ఆ ఇంటి కరెంట్‌ బిల్లు 80 లక్షల కోట్లు!

విద్యుత్‌ బిల్లు మనం అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కవగా వస్తేనే వామ్మో అంటాం. అలాంటిది ఓ సామాన్య వ్యక్తికి వేలు, లక్షలు దాటి కోట్లలో వస్తే..

Updated : 09 Jun 2020 06:45 IST

విస్తుపోయిన ఇంటి యజమాని

భోపాల్‌: విద్యుత్‌ బిల్లు మనం అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కవగా వస్తేనే వామ్మో అంటాం. అలాంటిది ఓ సామాన్య వ్యక్తికి వేలు, లక్షలు దాటి కోట్లలో వస్తే.. అదీ లక్షల కోట్లలో వస్తే.. నిజంగా ‘కరెంట్‌ షాక్‌’ కొట్టినట్లే అనిపిస్తుంది కదూ. అయితే ఇది నిజం. విద్యుత్‌ అధికారుల నిర్వాకంతో మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుందీ ఘటన.

సింగ్రౌలి జిల్లాలో బైఢన్‌ గ్రామంలో ఓ వినియోగదారుడికి విద్యుత్‌ శాఖ సిబ్బంది నిజంగానే షాక్‌ ఇచ్చింది. అది అలాంటి, ఇలాంటి షాక్‌ కాదు.. ఏకంగా రూ.80 లక్షల కోట్ల కరెంట్‌ బిల్లు అతడి చేతిలో పెట్టింది. బిల్లు చూసి యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ భారీ మొత్తంలో ఎన్ని అంకెలు ఉంటాయో లెక్కబెట్టడానికే కష్టంగా మారింది అతడికి. పలు దేశాల బడ్జెట్‌లు కలిపినా ఇంత మొత్తం రాదేమో.! ఇంత భారీ బిల్లును చూసి ఎట్టకేలకు తేరుకున్న అనంతరం విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బిల్లును సవరించి సరైన బిల్లు ఇవ్వాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఈ బిల్లుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇది చూసిన పలువురు నెటిజన్లు విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని