womens day: దశాబ్దాల పోరాటం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానం
ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయమిది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలపడిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..: పోరాడి సాధించుకున్న దినం.. అన్నింటా సాధికారిత దిశగా అడుగులు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానం ఇది.. ‘‘పట్టు విడవకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. దీనిని ఒక రోజులో సాధించలేం..’’ స్వామి వివేకానంద
నిజమే.. మహిళా దినోత్సవాన్ని సాధించుకోవడానికి పలు దేశాల్లోని మహిళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. మహిళలు అంతరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్క రోజులో సాధ్యం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయమిది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు.
ఆకాశంలో సగం.. అన్నింటా సగం అనే మహిళలకు అన్నిచోట్ల ఇబ్బందులే ఎదురవుతున్నాయి. పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ఈ రోజును ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్, ఆస్తిహక్కు కల్పించినా లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ప్రత్యేక దినోత్సవంగా..
మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును మహిళా దినోత్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహించారు. 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్హాగన్లో జరిగింది.
ఇది నాంది
అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్ సామ్యవాద లూయీస్ జియట్జ్ మహిళలు ఏటా మహిళాదినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీనిని జర్మన్ సామ్యవాది క్లారాజెట్కిన్ సమర్థించారు. 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళలు ఓటు, సమానహక్కు సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఓటుహక్కు, ప్రభుత్వ పదవులు కావాలని డిమాండ్ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు. అమెరికాలో మాత్రం ప్రతి ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913లో తొలిసారిగా రష్యన్ మహిళలు ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని జరిపారు.
1914 మార్చి 8 నుంచి
మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు. 1914 నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు, ఉద్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రినీకోట్ పరిశోధన చేశారు.
మహిళల పోరాటాలు..విజయాలు
* 1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వహించి ఓటుహక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లో గానీ మహిళలకు అక్కడ ఓటుహక్కు లభించలేదు.
* 1917లో(గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి8) సెయింట్ పీటర్బర్గ్ మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమలోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు.
* మార్చి 8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్, అలెగ్జాండర్,కొలెవ్టైల్లు వ్లాదిమిర్ లెనిన్ను ఒప్పించారు. కానీ అది 1965 నాటి దాకా అమల్లోకి రాలేదు.
* చైనాలో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రకటించినా సగం సెలవు రోజుగా పేర్కొన్నారు.
* 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్సవానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచ శాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపువచ్చింది.
* అమెరికా 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది.
మహిళల లక్ష్యాలు
* నాయకత్వం, రాజకీయాల్లో అవకాశాలు
* ఆర్థిక స్వావలంబన
* మహిళలపై హింస నివారణ
* శాంతి, భద్రత
* మానవత్వం
* జాతీయ ప్రణాళిక, పరిపాలనలో సమానత్వం
* యువతకు ప్రాధాన్యం
* దివ్యాంగులైన మహిళలు, బాలికలకు అవకాశాలు
భారత్లో మహిళా హక్కుల ఉద్యమం
భారత దేశంలో తొలిసారిగా అహ్మదాబాద్లో అనసూయ సారాబాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. మహిళలను సంఘటితం చేసిన వారిలో సుశీలా గోపాలన్, విమలా రణదివే, కెప్టెన్ లక్ష్మీసెహగల్, అహల్య రంగ్నేకర్, పార్వతీకృష్ణన్ ఉన్నారు. మహిళల ఉద్యమంతో కార్మికుల పని వేళలు, వేతనాలపై చట్టాలను చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న సరోజినినాయుడు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు.
ఐరాస మహిళా దినోత్సవం ప్రకటనలు
1996 - మహిళల గతం గుర్తించడం, భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేయడం
1997 - మహిళలు- శాంతి
1998 - మహిళలు, మానవహక్కులు
1999 - మహిళలపై హింసలేని ప్రపంచం
2000 - శాంతికి మహిళలను సమన్వయ పర్చడం
2001 - మహిళలు, శాంతి, పోరాటాల నిర్వహణ
2002 - నేటి ఆఫ్గన్ మహిళ, నిజాలు, అవకాశాలు
2003 - లింగ సమానత్వం
2004 - మహిళలు, హెచ్ఐవీ/ఎయిడ్స్
2005 - లింగ సమానత, భద్రమైన భవిష్యత్తు నిర్మాణం
2006 - మహిళలు, నిర్ణయాలు
2007 - మహిళలు, బాలికలపై హింసలో శిక్ష తప్పించుకోకుండా చూడడం
2008 - మహిళలు, అమ్మాయిలు, పరిశోధన
2009 - మహిళలపై హింసకు వ్యతిరేకం
2010 - సమాన హక్కులు. సమాన అవకాశాలు
2011 - మహిళలు పని చేసేందుకు అవకాశాలు, విద్య, శిక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోకి ప్రవేశం
2012 - గ్రామీణ మహిళల సాధికారిత, పేదరికం, ఆకలి నిర్మూలన
2013 - మహిళలపై హింస నివారణకు కార్యాచరణ
2014 - అన్నింటా మహిళల పురోగతి
2015 - మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడం
2016 - 2030నాటికి అంతరిక్షంలో 50-50, లింగ సమానత్వం
2017 - పని ప్రదేశంలో మహిళలు, 2030కి సమానత్వం
2018 - గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల్లో మార్పు
2019 - మార్పు సాధించేందుకు ప్రయత్నం
2020 - పురుషులతో సమానంగా హక్కులు
2021 - కొవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం
2022 - మహిళల సమానత్వం, కార్యాచరణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ