AP ICET results: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్‌ చేసుకోండి!

రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్‌

Updated : 10 Aug 2022 15:47 IST

విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షలో 87.83శాతం అర్హత సాధించారు. జులై 25న రాష్ట్ర వ్యాప్తంగా 24నగరాలతో పాటు హైదరాబాద్‌లో మొత్తం 107 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా పరీక్షకు 49,157 మంది దరఖాస్తు చేస్తున్నారు. వారిలో 42,496 మంది పరీక్షకు హాజరు కాగా.. 37,326 మంది అర్హత సాధించారని వీసీ తెలిపారు. బాలుర ఉత్తీర్ణత శాతం 87.98 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 87.68శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. తొలి 10ర్యాంకుల్లో బాలురు 7 ర్యాంకులు సాధించగా, బాలికలు 3 ర్యాంకుల్లో మెరిశారు. తిరుపతికి చెందిన రెడ్డప్పగారి కేతన్‌ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. గుంటూరుకు చెందిన డి.పూజిత వర్ధన్‌ రెండో ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్‌.వంశీభరద్వాజ్‌ మూడో ర్యాంకు సాధించాడు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని