India population : చైనాను వెనక్కి నెట్టి మనమే నం.1.. ఎలా సాధ్యమైందంటే!
భారత జనాభా (India population) 142.86 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్య సమితి (United nations) ప్రకటించింది. అంతలా మన దేశ జనాభా పెరగడానికి గల కారణాలివి.
ప్రపంచంలో (World) అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్ (India) అవతరించింది. ఇప్పటిదాకా నంబరు 1గా నిలిచిన చైనాను (China) దాటేసింది. మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి (United nations) ప్రపంచ జనాభా డాష్ బోర్డు ఇప్పుడు భారత్ను అత్యధిక జనాభా కలిగిన దేశంగా చూపిస్తోంది. అదెలా సాధ్యమైందో చదివేయండి.
కచ్చితమైన లెక్కలు
1950వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా లెక్కలను సేకరించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఒక్క భారత్లోనే సుమారు వంద కోట్ల జనాభా పెరిగింది. గతంలో మన దేశంలో ఎంత మంది శిశువులు జన్మిస్తున్నారనే విషయంపై కచ్చితమైన డేటా అందుబాటులో ఉండేది కాదు. ఇటీవలి కాలంలో స్థానిక ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. దాంతో మనం చైనాను దాటేయబోతున్నామనే విషయం ఈ ఫిబ్రవరిలోనే సూచన ప్రాయంగా తెలిసింది. చైనాలో వృద్ధ జనాభా అధికంగా ఉంది. దాంతో అక్కడ జనాభా పెరుగుదల అసాధ్యం. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఇప్పట్లో భారత జనాభా పెరుగుదల ఆగదని తెలుస్తోంది. మధ్యస్తంగా జననాలు సంభవించినా ఈ దశాబ్దం చివరికల్లా 150 కోట్ల జనాభా, 2064 కల్లా 170 కోట్ల మంది భారత్లో ఉంటారని ఐరాస అంచనా వేస్తోంది.
యువత పెళ్లి వైపు అడుగులు
ప్రపంచవ్యాప్తంగా 25 సంవత్సరాల వయసున్న ఐదుగురిలో ఒకరు భారతీయులే. దేశ జనాభాలో యువత 40 శాతం దాకా ఉన్నారు. యుక్త వయసులోని వారంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కంటున్నారు. యువ దంపతులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరికి జన్మనిస్తున్నారు. అందువల్ల పెరుగుదల కన్పిస్తోంది. కాస్త మధ్య వయసు మన దేశంలో 28 కాగా.. అమెరికాలో 38, చైనాలో 39గా ఉంది.
స్వల్పంగానే వృద్ధుల సంఖ్య
తాజా గణాంకాల ప్రకారం భారత్ తరువాతి స్థానంలో జనాభా కలిగిన దేశాలు చైనా, అమెరికా. మన దేశంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 7 శాతం మాత్రమే. అదే చైనాలో 14 శాతం, అమెరికాలో 18 శాతం దాకా ఉన్నారు. అమెరికా అంచనా ప్రకారం 2063 నాటికి కూడా మన దేశంలో వృద్ధ జనాభా 20 శాతం లోపే ఉంటారట.
సంతానోత్పత్తి రేటు
భారత్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది. ఇక్కడ ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగలుగుతోంది. అదే చైనాలో (1.2), అమెరికాలో (1.6)గా ఉంది. 1950 కాలంలో ఒక్కో భారతీయ మహిళ 5.9 మందికి జన్మనివ్వగలిగేదట. కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడంతో క్రమంగా పిల్లలను కనడం తగ్గించారు. 1999లో 4.4 ఉన్న సంతానోత్పత్తి రేటు 2019 కల్లా 2.4కు తగ్గింది. మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కుటుంబ నియంత్రణ పద్ధతులపై శ్రద్ధ కనబరుస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా వెల్లడైంది. ముస్లింలలో మాత్రం సంతానోత్పత్తి రేటు మిగతా వర్గాలతో పోలిస్తే అధికంగానే ఉన్నట్లు తేలింది.
వ్యత్యాసం భర్తీ
పట్టణాలు, గ్రామాల మధ్య కూడా సంతానోత్పత్తి రేటులో వ్యత్యాసం ఉంటోంది. అధిక సంతానంతో పట్టణాల్లో నెగ్గుకురావడం కష్టం. అందుకే అక్కడ ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేందుకు మొగ్గు చూపరు. కొన్ని రాష్ట్రాల్లోని దంపతులు కూడా ‘ఒకరు ముద్దు.. ఇద్దరు వద్దని’ పెళ్లయిన కొత్తలోనే నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఏర్పడిన వ్యత్యాసాన్ని ఉత్తరప్రదేశ్, మేఘాలయా, మణిపుర్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలు భర్తీ చేస్తున్నాయి. బిహార్లో ఇప్పటికీ సంతానోత్పత్తి రేటు 2.98గా ఉంది.
గ్రామీణ మహిళలు
గ్రామీణ ప్రాంత మహిళలు 20.8 ఏళ్లకు తొలిబిడ్డకు జన్మనిస్తే.. పట్టణ ప్రాంతాల స్త్రీలు 22.3 ఏళ్లకు ప్రసవిస్తున్నారు. అక్షరాస్యత ఉండి, కాస్త సంపన్నులైన స్త్రీలు ఆలస్యంగా పిల్లలను కనేందుకు ఇష్టపడుతున్నారు. వారితో పోలిస్తే గ్రామీణుల సంఖ్య ఎక్కువే కాబట్టి అధిక జననాలు సంభవిస్తున్నాయి. పేదరికం వల్ల కూడా కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో వారు తొందరగా బిడ్డలకు జన్మనిస్తున్నారు.
అమ్మాయిల సంఖ్య పెరుగుదల
గతంలో కొందరు ఆడపిల్లలను కనడానికి ఇష్టపడేవారు కాదు. అక్రమ లింగ నిర్ధారణ పద్ధతుల ద్వారా భ్రూణ హత్యలు పెరగడంతో స్త్రీ, పురుషుల వ్యత్యాసం ఏర్పడింది. కఠినమైన చట్టాలు చేయడం ద్వారా ప్రభుత్వాలు లింగ నిర్ధారణ పరీక్షలు లేకుండా చేయగలిగాయి. ఫలితంగా అబ్బాయిలకు సమానంగా అమ్మాయిల సంఖ్య దగ్గరవుతూ వస్తోంది. 2011లో జరిపిన సర్వే ప్రకారం.. 111 మంది అబ్బాయిలకు 100 అమ్మాయిలుండేవారు. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలున్నారు.
శిశు మరణాలు తగ్గుముఖం
గత మూడు దశాబ్దాల్లో శిశు మరణాలు 70 శాతం వరకు తగ్గాయి. 1990లో వెయ్యి మంది శిశువులు జన్మిస్తే 89 మరణాలుండేవి. 2020 నాటికి ఆ సంఖ్య 27కు పడిపోయింది. అయితే నేపాల్, భూటాన్, శ్రీలంక, చైనా, అమెరికాలో ఈ మరణాల సంఖ్య ఇంకా కనిష్ఠ స్థాయిలో ఉంది. గర్భిణులకు పోషకాహారం పంపిణీ, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరచడం వంటి చర్యలతో శిశు మరణాలను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు