Social Media Day: నేడు సోషల్ మీడియా డే... ఇవిగో వాటి సంగతులు!
నేడు ప్రపంచ సామాజిక మాధ్యమాల దినోత్సవం (World Social Media Day). ఈ సందర్భంగా వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి చదివేయండి.
ఆధునిక మానవుల దినచర్య సామాజిక మాధ్యమాలతో (Social Media) ప్రారంభమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు వృత్తి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఒక రోజులో సగటున 144 నిమిషాలు సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారట. నేడు ప్రపంచ సామాజిక మాధ్యమాల దినోత్సవం (World Social Media Day) సందర్భంగా అవి ఎలా ప్రారంభమయ్యాయి. ఏ విధంగా ఆదరణ పొందాయో తెలుసుకోండి.
అలా మొదలైంది ‘వరల్డ్ సోషల్ మీడియా డే ’
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. దాంతో ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువై.. వారితో సంభాషిస్తున్నారు. భిన్న సంస్కృతులు, ప్రముఖ వ్యక్తులు, ఉద్యమాలు ఇలా ఏ అంశమైనా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే 2010 జూన్ 30న ‘మాషబుల్’ అనే సంస్థ ‘వరల్డ్ సోషల్ మీడియా డే ’ను ప్రారంభించింది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థపై సామాజిక మాధ్యమాలు వేస్తున్న ముద్రను గుర్తించే ఉద్దేశంతో దీనిని మొదలుపెట్టారు.
అదే తొలి సామాజిక మాధ్యమం
ప్రస్తుత కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా, ట్విటర్, లింక్డ్ ఇన్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలను మనం వాడుతున్నాం. అయితే వీటిలో ఏదీ తొలి సామాజిక మాధ్యమం కాదు. 1997లో అభివృద్ధి చేసిన ‘సిక్స్ డిగ్రీస్’ మొట్టమొదటి సామాజిక మాధ్యమం. ఆండ్రూ విన్రీచ్ అనే వ్యక్తి దానిని స్థాపించాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ లిస్టులు ఉండే ఇందులో ప్రొఫైల్స్, బులెటిన్ బోర్డ్స్, పాఠశాల అనుబంధాలు వంటి ఫీచర్లు అలరించేవి. ఒకానొక దశలో 10 మిలియన్ల యూజర్లకు చేరువైన ఈ సామాజిక మాధ్యమ ప్రస్థానం 2001లో ముగిసిపోయింది.
ఫేస్బుక్కు గట్టి పోటీ మై స్పేస్
2002లో కొంచెం అధునాతన సామాజిక మాధ్యమం ‘ఫ్రెండ్స్టర్’ నెట్టింట్లోకి వచ్చింది. ఈ వెబ్సైట్ సురక్షితంగా కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడానికి అనుమతించింది. దాంతో స్వల్పకాలంలోనే మిలియన్ల యూజర్లు వచ్చి చేరారు. అందులో మెజారిటీ వినియోగదారులు ఆసియా నుంచే ఉండేవారు. బిజినెస్ ప్రాధాన్య అంశంతో 2003లో ‘లింక్డ్ఇన్’వచ్చింది. 2004లో ‘మై స్పేస్’, ‘ఫేస్బుక్’ ప్రారంభమయ్యాయి. 2006 కల్లా ‘మై స్పేస్’ ప్రపంచ ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమంగా అవతరించింది. యూజర్లు మ్యూజిక్ను కూడా పోస్టు చేసే సౌలభ్యం ఇందులో ఉండటంతో ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు.
ఇప్పుడు ఎక్కువ మంది గంటల కొద్దీ సమయం గడిపేస్తున్న యూట్యూబ్ 2005లో, ట్విటర్ 2006లో ప్రారంభమయ్యాయి. 2010లో ఇన్స్టాగ్రామ్ ప్రస్థానం మొదలు కాగా.. అనతి కాలంలోనే అది ఫేస్బుక్కు గట్టి పోటీనిచ్చే సంస్థగా ఎదిగింది. దాంతో ఇన్స్టాగ్రామ్ను 1 బిలియన్ డాలర్లకు ఫేస్బుక్ కొనేసింది. ఆ తరువాత సందేశాల ఫీచర్తో దూసుకెళ్తున్న ‘వాట్సప్’ను కూడా ఫేస్బుక్ 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇలా ఫేస్బుక్ ఒక్కొక్క కంపెనీని కొనుగోలు చేస్తున్న క్రమంలో దాని కన్ను ‘స్నాప్చాట్’పై పడింది. అయితే ఫేస్బుక్ ప్రకటించిన ఆఫర్ ధరను స్నాప్చాట్ తిరస్కరించింది. 2016 చైనా సామాజిక మాధ్యమం ‘టిక్ టాక్’ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సులభంగా ఎడిటింగ్, నచ్చిన మ్యూజిక్తో పోస్టులు పెట్టే ఫీచర్లతో రావడం వల్ల ఈ కంపెనీ తొందరగా వీక్షకుల అభిమానం చూరగొంది. అయితే ఈ కంపెనీ అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంగా చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. అయినప్పటికీ టిక్టాక్ హవా కొనసాగుతూనే ఉంది.
విమర్శల పాలూ ఎక్కువే
సామాజిక మాధ్యమాలు ఎంత తొందరగా పాపులర్ అయ్యాయో.. అంతే త్వరగా విమర్శల పాలయ్యాయి. డేటా చౌర్యం, విద్వేషపూరిత ప్రసంగాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, ఎన్నికల ఫలితాల తారుమారు, తప్పుడు సమాచార వ్యాప్తితో అవి చేటు చేస్తున్నాయనే ఆరోపణలు తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాల కారణంగా అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకుంటే వార్తలు, షాపింగ్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్ తదితర వ్యాపార రంగాలకు సామాజిక మాధ్యమాలు ఉపయోగకరంగా ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని సంగతులు..
- ప్రపంచవ్యాప్తంగా 4.48 బిలియన్ల ప్రజలు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు.
- ఒక్కో సామాజిక మాధ్యమ వినియోగదారుడు సగటున 6.6 వేర్వేరు సామాజిక మాధ్యమాలను వాడుతున్నాడు.
- సామాజిక మాధ్యమాలు వాడేందుకు దాదాపు 99 శాతం మంది తమ మొబైల్ను, 1.32 శాతం మంది డెస్క్ డాప్ను ఎంచుకుంటున్నారు.
- ఓ వ్యక్తి 16 ఏళ్ల వయసులో సామాజిక మాధ్యమంలో అడుగుపెట్టి.. 70 సంవత్సరాలు జీవించాడనుకుంటే అతని సామాజిక మాధ్యమ జీవిత కాలం 5.7 సంవత్సరాలు.
- ఫేస్బుక్కు 2.9 బిలియన్, యూట్యూబ్కు 2.3 బిలియన్, వాట్సప్కు 2 బిలియన్, ఎఫ్ బీ మెసేంజర్కు 1.3 బిలియన్, వీ చాట్కు 1.2 బిలియన్ల యాక్టివ్ యూజర్లున్నారు.
- అమెరికాలో 72.3 శాతం (అంటే అక్కడి జనాభాలో 24 కోట్ల మంది) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
- రోజుకు 500 మిలియన్ల మంది ప్రజలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ను వాడుతున్నారు.
- వాట్సప్, ఫేస్బుక్ మెసేంజర్ కలిపి రోజుకు 60 బిలియన్ల సందేశాలను చేరవేస్తున్నాయి.
- యూట్యూబ్లో నిమిషంలో 300 గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్