CBI Court: విదేశాలకు వెళ్లేందుకు.. సీబీఐ కోర్టులో సీఎం జగన్‌, విజయసాయి పిటిషన్‌

యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్‌లోని కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.

Updated : 28 Aug 2023 19:23 IST

హైదరాబాద్‌: యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు న్యాయస్థానాన్ని సీబీఐ సమయం కోరింది. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

మరోవైపు, విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ వేశారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ సమయాన్ని కోరింది. విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు