China youth : భక్తి మార్గంలోకి చైనా యువత.. ఎందుకో తెలుసా!
నాస్తిక (Atheist), మార్కిస్టు (Marxist) విధానాలతో కూడిన విద్యనభ్యసించిన చైనా యువత (China youth) ఇప్పుడు ఆస్తికవాదం వైపు అడుగులు వేస్తోంది. దాంతో అక్కడి దేవాలయాలు (Temples) కిక్కిరిసిపోతున్నాయి.
చైనా యువత (China youth) కొత్త పంథా ఎంచుకుంది. గతంలో ఆ దేశ ప్రజలు నిరంతరం ఏదోక పని చేస్తూనే ఉంటారని, అందువల్ల జీడీపీలో (Gdp) వృద్ధి కన్పిస్తోందని అంతా మాట్లాడుకునేవారు. ఇప్పుడు మాత్రం అక్కడి ‘మిలీనియల్స్’, ‘జనరేషన్ జడ్’ పనిని (Work) పక్కకు పెట్టేశారు. అధిక ఒత్తిడి, శ్రమను తట్టుకోలేక దేవాలయాల (Temples) వైపు అడుగులు వేస్తున్నారు. దాంతో బుద్ధిజం (Buddhism), టావోయిజం(దావోయిజం) ఆచరించే యువత సంఖ్య గణనీయంగా పెరిగిందని అక్కడి పత్రికలు పేర్కొంటున్నాయి.
జీవితమంటే పని మాత్రమే కాదు..
ఇటీవలి కాలంలో ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన కొందరు చైనా యువతీ యువకులు పనికి కాస్త బ్రేక్ ఇచ్చి దేవాలయాలను సందర్శిస్తున్నారు. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. నిజానికి ఈ మార్పునకు కొవిడ్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. మహమ్మారి ప్రబలిన సమయంలో 16-24 ఏళ్ల యువతకు ఎక్కువగా పనుల్లేకుండా పోయాయి. ఆ సమయంలో జీవితం అంటే పని మాత్రమే కాదు.. ప్రశాంతత కూడా అని తాము తెలుసుకున్నట్లు చైనా యువత పేర్కొంటోంది. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గతేడాది నిరుద్యోగిత 17.5 శాతం ఉండగా.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అది 18.1 శాతానికి ఎగబాకింది. ఇదే ఒరవడి కొనసాగితే దేశ ప్రగతి దెబ్బతింటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యువత దేవాలయాల సందర్శన కారణంగా పర్యాటక రంగం మాత్రం ఊపందుకుందని చెబుతున్నారు.
పండగ తరహాలో అనూహ్య రద్దీ
యువతీ, యువకులు వారాంతాల్లో విహారానికి కాకుండా ఆలయాలకు వెళ్లి అక్కడి జరిగే పూజా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అక్కడ వినిపించే బోధనలతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. బీజింగ్లోని ‘యోంగె ప్యాలస్’ ఒక పురాతన బుద్ధిస్ట్ టెంపుల్. మార్చి నెల ప్రారంభం నుంచి రోజుకు 40 వేల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారట. హాంగ్జూస్లోని మరో ప్రసిద్ధ ఆలయం ‘లింగ్యిన్ టెంపుల్’ బయట నిత్యం భారీ క్యూ దర్శనమిస్తోంది.
కొవిడ్ నిబంధనలు సడలించిన తరువాత నుంచి బుద్ధిస్ట్, టావోయిస్ట్ దేవాలయాల్లో రద్దీ పెరిగింది. యువత తమ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు, అదృష్టం కలిసి రావాలని ప్రార్థించేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ దేవాలయాల సందర్శన 310 శాతం పెరిగినట్లు అక్కడి ట్రిప్.డాట్కామ్ లెక్కలు చెబుతున్నాయి. బుద్ధిజం, టావోయిజం, కన్ఫ్యూషనిజం ప్రాచీన చైనాలోని ప్రసిద్ధ మతాలు, తత్వాలు. ఆధునిక చైనా సమాజంలోనూ వీటిని అనుసరిస్తున్నారు. గతంలో పండగల సమయంలోనే వివిధ దేవాలయాల వద్ద ఎక్కువ రద్దీ కనిపించేది. ఇప్పుడు అన్ని రోజుల్లోనూ పండగ వాతావరణం ప్రతిబింబిస్తోంది. అయితే దేవాలయాలను సందర్శిస్తున్న యువతకు ‘మాంక్’, ‘నన్’లుగా మారే ఉద్దేశం ఎంత మాత్రం లేదని తెలుస్తోంది. కేవలం ప్రశాంతత కోసం అక్కడకు వెళ్లడం ఇప్పుడొక ట్రెండ్గా మారింది.
సామాజిక మాధ్యమాల్లోనూ భక్తి పోస్టులు
ఆలయాలను సందర్శిస్తున్న యువత దైవ దీవెనలుగా భావిస్తూ కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిలో పూసల కంకణాలను అత్యధిక మంది కొని ధరిస్తున్నట్లు తెలిసింది. అలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతున్నారు. సంపన్నులు కావడం, కెరీర్లో స్థిరపడటం, చదువులో రాణించడం వంటి కోర్కెలన్నీ నెరవేరుతాయని భావిస్తున్నారు. పనిలో పనిగా లాటరీ టికెట్లు సైతం కొనుగోలు చేస్తున్నారు. తాము ధరించిన వస్తువులకు ఆ శక్తి ఉందనే భావనతో ఈ పోకడ పెరుగుతోంది. అంతే కాదు వీటిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. తాము ఫలానా దేవాలయానికి వెళ్లామని, ఇలాంటి పూజా వస్తువులు కొనుగోలు చేశామనే చర్చలు చైనా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కన్పిస్తున్నట్లు సమాచారం.
చైనా యువత చేస్తున్న ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అక్కడి పత్రికలు తప్పుపడుతున్నాయి. యువత కష్టపడి పని చేయడం ద్వారా తమ కలలను నెరవేర్చుకోవచ్చని, ఆలయాల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని కథనాల రూపంలో వారిని దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి నాస్తికత్వాన్ని ఎక్కువగా నమ్మే చైనాలో ఆస్తికత్వం దిశగా అడుగులు పడుతున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.