DNA : ఎక్కడ వెతికినా మానవుల ‘ఈడీఎన్ఏ’.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
అమెరికాలోని (America) యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డప్ఫీ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జన్యు, పర్యావరణ, సముద్ర జీవ శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి ఓ పరిశోధన (Research) నిర్వహించారు. ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల మానవుల డీఎన్ఏ (DNA) ఆనవాళ్లున్నట్లు వారు కనుగొన్నారు.
ఓ కొత్త పరిశోధనలో (Research) మానవుల డీఎన్ఏ (DNA) ఆనవాళ్లు వాతావరణంలోని ప్రతి చోటా ఉన్నట్లు తేలింది. అందుకోసం పరిశోధకులు నీరు, ఇసుక, మట్టి, గాలి నుంచి నమూనాలు (Sample) సేకరించారు. వాటిని విశ్లేషించగా సంబంధిత డీఎన్ఏల వంశం, లింగం, అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో విషయాల గురించి తెలిసింది.
శరీరంలోని ప్రతి కణంలోనూ డీఎన్ఏ ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది. దాన్ని విశ్లేషించి ఆ వ్యక్తి లేదా ప్రాణి పరిణామ క్రమాన్ని తెలుసుకోవచ్చు. డీఎన్ఏ పరీక్ష చేయడానికి వైద్యులు, పరిశోధకులు మానవుల రక్తం, స్వాబ్, జీవాణువులను సేకరిస్తారు. జంతువులకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఇలా సేకరించాల్సిన అవసరమే లేకుండా డీఎన్ఏ ఆనవాళ్లు వాతావరణంలో కన్పిస్తున్నాయి. అనేక ఏళ్లుగా మానవులు వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న కారణంగా నీరు, గాలి, మట్టి, ఇసుక ఇలా ప్రతి చోటా నమూనాలు దొరుకుతున్నాయి.
పర్యావరణ డీఎన్ఏ
పర్యావరణంలో డీఎన్ఏ నమూనాలు కలిసిపోవడాన్ని ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ లేదా ‘ఈడీఎన్ఏ’ అని సంబోధిస్తారు. జీవ వైవిధ్యాన్ని, వన్యప్రాణుల సంచారాన్ని, వ్యాధుల పరిణామ క్రమాన్ని గుర్తించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈడీఎన్ఏను సేకరించే విధానాన్ని అనుసరిస్తున్నారు. దాంతో అరుదైన, అంతరించిపోతున్న జీవుల గురించి తెలుసుకున్నారు. ఈ పద్ధతి లేకుంటే అనేక విషయాలను కనుక్కోవడం వారికి కష్టంగా ఉండేది. పైగా డీఎన్ఏ టెస్టులు చేస్తామంటే.. మానవులు సాధారణంగా అంగీకరించరు. పరిశోధకులు ఈడీఎన్ఏ పరికరాలను కేవలం వారు పరిశోధన చేస్తున్న జీవుల నమూనాలు సేకరించడం కోసమే వినియోగిస్తారు. అయితే మానవ సంచారం అధికం కావడం వల్ల ఈడీఎన్ఏ సేకరిస్తున్న ప్రతి చోటా మనుషుల డీఎన్ఏ బయటపడుతోంది. దగ్గు, తుమ్ము, మల, మూత్ర విసర్జనల కారణంగా అవి పర్యావరణం అంతటా వ్యాపించాయి.
తాబేలుపై పరిశోధన చేయగా..
వాస్తవానికి ఈ బృందం తొలుత అంతరించిపోతున్న ఓ సముద్ర తాబేలు, దానికి సోకే ట్యూమర్ గురించి అధ్యయనం చేసింది. తీరంలో పుట్టిన తాబేలు పాకుతూ సముద్రంలోకి వెళ్లే సమయంలో కొన్ని డీఎన్ఏ ఆనవాళ్లను వదిలి వెళ్తున్నట్లు వారు గుర్తించారు. ఆ ఆనవాళ్లలో తాబేళ్లకు సోకే వైరస్లు, వ్యాధుల తాలుకా డీఎన్ఏ లభించింది. తాబేలును నీటిట్యాంకులో ఉంచి అందులోని కొంత నీటిని బయటకు తీసి పరిశోధన చేసినా ఇదే తరహా సమాచారం లభిస్తుందట.
దాంతో పరిశోధకులు ఓ అడుగు ముందుకేసి ఫ్లోరిడాలోని వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు. సముద్రం, నదులు, గ్రామాలు, పట్టణాలు, మానవ సంచారం లేని బీచ్లు, మారుమూల ద్వీపాలు ఇలా అన్నింటినీ జల్లెడ పట్టారు. మారుమూల ద్వీపాల్లో తప్ప అన్ని చోట్లా వారికి మానవుల డీఎన్ఏ దొరికింది. అవి విశ్లేషించడానికి, పరిణామక్రమాన్ని తెలుసుకోవడానికి అనువుగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఐర్లాండ్లోనూ ఇలాంటి పరిశోధనే చేయగా మారుమూల పర్వతం, నదుల ప్రారంభ స్థానంలో తప్ప మిగిలిన ప్రదేశాల్లో మానవుల డీఎన్ఏ లభించిందట. కేవలం బయటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇండోర్లోనూ నమూనాలు సేకరించారు. ఓ పశు వైద్యశాల గదిలోని గాలి నుంచి నమూనాలు తీసుకొని విశ్లేషించగా అందులో మనుషుల డీఎన్ఏ, పశువుల డీఎన్ఏ, వాటికి వచ్చే వైరస్ల డీఎన్ఏ బయటపడింది.
నైతికత ప్రశ్నార్థకం
పర్యావరణ డీఎన్ఏ సేకరణ విధానం పరిశోధనల వరకు బాగానే ఉన్నా దాని నైతికత గురించి ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈడీఎన్ఏ సేకరణకు సమ్మతి ఉందా? అందులో బయట పడిన సమాచారం ఇతరులకు తెలియకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లుతుందేమో? ఇలా రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అందుకోసం కొన్ని నియమ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరముందని కొందరు వాదిస్తున్నారు.
అయితే తాము సేకరించిన ఈడీఎన్ఏల నమూనాలను సరిగ్గా వినియోగించుకుంటే పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రాచీన మానవుల గురించి తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జీవ శాస్త్రవేత్తలు క్యాన్సర్ వంటి వ్యాధుల మ్యూటేషన్ల గురించి, పోలీసులు నేరస్థుల చిట్టా తయారు చేయడానికి కూడా ఈ పరిశోధన తోడ్పడుతుందని అంటున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట