Social Media Day: నేడు సోషల్ మీడియా డే... ఇవిగో వాటి సంగతులు!
నేడు ప్రపంచ సామాజిక మాధ్యమాల దినోత్సవం (World Social Media Day). ఈ సందర్భంగా వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి చదివేయండి.
ఆధునిక మానవుల దినచర్య సామాజిక మాధ్యమాలతో (Social Media) ప్రారంభమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు వృత్తి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఒక రోజులో సగటున 144 నిమిషాలు సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారట. నేడు ప్రపంచ సామాజిక మాధ్యమాల దినోత్సవం (World Social Media Day) సందర్భంగా అవి ఎలా ప్రారంభమయ్యాయి. ఏ విధంగా ఆదరణ పొందాయో తెలుసుకోండి.
అలా మొదలైంది ‘వరల్డ్ సోషల్ మీడియా డే ’
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. దాంతో ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువై.. వారితో సంభాషిస్తున్నారు. భిన్న సంస్కృతులు, ప్రముఖ వ్యక్తులు, ఉద్యమాలు ఇలా ఏ అంశమైనా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే 2010 జూన్ 30న ‘మాషబుల్’ అనే సంస్థ ‘వరల్డ్ సోషల్ మీడియా డే ’ను ప్రారంభించింది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థపై సామాజిక మాధ్యమాలు వేస్తున్న ముద్రను గుర్తించే ఉద్దేశంతో దీనిని మొదలుపెట్టారు.
అదే తొలి సామాజిక మాధ్యమం
ప్రస్తుత కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా, ట్విటర్, లింక్డ్ ఇన్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలను మనం వాడుతున్నాం. అయితే వీటిలో ఏదీ తొలి సామాజిక మాధ్యమం కాదు. 1997లో అభివృద్ధి చేసిన ‘సిక్స్ డిగ్రీస్’ మొట్టమొదటి సామాజిక మాధ్యమం. ఆండ్రూ విన్రీచ్ అనే వ్యక్తి దానిని స్థాపించాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ లిస్టులు ఉండే ఇందులో ప్రొఫైల్స్, బులెటిన్ బోర్డ్స్, పాఠశాల అనుబంధాలు వంటి ఫీచర్లు అలరించేవి. ఒకానొక దశలో 10 మిలియన్ల యూజర్లకు చేరువైన ఈ సామాజిక మాధ్యమ ప్రస్థానం 2001లో ముగిసిపోయింది.
ఫేస్బుక్కు గట్టి పోటీ మై స్పేస్
2002లో కొంచెం అధునాతన సామాజిక మాధ్యమం ‘ఫ్రెండ్స్టర్’ నెట్టింట్లోకి వచ్చింది. ఈ వెబ్సైట్ సురక్షితంగా కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడానికి అనుమతించింది. దాంతో స్వల్పకాలంలోనే మిలియన్ల యూజర్లు వచ్చి చేరారు. అందులో మెజారిటీ వినియోగదారులు ఆసియా నుంచే ఉండేవారు. బిజినెస్ ప్రాధాన్య అంశంతో 2003లో ‘లింక్డ్ఇన్’వచ్చింది. 2004లో ‘మై స్పేస్’, ‘ఫేస్బుక్’ ప్రారంభమయ్యాయి. 2006 కల్లా ‘మై స్పేస్’ ప్రపంచ ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమంగా అవతరించింది. యూజర్లు మ్యూజిక్ను కూడా పోస్టు చేసే సౌలభ్యం ఇందులో ఉండటంతో ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు.
ఇప్పుడు ఎక్కువ మంది గంటల కొద్దీ సమయం గడిపేస్తున్న యూట్యూబ్ 2005లో, ట్విటర్ 2006లో ప్రారంభమయ్యాయి. 2010లో ఇన్స్టాగ్రామ్ ప్రస్థానం మొదలు కాగా.. అనతి కాలంలోనే అది ఫేస్బుక్కు గట్టి పోటీనిచ్చే సంస్థగా ఎదిగింది. దాంతో ఇన్స్టాగ్రామ్ను 1 బిలియన్ డాలర్లకు ఫేస్బుక్ కొనేసింది. ఆ తరువాత సందేశాల ఫీచర్తో దూసుకెళ్తున్న ‘వాట్సప్’ను కూడా ఫేస్బుక్ 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇలా ఫేస్బుక్ ఒక్కొక్క కంపెనీని కొనుగోలు చేస్తున్న క్రమంలో దాని కన్ను ‘స్నాప్చాట్’పై పడింది. అయితే ఫేస్బుక్ ప్రకటించిన ఆఫర్ ధరను స్నాప్చాట్ తిరస్కరించింది. 2016 చైనా సామాజిక మాధ్యమం ‘టిక్ టాక్’ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సులభంగా ఎడిటింగ్, నచ్చిన మ్యూజిక్తో పోస్టులు పెట్టే ఫీచర్లతో రావడం వల్ల ఈ కంపెనీ తొందరగా వీక్షకుల అభిమానం చూరగొంది. అయితే ఈ కంపెనీ అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంగా చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. అయినప్పటికీ టిక్టాక్ హవా కొనసాగుతూనే ఉంది.
విమర్శల పాలూ ఎక్కువే
సామాజిక మాధ్యమాలు ఎంత తొందరగా పాపులర్ అయ్యాయో.. అంతే త్వరగా విమర్శల పాలయ్యాయి. డేటా చౌర్యం, విద్వేషపూరిత ప్రసంగాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, ఎన్నికల ఫలితాల తారుమారు, తప్పుడు సమాచార వ్యాప్తితో అవి చేటు చేస్తున్నాయనే ఆరోపణలు తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాల కారణంగా అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకుంటే వార్తలు, షాపింగ్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్ తదితర వ్యాపార రంగాలకు సామాజిక మాధ్యమాలు ఉపయోగకరంగా ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని సంగతులు..
- ప్రపంచవ్యాప్తంగా 4.48 బిలియన్ల ప్రజలు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు.
- ఒక్కో సామాజిక మాధ్యమ వినియోగదారుడు సగటున 6.6 వేర్వేరు సామాజిక మాధ్యమాలను వాడుతున్నాడు.
- సామాజిక మాధ్యమాలు వాడేందుకు దాదాపు 99 శాతం మంది తమ మొబైల్ను, 1.32 శాతం మంది డెస్క్ డాప్ను ఎంచుకుంటున్నారు.
- ఓ వ్యక్తి 16 ఏళ్ల వయసులో సామాజిక మాధ్యమంలో అడుగుపెట్టి.. 70 సంవత్సరాలు జీవించాడనుకుంటే అతని సామాజిక మాధ్యమ జీవిత కాలం 5.7 సంవత్సరాలు.
- ఫేస్బుక్కు 2.9 బిలియన్, యూట్యూబ్కు 2.3 బిలియన్, వాట్సప్కు 2 బిలియన్, ఎఫ్ బీ మెసేంజర్కు 1.3 బిలియన్, వీ చాట్కు 1.2 బిలియన్ల యాక్టివ్ యూజర్లున్నారు.
- అమెరికాలో 72.3 శాతం (అంటే అక్కడి జనాభాలో 24 కోట్ల మంది) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
- రోజుకు 500 మిలియన్ల మంది ప్రజలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ను వాడుతున్నారు.
- వాట్సప్, ఫేస్బుక్ మెసేంజర్ కలిపి రోజుకు 60 బిలియన్ల సందేశాలను చేరవేస్తున్నాయి.
- యూట్యూబ్లో నిమిషంలో 300 గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్