతున్న ఘటనలు కూడా ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. నూతనంగా అందుబాటులోకి వచ్చిన తేజస్, రఫేల్లను శిక్షణలో వినియోగిస్తే ఖర్చు పెరిగిపోతుంది. అందుకే మిగ్-21లను వినియోగిస్తున్నారు.
‘తేజస్’ల రాక ఆలస్యం
మిగ్-21ల స్థానాన్ని భర్తీ చేయడానికి 1980 ప్రాంతంలోనే భారత ప్రభుత్వం (లైట్ కొంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) ఎల్సీఏ ప్రాజెక్టును చేపట్టింది. హాల్తో కలిసి సుదీర్ఘ పరిశోధన అనంతరం తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను మనం సొంతంగా రూపొందించుకోగలిగాము. 2016 నాటికి తేజస్లు స్క్వాడ్రన్లలో చేరిపోయాయి. సుమారు 123 తేజస్ విమానాల కోసం ఆర్డర్ చేయగా 30 వరకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వాటితో రెండు స్క్వాడ్రన్లు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుంది. సుమారు 90 తేజస్ విమానాల రాక ఆలస్యం కావడంతో మిగ్-21లను వాయుసేన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తగ్గిన రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య
ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం ద్వారా లోటు భర్తీ చేయవచ్చని తొలుత భావించారు. 126 విమానాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా 2016లో కేంద్రప్రభుత్వం 36 మాత్రమే ఆర్డర్ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!