Happiest country: సంతోషానికి కొరతలేని దేశం.. జనాలే కరవు
ఫిన్లాండ్.. ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన దేశాల జాబితాలో వరుసగా నాలుగోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. పేరుకు చిన్న దేశమైనా సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయి.
ఫిన్లాండ్.. ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన దేశాల జాబితాలో వరుసగా నాలుగోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. పేరుకు చిన్న దేశమైనా సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు వనరులన్నీ ఉన్నా..పని చేసే జనాభా తక్కువ. దీంతో దేశ అభివృద్ధి కుంటుపడుతోంది. దీని నుంచి గట్టెక్కేందుకు ఏ దేశపౌరులైనా తమ దేశం వచ్చి పని చేస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తోంది ఫిన్లాండ్.
సాధారణంగా పశ్చిమ ఐరోపా దేశాల్లో జనాభా వృద్ధి రేటు కాస్త తక్కువే. ఫిన్లాండ్ ప్రస్తుత జనాభా 5.2 మిలియన్లు. అందులో పని చేయగలిగే వయస్సులో ఉన్నవారు కేవలం 65 శాతం మంది మాత్రమే. 39.2 శాతం ఓల్డేజ్ డిపెండెన్సీ నిష్పత్తితో వృద్ధుల సమస్య అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి ఇది 47.5 శాతానికి పెరగొచ్చు. ఈ నేపథ్యంలో పని చేసేవారి సంఖ్యను పెంచుకునేందుకు ఫిన్లాండ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగాలంటే ఏడాదికి కనీసం 20 వేల నుంచి 30 వేల మంది తమ దేశానికి వలస రావాలని గ్రహించి ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టింది. విదేశీయులను తమ సంస్థల్లో నియమించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు నిబంధనలను సరళతరం చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేందుకు ఆసక్తి చూపించిన వారికి ఫిన్లాండ్ పౌరసత్వం ఇచ్చి ఆహ్వానిస్తోంది. లేదంటే అక్కడ పని చేసేందుకైనా ఇమ్మిగ్రేషన్ సదుపాయం కల్పిస్తోంది.
అవినీతి చాలా తక్కువ
నాణ్యమైన జీవనం సాగించాలనుకునేవారికి ఫిన్లాండ్ ఓ చక్కటి దేశం. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉంటాయి. స్వతంత్రత, లింగ సమానత్వం ఉంటుంది. అవినీతి, కాలుష్యం, నేరాలు కూడా దాదాపు లేవనే చెప్పవచ్చు. దీంతో చాలామంది అక్కడ నివసించేందుకు ఇష్టపడతారు. కేవలం ఫిన్లాండ్ మాత్రమే కాదు.. చాలా పశ్చిమ ఐరోపా దేశాలు తమ దేశానికి వలసలను స్వాగతిస్తాయి. ఇతర దేశాల వారికి కూడా తమ దేశంలో ఉద్యోగాలు కల్పిస్తాయి.
గత దశాబ్దకాలంలో ఫిన్లాండ్కు వలస వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ దేశానికి వచ్చిన వారు కొన్నేళ్లపాటు అక్కడ పని చేసి తిరిగి స్వదేశానికి వెళ్లిపోతుంటారు. అలా 2019లో ఫిన్లాండ్ని విడిచి వెళ్లిన వారికంటే దాదాపు 15 వేల మంది అదనంగా ఆ దేశానికి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఆ దేశాన్ని విడిచి వెళ్లినవారిలో విద్యావంతులే ఎక్కువమంది ఉండటం ఆ దేశ అభివృద్ధిని దెబ్బతీస్తోంది.
కరోనా పడగ
ఉద్యోగరీత్యా ఆ దేశానికి వచ్చిన పలువురు కరోనా నేపథ్యంలో స్వదేశానికి పయనమవుతున్నారు. ఇది కూడా ఫిన్లాండ్ పాలిట శాపంగా మారింది. స్టార్టప్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించినా, భార్యాభర్తలు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక.. తిరిగి ఫిన్లాండ్ పూర్వపు శోభను సంతరించుకుంటుందని అక్కడి నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
సంతోషకరమైన దేశం ఎలా?
ఐక్య రాజ్యసమితి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి.. ప్రపంచ దేశాల్లో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను ప్రతి ఏటా నిర్ణయిస్తుంటారు. ఆ జాబితాలో ఫిన్లాండ్ గత నాలుగేళ్లుగా ప్రథమ స్థానంలోనే నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 149 దేశాల్లో సర్వే నిర్వహిస్తారు. ఆయా దేశాల జీడీపీ, సామాజిక భద్రత, దాతృత్వం, ప్రజల నిర్ణయాల్లో స్వతంత్రత, లంచగొండితనం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని హ్యాపీనెస్ ఇండెక్స్ను తయారు చేస్తారు.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం