China youth : భక్తి మార్గంలోకి చైనా యువత.. ఎందుకో తెలుసా!
నాస్తిక (Atheist), మార్కిస్టు (Marxist) విధానాలతో కూడిన విద్యనభ్యసించిన చైనా యువత (China youth) ఇప్పుడు ఆస్తికవాదం వైపు అడుగులు వేస్తోంది. దాంతో అక్కడి దేవాలయాలు (Temples) కిక్కిరిసిపోతున్నాయి.
చైనా యువత (China youth) కొత్త పంథా ఎంచుకుంది. గతంలో ఆ దేశ ప్రజలు నిరంతరం ఏదోక పని చేస్తూనే ఉంటారని, అందువల్ల జీడీపీలో (Gdp) వృద్ధి కన్పిస్తోందని అంతా మాట్లాడుకునేవారు. ఇప్పుడు మాత్రం అక్కడి ‘మిలీనియల్స్’, ‘జనరేషన్ జడ్’ పనిని (Work) పక్కకు పెట్టేశారు. అధిక ఒత్తిడి, శ్రమను తట్టుకోలేక దేవాలయాల (Temples) వైపు అడుగులు వేస్తున్నారు. దాంతో బుద్ధిజం (Buddhism), టావోయిజం(దావోయిజం) ఆచరించే యువత సంఖ్య గణనీయంగా పెరిగిందని అక్కడి పత్రికలు పేర్కొంటున్నాయి.
జీవితమంటే పని మాత్రమే కాదు..
ఇటీవలి కాలంలో ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన కొందరు చైనా యువతీ యువకులు పనికి కాస్త బ్రేక్ ఇచ్చి దేవాలయాలను సందర్శిస్తున్నారు. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. నిజానికి ఈ మార్పునకు కొవిడ్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. మహమ్మారి ప్రబలిన సమయంలో 16-24 ఏళ్ల యువతకు ఎక్కువగా పనుల్లేకుండా పోయాయి. ఆ సమయంలో జీవితం అంటే పని మాత్రమే కాదు.. ప్రశాంతత కూడా అని తాము తెలుసుకున్నట్లు చైనా యువత పేర్కొంటోంది. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గతేడాది నిరుద్యోగిత 17.5 శాతం ఉండగా.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అది 18.1 శాతానికి ఎగబాకింది. ఇదే ఒరవడి కొనసాగితే దేశ ప్రగతి దెబ్బతింటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యువత దేవాలయాల సందర్శన కారణంగా పర్యాటక రంగం మాత్రం ఊపందుకుందని చెబుతున్నారు.
పండగ తరహాలో అనూహ్య రద్దీ
యువతీ, యువకులు వారాంతాల్లో విహారానికి కాకుండా ఆలయాలకు వెళ్లి అక్కడి జరిగే పూజా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అక్కడ వినిపించే బోధనలతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. బీజింగ్లోని ‘యోంగె ప్యాలస్’ ఒక పురాతన బుద్ధిస్ట్ టెంపుల్. మార్చి నెల ప్రారంభం నుంచి రోజుకు 40 వేల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారట. హాంగ్జూస్లోని మరో ప్రసిద్ధ ఆలయం ‘లింగ్యిన్ టెంపుల్’ బయట నిత్యం భారీ క్యూ దర్శనమిస్తోంది.
కొవిడ్ నిబంధనలు సడలించిన తరువాత నుంచి బుద్ధిస్ట్, టావోయిస్ట్ దేవాలయాల్లో రద్దీ పెరిగింది. యువత తమ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు, అదృష్టం కలిసి రావాలని ప్రార్థించేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ దేవాలయాల సందర్శన 310 శాతం పెరిగినట్లు అక్కడి ట్రిప్.డాట్కామ్ లెక్కలు చెబుతున్నాయి. బుద్ధిజం, టావోయిజం, కన్ఫ్యూషనిజం ప్రాచీన చైనాలోని ప్రసిద్ధ మతాలు, తత్వాలు. ఆధునిక చైనా సమాజంలోనూ వీటిని అనుసరిస్తున్నారు. గతంలో పండగల సమయంలోనే వివిధ దేవాలయాల వద్ద ఎక్కువ రద్దీ కనిపించేది. ఇప్పుడు అన్ని రోజుల్లోనూ పండగ వాతావరణం ప్రతిబింబిస్తోంది. అయితే దేవాలయాలను సందర్శిస్తున్న యువతకు ‘మాంక్’, ‘నన్’లుగా మారే ఉద్దేశం ఎంత మాత్రం లేదని తెలుస్తోంది. కేవలం ప్రశాంతత కోసం అక్కడకు వెళ్లడం ఇప్పుడొక ట్రెండ్గా మారింది.
సామాజిక మాధ్యమాల్లోనూ భక్తి పోస్టులు
ఆలయాలను సందర్శిస్తున్న యువత దైవ దీవెనలుగా భావిస్తూ కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిలో పూసల కంకణాలను అత్యధిక మంది కొని ధరిస్తున్నట్లు తెలిసింది. అలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతున్నారు. సంపన్నులు కావడం, కెరీర్లో స్థిరపడటం, చదువులో రాణించడం వంటి కోర్కెలన్నీ నెరవేరుతాయని భావిస్తున్నారు. పనిలో పనిగా లాటరీ టికెట్లు సైతం కొనుగోలు చేస్తున్నారు. తాము ధరించిన వస్తువులకు ఆ శక్తి ఉందనే భావనతో ఈ పోకడ పెరుగుతోంది. అంతే కాదు వీటిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. తాము ఫలానా దేవాలయానికి వెళ్లామని, ఇలాంటి పూజా వస్తువులు కొనుగోలు చేశామనే చర్చలు చైనా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కన్పిస్తున్నట్లు సమాచారం.
చైనా యువత చేస్తున్న ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అక్కడి పత్రికలు తప్పుపడుతున్నాయి. యువత కష్టపడి పని చేయడం ద్వారా తమ కలలను నెరవేర్చుకోవచ్చని, ఆలయాల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని కథనాల రూపంలో వారిని దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి నాస్తికత్వాన్ని ఎక్కువగా నమ్మే చైనాలో ఆస్తికత్వం దిశగా అడుగులు పడుతున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల