మధ్య సీటు ఖాళీతో కరోనా ముప్పు తక్కువే!
విమానాల్లో ప్రయాణికుల మధ్య సీట్లలో ఖాళీ ఉంచడం వల్ల కొవిడ్ వ్యాప్తి ముప్పు తగ్గుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.
విమాన ప్రయాణాల్లో వైరస్ వ్యాప్తిపై తాజా అధ్యయనం
దిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా విమానాల్లో ప్రయాణికుల మధ్య సీట్లలో ఖాళీ ఉంచడం వల్ల కొవిడ్ వ్యాప్తి ముప్పు తగ్గుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనూ వివిధ దేశాల మధ్య పరిమిత సంఖ్యలో విమాన ప్రయాణాలను అనుమతిస్తున్నారు. అయితే, ప్రయాణ మార్గంలో విమాన ద్వారాలు, కిటికీలు పూర్తిగా మూసిఉంచడం, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడం వంటి అంశాలు వైరస్ వ్యాప్తికి మరింత కారణమవుతున్నట్లు నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో వైరస్ వ్యాప్తి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు(సీడీసీ)తో పాటు కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.
పరిశోధనలో భాగంగా వరుసలో మూడు సీట్లున్న విమానాల మోడల్ను రూపొందించారు. విమాన ప్రయాణికుల సామర్థ్యం పూర్తిగా ఉన్నప్పుడు.. ప్రయాణికుల మధ్య సీటు ఖాళీగా వదిలేసిన సందర్భాల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేశారు. పక్కపక్కనే కూర్చున్న ప్రయాణికులతో పోలిస్తే, ఇద్దరు ప్రయాణికుల మధ్య మధ్య సీటును ఖాళీగా వదిలేయడం వల్ల వైరస్ వ్యాప్తిని 23 నుంచి 57శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇలా విమానాల్లో భౌతిక దూరం పాటించడం వల్ల కచ్చితంగా కొవిడ్ వ్యాప్తిని తగ్గించవచ్చని తాజా అధ్యయనం మరోసారి స్పస్టం చేస్తున్నట్లు సీడీసీ నిపుణులు వెల్లడించారు. సీట్ల మధ్య ఖాళీ వదలడంతో పాటు మాస్కు, ఫేస్షీల్డ్ వంటివి ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విమానాల్లో ఉండే ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ ఆర్ద్రత వాతావరణంలో ఈ అధ్యయనం చేపట్టామని పరిశోధకులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!