నెల్లూరు కోర్టులో చోరీ.. కేసు సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదు: ఏజీ

నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై ఇవాళ హైకోర్టులో సుమోటో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించడంపై

Updated : 26 Apr 2022 11:21 IST

అమరావతి: నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై ఇవాళ హైకోర్టులో సుమోటో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ డైరెక్టర్‌, డీజీపీ, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ హైకోర్టు వచ్చే నెల 6కు వాయిదా పడింది.

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్ర హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది.

ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని ఉన్నత న్యాయస్థానం సుమోటో పిల్‌గా పరిగణించి ఇవాళ విచారణ జరిపింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని