Heavy bicycle : ఔరా బాహుబలి సైకిల్.. తొక్కుకుంటూ పోవాలె!
‘లోకో భిన్న రుచి’ అంటుంటారు. సైకిల్(Cycle) ఎల్లప్పుడూ ఒకే విధంగా ఎందుకు కనపడాలి? దాని టైర్లు(Tyre) పెద్దగా ఉంటే ఏమవుతుంది? ఇలా తన మొదడులో ఉదయించిన రకరకాల ప్రశ్నలతో ఓ వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్(world heaviest bicycle) తయారు చేశాడు.
(Image : Facebook)
ఇటీవల జర్మనీ(Germany)లోని డుసెల్డోఫ్ పట్టణంలో ‘సైక్లింగ్ వరల్డ్ బైక్ షో’ నిర్వహించారు. వివిధ రకాల సైకిళ్ల(Cycles)ను అందులో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ బుల్డోజర్ పరిమాణంలో ఉన్న ‘క్లైన్ జొహన్నా’ అనే పేరు గల సైకిల్(Cycle) మాత్రం సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. ఏంటి దాని ప్రత్యేకతలు? ఎవరు తయారు చేశారో తెలుసుకోండి.
42 గేర్లు.. బరువు 2177 కేజీలు
‘క్లైన్ జొహన్నా’ 2177 కేజీల బరువుంది. అంటే ఇది దాదాపు ఓ సెడాన్ కారు(Car)తో సమానం. గతంలోనూ ఇలా భారీ పరిమాణంలో రూపొందించిన సైకిళ్లు రోడ్డెక్కాయి. కానీ అవేవీ దీనంత బరువు లేవు. ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ తుక్కు దుకాణం నుంచి తెచ్చారు. ఈ సైకిల్ 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తు ఉంది. ముందు, వెనుక వైపు కలిసి రెండు భారీ టైర్లు, మధ్యలో ఒక మీడియం టైరును సపోర్టుగా అమర్చారు. దీన్ని పెడల్తో ఎలా కదిలిస్తారనే ప్రశ్న మీకు రావచ్చు.సైకిల్ సులువుగా కదిలేందుకు ఒక ట్రక్ గేర్ బాక్సును, సాధారణ గేర్ సైకిల్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ముందుకు కదపాలంటే ఏకంగా 35 గేర్లు వాడాలి. అలాగే వెనక్కి మళ్లాలంటే 7 గేర్లు ఉపయోగించాలి. ఇంత కష్టపడి తయారు చేసిన ఈ సైకిల్పై ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణిస్తే దీని గొప్ప ఏముంటుంది చెప్పండి. అందుకే దీనికి 15 టన్నుల్లోపు బరువైన వాహనాలు ఏవి కట్టినా సునాయాసంగా లాగవచ్చని ఈ బాహుబలి సైకిల్ రూపకర్త సెబాస్టియన్ తెలిపాడు. ఈ సైకిల్కు లోపల ఓ ఇంజిన్ కూడా ఉంది. అయితే అది ఆల్టర్నేటర్ తిరగడానికి మాత్రమే సహాయం చేస్తుంది. ఆ శక్తితో మొబైల్ ఫోన్ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక వేగం విషయానికి వస్తే ఇది మనుషుల మామూలు నడక కంటే తక్కువనే చెప్పవచ్చు. అయినా ఈ వేగంతో బాల్టిక్ సముద్రం వరకు వెళ్లాలని యోచన చేస్తున్నట్లు సెబాస్టియన్ తెలిపాడు. అందు కోసం ఈ వేసవిలో అతడు 389 కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ‘క్లైన్ జొహన్నా’ను ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్గా ‘రికార్డ్ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ జర్మనీ’ గుర్తించింది. ఇది ఆ దేశంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో సమానం.
కఠిన శ్రమకు ఫలితం
ఈ బాహుబలి సైకిల్ రూపకర్త సెబాస్టియన్ బ్యూట్లర్ మామూలోడు కాదు. జర్మనీలోని కోథెన్ పట్టణానికి చెందిన ఈయన బాల్యంలోనే తుక్కు దుకాణంలో దొరికే వ్యర్థాలతో సైకిల్ తయారు చేసి అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. తర్వాత నుంచి అనేక ఆవిష్కరణల వైపు అతడి అడుగులు పడ్డాయి. 2011 ఒకసారి సెబాస్టియన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ సమయంలోనే ఓ అసాధారణ ఆవిష్కరణ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. చాలా ఏళ్ల నుంచి ఒక బాహుబలిలాంటి సైకిల్ను రూపొందించాలనే కోరిక ఆయన మనసులో ఉండేది. అంతే మూడేళ్ల పాటు శ్రమించి ‘క్లైన్ జొహన్నా’ను తీర్చిదిద్దాడు. ఈ ప్రాజెక్టు కోసం తన జీవితంలో 2500 గంటలు కేటాయించాడు. ఇలా పనిచేస్తుంటే తాను ఏమైపోతాడోనని ఒకానొక దశలో సెబాస్టియన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు కంగారు పడ్డారు. చేస్తున్న పనిని అంతటితో ఆపేయమని కోరారు. కానీ అతడు వినలేదు. ఆ కఠోర శ్రమకు ఫలితమే నేడు కన్పిస్తున్న బాహుబలి సైకిల్. లిథువేనియాకు చెందిన ఓ సైకిల్ను ప్రపంచంలోనే అత్యంత భారీ సైకిల్గా 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. దాని బరువు 1385 కేజీలు. సెబాస్టియన్ రూపొందించిన ‘క్లైన్ జొహన్నా’కు త్వరలో ఆ ఘనత దక్కే అవకాశం ఉందంటున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల