స్పష్టమైన అవగాహనతోనే వ్యతిరేకిస్తున్నాం: కేసీఆర్
సీఏఏకి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. కొన్ని నెలలుగా దేశంలో సీఏఏకి సంబంధించి వాదోపవాదాలు
సీఏఏకి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం
హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. కొన్ని నెలలుగా దేశంలో సీఏఏకి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయని వివరించారు. దేశంలో చాలా పరిణామాలు సంభవించాయని పేర్కొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా లౌకికవాదులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు.
‘పార్లమెంట్లో సీఏఏ బిల్లును మేం వ్యతిరేకించాం. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మన వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన అవగాహనతోనే మేం సీఏఏ,ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్నాం. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశ రాజధానిలో పర్యటిస్తున్న సమయంలో అల్లర్లు జరిగాయి.’
‘నాకే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదు. మా నాన్నది తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి. ఈ దేశంలో కోట్లాది మంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు. నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?. దేశంలో ఓటింగ్ జరుగుతోంది.. ఓట్లతోనే ఎవరైనా అధికారంలోకి వస్తాం. ప్రతీ ఒక్కరికి ఓటు ఐడీ కార్డు ఉంటుంది. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు పనిచేయదని ఎలా అంటారు?’
‘సీఏఏని మేధావులు, కవులు, నిపుణులు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. సీఏఏకి వ్యతిరేకంగా కొంత మంది అవార్డులను తిరస్కరిస్తున్నారు. విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా?. ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఉండాల్సిందే. చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరు. మెక్సికో వాసులు రాకుండా అమెరికా గొడనే కట్టింది. భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా?. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహీ, పాకిస్థాన్ ఏజెంట్అంటూ విమర్శలు చేస్తున్నారు.’ అని కేసీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM