Be happy : అందరూ బాగుండాలి.. అందులో నువ్వుండాలి!
ప్రజలు సంతోషంగా ఉంటే ప్రపంచం దశ-దిశ మారిపోతుంది. అందుకే ఇవాళ నిర్వహించుకుంటున్న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’లో అందరూ భాగస్వాములు కావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తోంది.
ప్రతి రోజూ ఆనందం(Happy)గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే దాని కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. అదే ఈ రోజు.. మార్చి 20 ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’(world happiness day). దేశంలో ప్రతి మనిషి సంతోషంగా జీవిస్తేనే ఆర్థిక రంగం పురోగమిస్తుంది.
అట్టడుగున మన ‘హ్యాపీ’
ఇటీవలే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ విడుదలైంది. అందులో 146 దేశాలుంటే.. భారత్(India)కు 136వ ర్యాంకు వచ్చింది. అంటే మన ఆనందం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. మన కన్నా నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు సంతోషంగా ఉన్నట్లు తేలింది. దేశ ప్రజల కొనుగోలు శక్తి, సామాజిక మద్దతు, ఆరోగ్యకర జీవనశైలి, దాతృత్వం, ప్రభుత్వ పాలన, అవినీతి, స్వేచ్ఛ తదితర అంశాలను వడపోసి ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ను తయారు చేశారు. ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐలాండ్, నెదర్లాండ్ తొలి ఐదు స్థానాల్లో నిలవగా.. తాలిబన్ల పాలనలో మగ్గుతున్న అఫ్గాన్ ఆఖరిస్థానంలో నిలిచింది. మొత్తానికి పశ్చిమ దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలు ఏ మాత్రం సంతోషంగా లేవని తేలింది.
కారణం ఏంటి?
మన దేశ ప్రజల్లో దీర్ఘకాలిక అసంతృప్తి ఉందట. ఎన్నేళ్లయినా ధనవంతులు మాత్రమే ఎదుగుతున్నారు. పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు. పట్టణీకరణ కారణంగా నగరాల్లో రద్దీ పెరిగింది. జనాభా కూడా పెరిగింది. వైద్య ఖర్చులు ఆకాశన్నంటుతున్నాయి. మహిళలు, మైనారిటీలపై నేరాలు పెరిగిపోయాయి. ఇలాంటి విషయాలన్నీ భారతీయుల అసంతృప్తికి కారణాలు.
అందుకే ఓ రోజు
ప్రపంచంలోని ప్రజలంతా ఒక రోజు ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ ప్రవేశపెట్టారు. సమాజంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తులు మిగతా వారిలో సానుకూలతలు పెంచడం, ప్రతి దేశం తమ పౌరులు ఆనందంగా ఉండేలా చూసుకోవడం ఈ రోజు ముఖ్య లక్ష్యం. దురదృష్టవశాత్తూ ఆనందానికి బదులు ప్రపంచంలో కోపం, బాధ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఏటా మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’(world happiness day) నిర్వహిస్తోంది. సంతోషంగా ఉండటమే మానవుని ప్రాథమిక లక్ష్యం అని, వేడుక చేసుకోవడం ద్వారా ఆనందాన్ని పెంపొందించుకోవచ్చని ఈ రోజును కేటాయించింది.
నిజానికి ఒక రోజంతా నవ్వుతూ, మంచి వాతావరణంలో గడిపితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. 2013లో ఐక్యరాజ్యసమితి తొలిసారి ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ నిర్వహించింది. సలహాదారు జేమీ ఇలియన్ ఈ ఐడియాను ప్రవేశపెట్టాడు. వివిధ దేశాలు ‘క్యాప్టలిజం’కు బదులు ‘హ్యాపీటలిజం’పై దృష్టి కేంద్రీకరిస్తే ఆర్థిక వృద్ధి సాధించవచ్చని ఆయన భావించారు. దానికి ఐక్యరాజ్య సమితి కూడా సమ్మతి తెలిపింది. ‘యాక్షన్ ఫర్ హ్యాపీనెస్’, ‘హ్యాపీనెస్డే.ఓఆర్జీ’ వంటి వివిధ రకాల సంస్థలు దీనికి సహకారం అందించడంతో అది కార్యరూపం దాల్చింది. ఈ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు ఏ పరిస్థితుల్లో తాము సంతోషంగా ఉంటామో వెల్లడిస్తారు. తమ సంతోషంలో చుట్టుపక్కలి వారిని ఎలా భాగస్వాముల్ని చేస్తారో చెబుతారు. అలా చేయడంతో మంచి భవిషత్తు ఎలా సొంతమవుతుందో వివరిస్తారు.
సంతోషంగా ఎలా గడపాలి?
సంతోషం అంటే ఏమిటో చెప్పమంటే మనలో చాలా మందికి కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం. మన జీవితం ఎంత సంతోషంగా సాగిపోతోందీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఏది ఆనందంగా ఉంచుతుందో ఆ విషయాలను మీ సన్నిహితులతో పంచుకోవాలి. అందుబాటులో ఉన్న ప్రతి వస్తువును చూసి దాన్ని సంపాదించుకున్నందుకు గర్వపడాలి. దాన్ని సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకోవాలి. చిన్నవైనా సరే అవి ఇచ్చిన ఆనందం అద్భుతంగా ఉంటుంది. అలా చేయడం వల్ల జీవితంలో ఎంత సంతృప్తిగా ఉన్నామనే విషయం తెలుస్తుంది.
ఎవరిదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు ఉంటే వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. మీరు చేసే చిన్న ఆత్మీయ పలకరింపు లేదా ఒక సందేశంతో ఇంకొకరి ముఖంలో చిరునవ్వుని వెలిగించవచ్చు. మంచి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండటం కూడా సంతోషాలకు మూల కారణం. అందుకే మనకు ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సేపు గడపాలి. వారితో మనకున్న బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. సంతోషానికి దారి తీసే వాటిలో నిద్ర కూడా ఒక భాగం. అందుకే త్వరగా పడుకుంటే ఎక్కువ సేపు నిద్రపోవచ్చు. దాంతో మరుసటి రోజంతా హుషారుగా గడపొచ్చు. వ్యక్తిగత సంతోషం పెంచుకోవడానికి ఇవి గొప్ప మార్గాలుగా ఉపయోగపడతాయి. ఇలా ఒక్క రోజు చేయడం కాకుండా నిత్యం ఓ అలవాటుగా చేసుకుంటే సంతోషం తప్పకుండా మీ సొంతమవుతుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు