India population : చైనాను వెనక్కి నెట్టి మనమే నం.1.. ఎలా సాధ్యమైందంటే!
భారత జనాభా (India population) 142.86 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్య సమితి (United nations) ప్రకటించింది. అంతలా మన దేశ జనాభా పెరగడానికి గల కారణాలివి.
ప్రపంచంలో (World) అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్ (India) అవతరించింది. ఇప్పటిదాకా నంబరు 1గా నిలిచిన చైనాను (China) దాటేసింది. మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి (United nations) ప్రపంచ జనాభా డాష్ బోర్డు ఇప్పుడు భారత్ను అత్యధిక జనాభా కలిగిన దేశంగా చూపిస్తోంది. అదెలా సాధ్యమైందో చదివేయండి.
కచ్చితమైన లెక్కలు
1950వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా లెక్కలను సేకరించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఒక్క భారత్లోనే సుమారు వంద కోట్ల జనాభా పెరిగింది. గతంలో మన దేశంలో ఎంత మంది శిశువులు జన్మిస్తున్నారనే విషయంపై కచ్చితమైన డేటా అందుబాటులో ఉండేది కాదు. ఇటీవలి కాలంలో స్థానిక ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. దాంతో మనం చైనాను దాటేయబోతున్నామనే విషయం ఈ ఫిబ్రవరిలోనే సూచన ప్రాయంగా తెలిసింది. చైనాలో వృద్ధ జనాభా అధికంగా ఉంది. దాంతో అక్కడ జనాభా పెరుగుదల అసాధ్యం. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఇప్పట్లో భారత జనాభా పెరుగుదల ఆగదని తెలుస్తోంది. మధ్యస్తంగా జననాలు సంభవించినా ఈ దశాబ్దం చివరికల్లా 150 కోట్ల జనాభా, 2064 కల్లా 170 కోట్ల మంది భారత్లో ఉంటారని ఐరాస అంచనా వేస్తోంది.
యువత పెళ్లి వైపు అడుగులు
ప్రపంచవ్యాప్తంగా 25 సంవత్సరాల వయసున్న ఐదుగురిలో ఒకరు భారతీయులే. దేశ జనాభాలో యువత 40 శాతం దాకా ఉన్నారు. యుక్త వయసులోని వారంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కంటున్నారు. యువ దంపతులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరికి జన్మనిస్తున్నారు. అందువల్ల పెరుగుదల కన్పిస్తోంది. కాస్త మధ్య వయసు మన దేశంలో 28 కాగా.. అమెరికాలో 38, చైనాలో 39గా ఉంది.
స్వల్పంగానే వృద్ధుల సంఖ్య
తాజా గణాంకాల ప్రకారం భారత్ తరువాతి స్థానంలో జనాభా కలిగిన దేశాలు చైనా, అమెరికా. మన దేశంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 7 శాతం మాత్రమే. అదే చైనాలో 14 శాతం, అమెరికాలో 18 శాతం దాకా ఉన్నారు. అమెరికా అంచనా ప్రకారం 2063 నాటికి కూడా మన దేశంలో వృద్ధ జనాభా 20 శాతం లోపే ఉంటారట.
సంతానోత్పత్తి రేటు
భారత్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది. ఇక్కడ ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగలుగుతోంది. అదే చైనాలో (1.2), అమెరికాలో (1.6)గా ఉంది. 1950 కాలంలో ఒక్కో భారతీయ మహిళ 5.9 మందికి జన్మనివ్వగలిగేదట. కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడంతో క్రమంగా పిల్లలను కనడం తగ్గించారు. 1999లో 4.4 ఉన్న సంతానోత్పత్తి రేటు 2019 కల్లా 2.4కు తగ్గింది. మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కుటుంబ నియంత్రణ పద్ధతులపై శ్రద్ధ కనబరుస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా వెల్లడైంది. ముస్లింలలో మాత్రం సంతానోత్పత్తి రేటు మిగతా వర్గాలతో పోలిస్తే అధికంగానే ఉన్నట్లు తేలింది.
వ్యత్యాసం భర్తీ
పట్టణాలు, గ్రామాల మధ్య కూడా సంతానోత్పత్తి రేటులో వ్యత్యాసం ఉంటోంది. అధిక సంతానంతో పట్టణాల్లో నెగ్గుకురావడం కష్టం. అందుకే అక్కడ ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేందుకు మొగ్గు చూపరు. కొన్ని రాష్ట్రాల్లోని దంపతులు కూడా ‘ఒకరు ముద్దు.. ఇద్దరు వద్దని’ పెళ్లయిన కొత్తలోనే నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఏర్పడిన వ్యత్యాసాన్ని ఉత్తరప్రదేశ్, మేఘాలయా, మణిపుర్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలు భర్తీ చేస్తున్నాయి. బిహార్లో ఇప్పటికీ సంతానోత్పత్తి రేటు 2.98గా ఉంది.
గ్రామీణ మహిళలు
గ్రామీణ ప్రాంత మహిళలు 20.8 ఏళ్లకు తొలిబిడ్డకు జన్మనిస్తే.. పట్టణ ప్రాంతాల స్త్రీలు 22.3 ఏళ్లకు ప్రసవిస్తున్నారు. అక్షరాస్యత ఉండి, కాస్త సంపన్నులైన స్త్రీలు ఆలస్యంగా పిల్లలను కనేందుకు ఇష్టపడుతున్నారు. వారితో పోలిస్తే గ్రామీణుల సంఖ్య ఎక్కువే కాబట్టి అధిక జననాలు సంభవిస్తున్నాయి. పేదరికం వల్ల కూడా కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో వారు తొందరగా బిడ్డలకు జన్మనిస్తున్నారు.
అమ్మాయిల సంఖ్య పెరుగుదల
గతంలో కొందరు ఆడపిల్లలను కనడానికి ఇష్టపడేవారు కాదు. అక్రమ లింగ నిర్ధారణ పద్ధతుల ద్వారా భ్రూణ హత్యలు పెరగడంతో స్త్రీ, పురుషుల వ్యత్యాసం ఏర్పడింది. కఠినమైన చట్టాలు చేయడం ద్వారా ప్రభుత్వాలు లింగ నిర్ధారణ పరీక్షలు లేకుండా చేయగలిగాయి. ఫలితంగా అబ్బాయిలకు సమానంగా అమ్మాయిల సంఖ్య దగ్గరవుతూ వస్తోంది. 2011లో జరిపిన సర్వే ప్రకారం.. 111 మంది అబ్బాయిలకు 100 అమ్మాయిలుండేవారు. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలున్నారు.
శిశు మరణాలు తగ్గుముఖం
గత మూడు దశాబ్దాల్లో శిశు మరణాలు 70 శాతం వరకు తగ్గాయి. 1990లో వెయ్యి మంది శిశువులు జన్మిస్తే 89 మరణాలుండేవి. 2020 నాటికి ఆ సంఖ్య 27కు పడిపోయింది. అయితే నేపాల్, భూటాన్, శ్రీలంక, చైనా, అమెరికాలో ఈ మరణాల సంఖ్య ఇంకా కనిష్ఠ స్థాయిలో ఉంది. గర్భిణులకు పోషకాహారం పంపిణీ, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరచడం వంటి చర్యలతో శిశు మరణాలను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్