DNA : ఎక్కడ వెతికినా మానవుల ‘ఈడీఎన్ఏ’.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
అమెరికాలోని (America) యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డప్ఫీ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జన్యు, పర్యావరణ, సముద్ర జీవ శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి ఓ పరిశోధన (Research) నిర్వహించారు. ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల మానవుల డీఎన్ఏ (DNA) ఆనవాళ్లున్నట్లు వారు కనుగొన్నారు.
ఓ కొత్త పరిశోధనలో (Research) మానవుల డీఎన్ఏ (DNA) ఆనవాళ్లు వాతావరణంలోని ప్రతి చోటా ఉన్నట్లు తేలింది. అందుకోసం పరిశోధకులు నీరు, ఇసుక, మట్టి, గాలి నుంచి నమూనాలు (Sample) సేకరించారు. వాటిని విశ్లేషించగా సంబంధిత డీఎన్ఏల వంశం, లింగం, అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో విషయాల గురించి తెలిసింది.
శరీరంలోని ప్రతి కణంలోనూ డీఎన్ఏ ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది. దాన్ని విశ్లేషించి ఆ వ్యక్తి లేదా ప్రాణి పరిణామ క్రమాన్ని తెలుసుకోవచ్చు. డీఎన్ఏ పరీక్ష చేయడానికి వైద్యులు, పరిశోధకులు మానవుల రక్తం, స్వాబ్, జీవాణువులను సేకరిస్తారు. జంతువులకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఇలా సేకరించాల్సిన అవసరమే లేకుండా డీఎన్ఏ ఆనవాళ్లు వాతావరణంలో కన్పిస్తున్నాయి. అనేక ఏళ్లుగా మానవులు వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న కారణంగా నీరు, గాలి, మట్టి, ఇసుక ఇలా ప్రతి చోటా నమూనాలు దొరుకుతున్నాయి.
పర్యావరణ డీఎన్ఏ
పర్యావరణంలో డీఎన్ఏ నమూనాలు కలిసిపోవడాన్ని ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ లేదా ‘ఈడీఎన్ఏ’ అని సంబోధిస్తారు. జీవ వైవిధ్యాన్ని, వన్యప్రాణుల సంచారాన్ని, వ్యాధుల పరిణామ క్రమాన్ని గుర్తించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈడీఎన్ఏను సేకరించే విధానాన్ని అనుసరిస్తున్నారు. దాంతో అరుదైన, అంతరించిపోతున్న జీవుల గురించి తెలుసుకున్నారు. ఈ పద్ధతి లేకుంటే అనేక విషయాలను కనుక్కోవడం వారికి కష్టంగా ఉండేది. పైగా డీఎన్ఏ టెస్టులు చేస్తామంటే.. మానవులు సాధారణంగా అంగీకరించరు. పరిశోధకులు ఈడీఎన్ఏ పరికరాలను కేవలం వారు పరిశోధన చేస్తున్న జీవుల నమూనాలు సేకరించడం కోసమే వినియోగిస్తారు. అయితే మానవ సంచారం అధికం కావడం వల్ల ఈడీఎన్ఏ సేకరిస్తున్న ప్రతి చోటా మనుషుల డీఎన్ఏ బయటపడుతోంది. దగ్గు, తుమ్ము, మల, మూత్ర విసర్జనల కారణంగా అవి పర్యావరణం అంతటా వ్యాపించాయి.
తాబేలుపై పరిశోధన చేయగా..
వాస్తవానికి ఈ బృందం తొలుత అంతరించిపోతున్న ఓ సముద్ర తాబేలు, దానికి సోకే ట్యూమర్ గురించి అధ్యయనం చేసింది. తీరంలో పుట్టిన తాబేలు పాకుతూ సముద్రంలోకి వెళ్లే సమయంలో కొన్ని డీఎన్ఏ ఆనవాళ్లను వదిలి వెళ్తున్నట్లు వారు గుర్తించారు. ఆ ఆనవాళ్లలో తాబేళ్లకు సోకే వైరస్లు, వ్యాధుల తాలుకా డీఎన్ఏ లభించింది. తాబేలును నీటిట్యాంకులో ఉంచి అందులోని కొంత నీటిని బయటకు తీసి పరిశోధన చేసినా ఇదే తరహా సమాచారం లభిస్తుందట.
దాంతో పరిశోధకులు ఓ అడుగు ముందుకేసి ఫ్లోరిడాలోని వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు. సముద్రం, నదులు, గ్రామాలు, పట్టణాలు, మానవ సంచారం లేని బీచ్లు, మారుమూల ద్వీపాలు ఇలా అన్నింటినీ జల్లెడ పట్టారు. మారుమూల ద్వీపాల్లో తప్ప అన్ని చోట్లా వారికి మానవుల డీఎన్ఏ దొరికింది. అవి విశ్లేషించడానికి, పరిణామక్రమాన్ని తెలుసుకోవడానికి అనువుగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఐర్లాండ్లోనూ ఇలాంటి పరిశోధనే చేయగా మారుమూల పర్వతం, నదుల ప్రారంభ స్థానంలో తప్ప మిగిలిన ప్రదేశాల్లో మానవుల డీఎన్ఏ లభించిందట. కేవలం బయటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇండోర్లోనూ నమూనాలు సేకరించారు. ఓ పశు వైద్యశాల గదిలోని గాలి నుంచి నమూనాలు తీసుకొని విశ్లేషించగా అందులో మనుషుల డీఎన్ఏ, పశువుల డీఎన్ఏ, వాటికి వచ్చే వైరస్ల డీఎన్ఏ బయటపడింది.
నైతికత ప్రశ్నార్థకం
పర్యావరణ డీఎన్ఏ సేకరణ విధానం పరిశోధనల వరకు బాగానే ఉన్నా దాని నైతికత గురించి ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈడీఎన్ఏ సేకరణకు సమ్మతి ఉందా? అందులో బయట పడిన సమాచారం ఇతరులకు తెలియకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లుతుందేమో? ఇలా రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అందుకోసం కొన్ని నియమ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరముందని కొందరు వాదిస్తున్నారు.
అయితే తాము సేకరించిన ఈడీఎన్ఏల నమూనాలను సరిగ్గా వినియోగించుకుంటే పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రాచీన మానవుల గురించి తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జీవ శాస్త్రవేత్తలు క్యాన్సర్ వంటి వ్యాధుల మ్యూటేషన్ల గురించి, పోలీసులు నేరస్థుల చిట్టా తయారు చేయడానికి కూడా ఈ పరిశోధన తోడ్పడుతుందని అంటున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.